ఆహారం తీర్చడానికి నా దగ్గర నీళ్లు గుస
ఈ దిగుడు బావి నీళ్లు నేను సమరే స్త్రీని. నా చేతిలో మీరు ఎలా తాగుతారు?
నిన్ను నీళ్లు అడిగింది ఎవరో తెలిస్తే మీకు ఈ సందేహమే వచ్చి ఉండేది కాదు.
నువ్వు అడిగి ఉంటే దీనికి బదులుగా నీకు ఆయన జీవ జలమే ఇచ్చి ఉండేవాడు.
జీవజలమా? అవును.
ఈ బావి నీళ్లు తాగితే దప్పిక తీరుతుంది.
కానీ మళ్ళీ మళ్ళీ దాహం వేస్తూనే ఉంటుంది.
కానీ నేను ఇచ్చే జలం తాగితే ఆ తర్వాత దప్పిక అనేదే ఉండదు.
ఆ పవిత్ర జలం ఆత్మను పరిశుద్ధం చేస్తుంది.
శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది.
అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వండి.
ఇస్తాను.
వెళ్లి నీ భర్తను తీసుకురా.
నాకు భర్త లేడు.
నిజం.
పైకి చూసి సంసారం చేసినా ఇప్పుడు వాళ్ళు ఎవరూ నీతో లేరు.
ప్రస్తుతం నీతో ఉన్న వ్యక్తి కూడా నీ భర్త కాడు.
అయినా నీకు భర్త లేడు అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పావు.
ఇలా సత్యాన్ని ఆరాధించే వాళ్ళను నా తండ్రి దీవిస్తాడు.
ఆశ్చర్యం.
నేను ఎవరో తెలియకపోయినా నన్ను చూసిన వెంటనే నా చరిత్ర మొత్తం చెప్పేసారు.
మెస్సియా వస్తాడు ఇలా అన్ని సంగతులు చెప్తాడు మన బాధలు తీరుస్తాడు అని మా పెద్దోళ్ళు చెప్తుంటే విన్నాను.
ఆ మెస్సియ మీరేనా?
అని నువ్వే అంటున్నావుగా.
మీకు ఆహారం తీసుకొచ్చాను.
అవసరం లేదు.
నా ఆహారం వేరే ఉంది.
నా తండ్రి నాకు అప్పగించిన పని పూర్తి చేయటంలో కలిగే ఆనందమే నా ఆహారం.
ఆయన మెస్సియా అంటావా? కావచ్చు. మీకెందుకు అనిపిస్తుంది?
ఆయన మాటలు వింటే ఎవరికైనా ఆయనే రక్షకుడు అనిపిస్తుంది.
పదండి చూద్దాం.
గురూజీ వాళ్ళంతా ఇటే వస్తున్నారు.
ఎందుకు అలా ఆగిపోయారు?
దగ్గరకు రండి.
మేము అంటరాని వాళ్ళం కదా?
మనిషి శరీరానికి కుష్టు వస్తే ఆ రోగిని అంటుకోవడానికి ఇతరులు జంకుతారు.
అదే కుష్టు మనసుకు వస్తే ఆ వచ్చిన వాడు ఇతరులను అంటుకోవడానికి భయపడతాడు.
మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా భావించేవాళ్ళు అలాంటి మానసిక కుష్టు రోగులు.
నన్నెరుపేదలం. మాకు దేవుడు కనిపిస్తాడా?
తప్పక.
అడుగున అట్టడుగున ఉన్న అభాగ్యులే నా తండ్రికి ప్రేమ పాత్రులు.
తోటి పెద్దల నుంచి ఒంటె దూరగలిగిందేమో గానీ తన మదంతో విర్రవీగే వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు.
దేవుని రాజ్యం అంటున్నారు. మరి మీరెవరు?
ఈ ప్రపంచానికి నా తండ్రి పంపించిన వెలుగును నేనే.
జీవాన్ని నేనే. జీవన ఆహారాన్ని నేనే.
స్వర్గం నేనే. స్వర్గానికి మార్గం నేనే.
విశ్వాసంతో నన్ను అనుసరించే వారు ఎన్నటికీ చీకటిలో పడరు.
జీవితమంతా కాంతిమయమే.
నువ్వు చెప్పింది నిజమే. ఈయనే మన రక్షకుడు.
రోహాన్ ఈ రోగులందరూ ఇక్కడ ఎందుకు వేచి ఉన్నారో తెలుసా?
అప్పుడప్పుడు వచ్చి నీళ్ళను కదిలించే దేవదూత కోసం ఎదురుచూస్తున్నారు.
ఆ కదిలిన నీళ్ళలో ముందుగా ఎవరు దూకుతారో వాళ్ళకున్న ఎలాంటి దబ్బైనా వెంటనే నయమైపోతుందనే వాళ్ళ విశ్వాసం.
నా విశ్వాసంతో ఏడేళ్లుగా ఇక్కడ పడున్నాను ప్రభువు.
ఎవరో ఒకరు నాకన్నా ముందు నీళ్ళలో దూకుతున్నారు ప్రభువు.
ఈ పక్షవాతం నుంచి నీకు స్వస్థత కలిగించరా?
కావాలయ్యా.
నీ విశ్వాసమే నీకు ఔషధం.
రక్షించు. రక్షించు.
ఓ రక్షక. నేను నా నా పాపాలను క్షమించు ప్రభువు.
నిన్ను చూడని కీచతడానికి వీల్లేదు కదా?
సామాన్యుడు నన్ను భగవంతుడా.
మాలాంటి పాపాత్ములను ఉద్ధరించడానికి జన్మించిన మహానుభావుడివి ప్రభువు. మహానుభావుడివి.
ఈ పాపాలు క్షమించబడ్డాయి. ఇక మంచిగా జీవించు. వెళ్ళు.
ఇది వాళ్ళ తప్పు కాదు. పండుగ రోజు దేవతలను కొలిచే ఈ రోజున ఇలాంటి రోగులను స్వస్థత పరచకూడదని తెలియదా మీకు? లేక తెలిసే ఈ పని చేశారా?
పండుగ రోజున చెడు చేయకూడదని ఉంది గానీ మంచి చేయరాదని ఏ ధర్మశాస్త్రంలోనూ చెప్పలేదే.
మీ వాళ్ళెవరైనా కాలుదారి బావిలో పడితే సబ్బాతు పండగని వాణ్ని కాపాడటం మానేస్తావా?
మందలో నుంచి ఓ గొర్రె తప్పిపోతే పండగ కాబట్టి ఆ గొర్రెల కాపరి దాని కోసం వెతకకుండా ఉంటాడా?
మూఢాచారాల పొగతో పచ్చిబారిన మీ మనస్సుల్లో మానవత్వం మరణించింది.
మూఢాచారాల సంగతి అలా ఉంచండి.
అందరి పాప పుణ్యాలను సమీక్షించేది ఆ సర్వేశ్వరుడే. ఒక మానవమాత్రుడు కాదు.
ఆ రోగి పాపాలు క్షమించబడినవి అని మీరు ఎలా చెప్పారు?
ఎంతటి ఘోర పాపాలనైనా క్షమించే దయామయుడు నా తండ్రి.
మనుషుల్ని పాపవిముక్తుల్ని చేసే అధికారం ఆ దేవుడే ఈ మనిషి కుమారుడికి ఇచ్చాడు.
సబ్బాతు పండుగ రోజున పక్షవాత రోగికి స్వస్థత కలిగించాడా?
దేవదూత నీళ్ళను కదిలించినప్పుడు మాత్రమే కొలనులో దిగితే రోగాలనే అవుతాయని ప్రజల నమ్మకాన్ని ఆశ్రయం చేశాడన్నమాట.
అంతే కాదు, వాళ్ళ పాపాలను క్షమించే అధికారం తనకు ఆ దేవుడు ఇచ్చాడని గొప్పగా ప్రకటించుకున్నాడు.
అంతగాని అంతం ఎదో చూడంసింది.
తొందరపడకు కైఫాస్.
ఇక ఆలస్యం చేస్తే మా వ్యాపారాలు మూసుకుపోతాయి.
మాతో పాటు అనస్ వారి ఐదుగురు కుమారుల వ్యాపారాలు కూడా మట్టి కొట్టుకుపోతాయి.
మన వ్యాపారాల సంగతి వివాదాంశం చేస్తే మనమే ప్రజలకు దూరం అవుతాం.
మనకు కావలసింది అతను ప్రజలకు దూరం అవడం.
అదెంత సేపు పని?
ఇప్పుడే భటులను పంపించి రప్పిస్తాను.
తిరుగుబాటుదారుడు ఆర్కినాయ్ తో చెప్పి చెరసాలలో వేయిస్తాను.
దాంతో అతను ప్రజలకు శాశ్వతంగా దూరమౌతాడు.
ఆ పని చేస్తే అతని పట్ల ప్రజలకు భక్తి మరింత పెరుగుతుంది.
ఈ మూఢ ప్రజలని అతని ప్రభావం నుంచి తప్పించాలంటే అతను చేస్తున్న అద్భుతాలను కేవలం మాయలు చిత్రీకరించాలి.
మోసగాడుగా నిరూపించాలి.
మతద్రోహి, దైవద్రోహి అని ప్రచారం చేయాలి.
అప్పుడే మత వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకోగలుగుతాం.
యూద సమాజం పై మన ఆధిపత్యాన్ని నిలుపుకోగలుగుతాం.
దీనా జనులు ధన్యు దేవులు, ధన్యు దేవులు.
స్వర్గ రాజ్యం వారికి స్వంతం, స్వంతం.
సౌకర్తలు ధన్యాత్ములు, ధన్యాత్ములు.
దేవుని ఓదార్పు వారికి లభిస్తుంది.
వినయ కాళలే వినయ కాళలే వినయ స్వంతం.
ఈ ధరణి వారికే ధరణి, ఈ ధరణి స్వంతం.
నీతికి నిలబడే సజ్జనులను నిత్యం సంతృప్తి, వారికి వారికి.
ఇతరులను దయగా చూసే వారిని, చూసే వారిని దేవుడు దయపరుస్తాడు.
నిర్మల హృదయులే నీలను కలుస్తారు.
దేవుడు వారికే దర్శనం ఇస్తాడు.
శాంతి కర్తలో ధన్యులు, ధన్యులు.
వారిని దైవ పుత్రులు అని పిలుస్తారు.
ధర్మాచరణలో హింసించబడే వారిని దివ్యలోకపు దైవరాజ్యం అవమానాలకు పాలై నిందలకు లోనయ్యే వారు.
నిజంగా ధన్యులని మిమ్మల్ని పిలుస్తుంది.
అంటే 1000 ఏళ్ళుగా ఇశ్రాయేలు ఎదురుచూస్తున్న మెస్సియా మీరేనా?
అని మీరంటున్నారు.
అయితే రోమల క్రూర పరిపాలన నుంచి నా దేశాన్ని విముక్తి చేయండి.
నేను వచ్చింది రోమల నిరంకుశత్వం నుంచి మిమ్మల్ని విముక్తి చేయటానికి కాదు.
మీలో గూడు కట్టుకున్న ఆశ ద్వేషాలపై అంకుశం వేయడానికి.
తుప్పు పట్టిన ఆలోచనల నుంచి కాల పరీక్షకు నిలవని పాత పద్ధతుల నుంచి మిమ్మల్ని మళ్ళించడానికి.
అంటే మీరు మోషే ధర్మశాస్త్రాన్ని వద్దంటున్నారురా?
లేదు.
ఇప్పుడు చేయవలసింది దాన్ని రద్దు చేయటం కాదు.
పరిపూర్ణం చేయటం.
పూర్వపు ప్రవక్తల బోధనలను ఆచరణ యోగ్యంగా సవరించటం.
ప్రజా జీవితాలు పరిశుభ్రం కావటానికి దైవ దత్తాన్ని రూపొందించటం.
దేవుడి చట్టం అంటే దయ, శాంతి, కరుణ, ప్రేమ.
పొరుగు వాణ్ని ప్రేమించమని పాత శాస్త్రంలో ఉందిగా?
అంతేకాదు, శత్రువుని ద్వేషించమని కూడా ఉంది.
కానీ శత్రువుని సైతం ప్రేమించమని నేను చెప్తున్నాను.
నిన్ను హింసించే వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ స్వర్గంలో తండ్రి సాన్నిధ్యం నీకు దొరుకుతుంది.
మనిషికి మనిషికి, జాతికి జాతికి మధ్య పగలురిగే ఈ కాలంలో మీరు చెప్పేది సాధ్యమా?
కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటు పగలు సాధించుకుంటూ పోతే చివరికి ఈ సృష్టిలో మానవ జాతి మిగలదు.
అందుకే ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా కొట్టమను ప్రతీకార భారం నుంచి విముక్తి లభిస్తుంది.
మీరు చెప్పినంత సహనం రావాలంటే మనిషి ఏం చేయాలి?
ధ్యానం.
దైవ ధ్యానం.
ధ్యాన సమయంలో మనస్సు పూర్తిగా దేవుని యందే లగ్నం చేయాలి.
ఇతర ఆలోచనలేవీ రాకూడదు. ఏ సందేహాలు ఉండరాదు.
స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థించే వారిని నా తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.
మనిషికి ఆధ్యాత్మిక అవసరాలతో పాటు అన్న ఆహారాల అవసరం కూడా ఉంటుంది కదా?
అన్నిటిని ఆ తండ్రి ఇస్తాడు.
గాలిలో ఎగిరే పక్షికి నీటిలో ఈత ఈచే చేపకు ఆహారాన్ని సమకూర్చున దైవం మనిషికి మాత్రమే ఇవ్వడా?
దైవ రాజ్య స్థాపన జరిగిన రోజున ఎవ్వరికీ ఏ లోటు ఉండదు.
అడిగితే ఇవ్వబడుతుంది. వెతికితే దొరుకుతుంది. తడితే తలుపు తెరుచుకుంటుంది.
మీ సంగ్రాహియనే మెస్సియే.
అయితే మన కష్టాలు తీరిపోతాయి.
దేశభక్త సిమోను, నిజమైన ఇశ్రాయేలి బర్తిలోమయ, దిద్మిస్ అనే తోమా, విచ్చ అన్నేసి ఫిలిప్, న్యాయబుద్ధి జేమ్స్, ధైర్యంగా తద్దేయ్.
నా వద్దకు రండి.
ఈ ఆరుగురు తండ్రి కరుణకు పాత్రులయ్యారు.
ఈ పేతురు, ఆండ్రూ, యోహాను, యాకోబు, మత్తయ్యలతో పాటు మీరు కూడా ఈ క్షణం నుంచి అపోస్తులు.
దైవ రాజ్య స్థాపనకే మీ జీవితాలు అంకితం.
మెస్సియా దైవ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పండి.
పరలోకమందున నా తండ్రి, పరలోకమందున నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక.
నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. భూలోకమందును నెరవేరును గాక.
మా అనుదిన ఆహారము మాకు దయచేయుము. మా అనుదిన ఆహారము మాకు దయచేయుము.
మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము, మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మా అపరాధములను క్షమించుము.
మమ్ము సోతనలో చిక్కుకొననియక కీడు నుంచి రక్షింపుము. మమ్ము సోతనలో చిక్కుకొననియక కీడు నుంచి రక్షింపుము.
రాజ్యము, బలము, శక్తి, మహిమ, నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. రాజ్యము, బలము, శక్తి, మహిమ, నిరంతరము నీవై ఉన్నావు తండ్రి.
ఆమెన్. ఆమెన్.
రక్షక.
జనమందరూ ఆకలిగొని ఉన్నారు.
మీరు అనుమతిస్తే వాళ్ళు ఊళ్ళకి వెళ్లి భోజనాలు చేసి వస్తారు.
భోజనానికి ఊళ్ళకు వెళ్ళటం ఎందుకు? ఇక్కడే పెట్టవచ్చు.
5000 మంది పైగా ఉన్నారు. వాళ్ళందరికీ సరిపడే రొట్టెలు కొనాలంటే కనీసం 200 వెండినాడాలుతో వెళ్ళాలి.
మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు.
అసలు ఇక్కడ ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయో కనుక్కోండి.
మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయా రక్షకా.
ఇలా రండి.
ఇప్పుడు వీటిని తీసుకెళ్లి అందరికీ పంచండి.
అలాగే.
అందరూ తృప్తిగా భోం చేశారా పేతురు?
చేశాను రక్షకా. ఇంకా ఏడు గంపల ఆహారం మిగిలిపోయింది.
అంతా నా తండ్రి దయ.