Wednesday 17 January 2024

2000 సంవత్సరాల క్రితమే... ప్రపంచం అంతమైపోయి ఉండాలి🔥

🔥2000 సంవత్సరాల క్రితమే... ప్రపంచం అంతమైపోయి ఉండాలి🔥

⭕ యేసు లోకాంతపు ప్రవక్త! ఆంగ్లంలో Apocalyptic Prophet అని అంటారు. అంటే అతి త్వరలో ప్రపంచానికి అంతం కలుగబోతోంది అని హెచ్చరించడానికి వచ్చిన ప్రవక్త! యేసు అంత్యకాలం ఆ తరంలోనే వస్తుంది ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీయులకు విసృతంగా చాటింపు వేసాడు. అయితే సువార్తలన్నీ కూడా ఒక తరం దాటిన తర్వాత రాయబడ్డాయి అందువల్ల యేసు బోధనలో స్పష్టమైనటువంటి అంత్యకాల సంభవించే సమయం గురించి సువార్తలలో స్పష్టంగా రాయలేదు. అయినా కూడా అంత్యకాలం ఆతరంలోనే వస్తుంది  అని స్పష్టంగా చెప్పిన వచనాలు మనకు మత్తయి 24లో మార్కు 13లో కనిపిస్తాయి!

👉అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.
 
ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
 
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.👈 (మత్తయి 24:30, 34, 35)

ప్రపంచ అంతం ఎలా మొదలవుతుంది, అప్పుడు మనుష్య కుమారుడి రాక ఎలా ఉంటుందో వివరించి ఇవన్నీ జరిగేవరకు ఈ తరం గతించదు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను ఆకాశము భూమి గతించునుగాని నా మాటలు మాత్రం గతించవు - అని స్పష్టం చేస్తున్నాడు.

⭕ ఇదే మార్కులో కూడా కనిపిస్తుంది. 

👉 అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.

ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. 👈 (మార్కు 13:26, 30, 31)

⭕ ఆ మనుష్య కుమారుడు వచ్చే సువార్తను, లేదా ఆ మనుష్య కుమారుడు తీసుకువచ్చే దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను మన ఇజ్రాయిల్ దేశం మొత్తం ప్రకటించండి అంటాడు. అయితే మీకు కచ్చితంగా చెబుతాను మనుష్య కుమారుడు ఎంత త్వరగా వస్తాడు అంటే మీరు ఇజ్రాయిల్ దేశంలోని అన్ని పట్టణాలను ఆయన వచ్చే లోపల కవర్ చేయలేరు. ఎందుకంటే ఆయన అంత త్వరగా వచ్చేస్తున్నారు అని అంటాడు.

👉 వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 👈 (మత్తయి 10:23)

⭕ యేసు చెప్పిన ఈ వాక్యం కూడా మనకు చాలా స్పష్టంగా మనుష్యకుమారుడు దేవుని రాజ్యంతో రావడానికి ఆ కాలంలోనే ఆతరంలోనే జరుగుతుంది అని నొక్కి వక్కాణించడం స్పష్టం చేస్తుంది.

👉 ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 👈 (మత్తయి 16:28)

🔥 అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే! యేసు దేవుడు కాదు కాబట్టి కచ్చితమైన గడియ (Hour) ఆయనకు కూడా తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు అని యేసే స్వయంగా చెప్పాడు! మరి యేసుకేం తెలుసు? యేసుకు తెలిసింది ఈ ప్రపంచ అంతం మనుష్య కుమారుడు రావడం యేసు భూమి మీద ఉన్నప్పటి తరములోనే, ఆ కాలంలో ఆ ప్రజలలో కొందరు మరణం రుచి చూడకముందే అవి కచ్చితంగా జరుగుతాయి అని బోధించాడు. అందుకే ఏసు నాకు ఆదినము ఆగడియ నాకు తెలియదు… ఆ ప్రపంచ అంతం మాత్రం 2000 సంవత్సరాల క్రితం యేసు జీవించిన కాలంలో అక్కడ ప్రజలలో కొంతమంది మరణించక ముందే వస్తుంది అని ప్రచారం చేశాడు దాని తర్వాత ఆయన శిష్యులు కూడా దాన్నే ప్రచారం చేశారు. 

#భ్రమ #వెర్రితనం #లోకాంతం #ప్రపంచాంతం #విఫలప్రవచనం

No comments:

Post a Comment