ఇంతవరకు చెప్పిన జ్ఞాన స్వరూపుడు ఆనంద స్వరూపుడైన పరమాత్మయే దీనికి వైద్యుడు. చికిత్స ఆయనే చికిత్సకుడు ఆయనే చికిత్స జ్ఞానము చికిత్సకుడు విష్ణువును తెలుసుకోండి ఇక్కడ. జ్ఞానం ఒక్కటే మందు సర్వ రోగాలకి. జ్ఞానం ఉన్నవాడిని ఏ దుఃఖం ఏం చేయలేదు. మనం ఏం చేస్తాం అంటే దుఃఖానికి మూలమైన సంఘటన మార్చాలని ప్రయత్నిస్తాం. నీకు జ్ఞానం కలిగితే సంఘటన ఎలా ఉన్నా నీకేం పర్వాలేదు. ఒక బాగా సంపన్నుడు ఒకాయన ఉన్నాడు. ఆయనకేదో కంటికి ఒక రోగం వచ్చింది. మంచి తెలిసిన పెద్దాయన అన్నాడంటే నువ్వు ఎప్పుడు నీలం రంగు చూస్తూ ఉంటే నీకు రోగం పోతుంది అన్నాడు. వెంటనే పెయింటర్స్ ని పిలిపించి తాను ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నీలం రంగు పూయించుతూ ఉంటాడు. ఊరంతా నీలం రంగే. అయితే ఒకాయన వచ్చి ఇంత కష్టపడే కంటే నీళ్ళ కళ్ళజోడు పెట్టుకుంటే అయిపోయింది కదా అన్నాడు ఇక్కడ. అయిపోయిందండి మొత్తం. కానీ ఊరంతా రంగు పూయడం కంటే నువ్వు పెట్టేసుకో. అందుకే సంఘటనలను మార్చే కంటే నీకు జ్ఞానం వస్తే ప్రపంచం అంతా ఆనందమే. అది దృష్టుం జ్ఞానమయం కురుస్వా. ఎవడు దృష్టి జ్ఞానంతో ఉంటుందో వాడికి అంతా ఆనందమేనయ్యా అన్నాడు. అజ్ఞానం ఎవడు నారాయణుడు. తన హృదయంలో నారాయణుడు ఉన్నవాడికి సుఖము, దుఃఖము రెండూ ఉండవు. నిర్వాణమే ఆనందముంటుంది ఇక్కడ. వాడు ఇంకా దేనికి రాగద్వేషాలకి లోను కాడు. ఆ స్థితి రావాలండి. అందుకే భేషజం భిషక్ ఇలాంటి నామాలు చదువుతుంటే రోగాలు పోవా? పోయి తీరుతాయి. తర్వాత నామం అయితే ఇప్పుడు మనకొకటి అర్థమైంది. అన్ని శాస్త్రములకు గమ్యము పరమాత్మ. అంటే పరమార్థ జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడే కలిగేదే ఆనందం. అదే శాంతం. అదే మోక్షం. అందుకే తర్వాత నామములు ఆ పరమాత్మని పొందినప్పుడు మోక్ష స్థితిని వర్ణిస్తున్నాయి చూడండి ఇక్కడ. సామ శబ్దం తర్వాత అది పెట్టడం ఒక ఔచిత్యం. ఆ మోక్ష స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే దాన్ని నిర్వాణం అంటారు ఇక్కడ. నిర్వాణం అనే మాటకు అర్థం ఏంటంటే పరమానందము అని అర్థం ఇక్కడ. ఎందుకు దానికి ఆ పేరు పెట్టారంటే సర్వ దుఃఖములు ఎక్కడ నిర్మూలింపబడుతున్నాయో అలా నిర్మూలింపబడగా కలిగినటువంటి ఆనంద దుఃఖాలు నిర్మూలించబడ్డమే ఆనందం కాదండి. ఆనందం ఏది కొత్తగా వస్తుందా? దుఃఖం పోతే వచ్చేది ఆనందమే. అంటే మనం ఏ దుఃఖం పోయినా ఆనందంగా ఉందని అంటూ ఉంటాం. కానీ మరో దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ అలా కాదు సర్వ దుఃఖములు దేనితో నాశనం అవుతాయో తెలుసుకో అన్నాడు ఇక్కడ. దీనికి అత్యంతిక దుఃఖనాశనము అంటుంది వేదాంత శాస్త్రం. అత్యంత దుఃఖనాశనం అంటే ఇవాళ ఏదో కడుపునొప్పి వచ్చింది దుఃఖం. రేపు తగ్గిపోయింది దుఃఖం పోయింది. ఇలా మనం చాలా చాలా ఆనందాలు అనుభవించేస్తుంటాం. కానీ కడుపునొప్పి వచ్చి తగ్గితే ఆనందం కానీ కడుపునొప్పే రాకపోతే ఆనందంగా ఉంటామా? చెప్పండి. ఎండలో వెళ్ళినటువంటి వాడు చెట్టు నీడ చేరితే అమ్మయ్యా అని ఆనందిస్తాడు. ఎప్పుడు చెట్టు నీడలో ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడా? కనుక దుఃఖ నిర్మూలనం ఆనందమా? ఇది ఆలోచించుకోండి అని చెప్పాడు. అసలు ఆనందం పరమాత్మ స్వరూపం. దానిని పొందగలిగితే దుఃఖమే లేదు. అది స్వస్వరూపం. అందుకు అది అసలైన ఆనందం గనుక అక్కడికి వెళ్ళేటప్పుడు సర్వ దుఃఖాలు నిర్మింపబడ్డాయి. దుఃఖాలు ఎన్ని రకాలు అండి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఇంకా చాలా ఉన్నాయి లేండి. జన్మ ఒక దుఃఖం. వృద్ధాప్యం మరొక దుఃఖం. వారధక్యం తర్వాత వచ్చేది మరణం. అది పెద్ద దుఃఖం. మరణం అయిపోయక దుఃఖమే లేదా? మరో దుఃఖం జన్మ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ లోపల దుఃఖాలను ఏం చెప్పాలా? అందరికీ తెలిసినవి. దాని మీద ఉపన్యాసం అక్కర్లేదు. ఆనందం గురించి ఉపన్యాసం కానీ దుఃఖాల గురించి ఉపన్యాసం అక్కర్లేదు. అనుభవించేదే. ఆనందం గురించి ఎందుకు చెప్పాలంటే ఈ ఆనందమేమో అదే ఆనందమే అని కన్ఫ్యూజన్ ఎక్కువ. అంటే అసలానందం భగవంతుడే. అది ఎలాంటిది అంటే సర్వ దుఃఖములు అత్యంతిక నాశనమైన తర్వాత ఏ పరమానంద తత్వం ఉన్నదో అది నారాయణ స్వరూపం గనుక ఆయనే నిర్వాణము. అక్కడికి చేర్చడమే సర్వ శాస్త్రముల గమ్యం గనుక సామః నిర్వాణం అనే మాట ఇచ్చారు ఇక్కడ. అలాంటి నిర్వాణ స్వరూపుడు. అందుకే అందరి హృదయంలో దుఃఖాన్ని నేను పోగొడుతున్నాను అని భగవానుడు చెప్పుకున్న దాన్నే అధర్వ వేదం చెప్తుంది. అగ్ని హృదయం శోకం తంతే నిర్వాపయామసి అనే మంత్రంలో హృదయంలో ఉన్నటువంటి శోకాన్ని తొలగించేటువంటి అగ్నికి అగ్ని అంటే ఇక్కడ పరమాత్మనార్థంలోనే వేదం వాడింది అది. ఇది గుర్తుపెట్టుకోండి. అటువంటి పరమాత్మను శరణ వేడుతూ కనబడుతుంది. అంతే కాదు భగవాన్ ని సామగానం చేస్తూ ఉంటే మనసుకు ఒక శాంతి లభిస్తుంది. అందుకే తెలివైనటువంటి వారు గానముతో భగవంతుని స్తుతించి ఆయన అనుభూతిని పొందుతారు. భగవత్ అనుభూతే నిర్వాణం ఒక్క మాటలో చెప్పాలంటే. భగవంతుడిని అనుభవానికి తెచ్చుకుంటే అదే ఆనందం. ఆ ఆనందమే లక్ష్యంగా జీవించేవాడు భక్తుడు. ఆ ఆనందమే లక్ష్యంగా జీవించేవాడు యోగి. వాడే జ్ఞాని. అంటే మిగిలిన ఆనందాలు లక్ష్యములు. అది పొందడం లక్ష్యం. అది పొందిన తర్వాత కలిగే స్థితి పేరు నిర్వాణం. అలాంటి నిర్వాణ స్వరూపుడు. అందుకే ఆయన గానం చేస్తే ఎన్ని రకాల ఆనందాలు కలుగుతాయో చైతన్య మహాప్రభువు చెప్తున్నాడు. చేతో దర్పణ మార్జనం, భవమహా దావాగ్ని నిర్వాపణం, శ్రేయః కైరవచంద్రికా వితరణం, విద్యావధూజీవనం, ఆనందాంబి వర్ధనం, ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం. సర్వాత్మ స్నపనం, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అన్నాడు. భగవత్ సంకీర్తనము సామగానమే మరొకటి ఏం ఉన్నది? వేదముల్లో తద్రూపంలో చేస్తే వేదజనితమైన సంగీతము ఆ పని చేస్తుంది. భగవత్ గానం యొక్క మహిమ ఏమిటంటే ముందు చేతో దర్పణ మార్జనం చిత్తం అనే అద్దాని శుద్ధి చేస్తుంది. భవ మహా దావాగ్ని నిర్వాపణం సంసారం అనే దావాగ్నిని తొలగిస్తుంది. ఏం చేస్తుంది? దావాగ్ని నిర్వాపణం. నిర్వాణం. తీసుకోండి. సంసారం అనే దావాగ్నిని చల్లార్చుతుంది. ఇది చల్లారు అంత తేలిక కాదండి. ఇది నిరంతరం కాలుతూనే ఉంటుంది. ఏంటంటే చిన్న తోట కాదు అగ్ని అరణ్యం. భవారణ్యపు అగ్ని ఆ దావాగ్నిని ఉపశమింప చేసే శక్తి భగవత్ సంకీర్తనకు ఉంది. అందుకే భవ మహా దావాగ్ని నిర్వాపణం శ్రేయః కైరవ చంద్రికా వితరణం. శ్రేయస్సులు అనే కలువులను వికసింపజేసే వెన్నెల వంటిది అన్నాడు. వెన్నెల వస్తే కలువులు ఎలా వికసిస్తాయో భగవత్ సంకీర్తన కలగగానే శ్రేయస్సులు అలా కలుగుతాయి అని చెప్పాడు ఇక్కడ. శ్రేయః కైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం. ఏమి అందమైన మాట చెప్పాడండి. విద్యలనే వధువులకి ఇదే జీవనం. అంటే విద్యలకి భగవత్ సంకీర్తనమే జీవనము. ఆ సంకీర్తన లేనప్పుడు విద్యలన్నీ వ్యర్థమే. భగవంతుడిని కీర్తించనప్పుడు విద్యలన్నీ వ్యర్థమే. ఆ మాటేగా నారదుడు వ్యాసుడికి చెప్పి అందుకే భాగవతం రాయవయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఎన్ని కబుర్లు చెప్పండి. ఎంత మేధో విన్యాసాలు చేయండి. భగవత్ సంకీర్తన లేనప్పుడు అవన్నీ వ్యర్థమే. అందుకే తులసీదాస్ ఒక మాట చెప్తాడు. నేను రామాయణం రాయడానికి సిద్ధపడ్డాను కానీ నాకు అంత శక్తి ఉందా? అయినప్పటికీ రాముని కీర్తిస్తున్నాను గనుక నా దేవశాలలు ఉన్నా పోతాయి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన అటువంటి వాడు. సంకీర్తనకున్న శక్తి ఇది. ఆ కారణం చేతనే విద్యావధూజీవనం, ఆనందాంబి వర్ధనం. పున్నమొస్తే సముద్రం పొంగుతుందట. భగవత్ సంకీర్తన కలిగితే ఆనందం అనే సముద్రం పొంగుతుంది. ఆనందాంబి వర్ధనం. ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం. భగవత్ సంకీర్తన చేసినప్పుడు అందులో ప్రతి పదంలో పరిపూర్ణమైన ఆనందం అనే అమృతము మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అంతే కాదు బాగా తాపంతో దాహంతో ఉన్నవాడు ఒక జలపాతం కింద నిలబడ్డాడు అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది? షవర్ మొత్తం పోతుంది. అలాగే మొత్తం తడిపి శుద్ధం చేయగలిగేటువంటి శక్తి భగవత్ సంకీర్తనకు ఉంది కనుక సర్వాత్మ స్నపనం, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అది దుఃఖాలన్నటిని అంతం ఉందించేటువంటిది ఏదో ఆ ఆనందమే నిర్వాణం. అంతేగాని దుఃఖాలు అంతమవగా మిగిలిన ఏ ఆనందం ఉన్నదో ఆ ఆనంద స్వరూపుడు గనుక నిర్వాణం. అంటే పరమగతి కేవల ఆనంద స్వరూపుడు. అసలు అసలు అదే మనకు మందు అండి. ఇది అది మందు కాదు. భగవత్ సంకీర్తనే మందు. అందుకే చాలాదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు జాలెల్ల నడిపించు సంకీర్తనం, సామజము గాచినది సంకీర్తనం, సామమునకెక్కుడి సంకీర్తనం అన్నాడు రఘునాథాచార్యుల వారు. సామజము గాచినది. అంటే ఏనుగుని కాపాడింది భగవత్ సంకీర్తనమే అవునా లేదా? గజేంద్రుడిని కాపాడినటువంటిది. అంతేగాని సామమునకు ఎక్కుడు. వేదంలో సామగానం కంటే గొప్పది ఈ సంకీర్తనం అన్నాడు. అంటే వేదంలో సామగానం అనేది కొందరు స్పృహ లేకుండానే చేయొచ్చు. ఏది సామగానం చేసి విద్యా ప్రతిష్టన చేసి దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ సంకీర్తన కేవలం భగవత్ భక్తితో భగవత్ అనుభూతితో ఉంటుంది కనుక దాన్ని ఎక్కువగానే భావన చేశారు కొందరు. అందుకే అదే గొప్ప మందు గనుక భేషజం తర్వాత మాట. ఇంతవరకు సామగానము చేయువాడు, సామము ద్వారా తెలియబడువాడు వాడు అన్నాం. అసలు సామమే భగవంతుడు అన్నారు తర్వాత నామం. అంటే తriసామ, సామాగత్ సామాః. సామమే భగవానుడు. సామము అనగానే ఇంతకు ముందు చెప్పాను అనుకూల పరచుకునేటటువంటి ఒకానొక పద్ధతిని భగవత్ స్వరూపంగానే భావించాలి ఇక్కడ. అందుకే ఆ సామరూపంలో ఉన్నటువంటి వాడు ఈ మాట తన గీతంలో చెప్పాడు జాగ్రత్తగా వింటే. వేదానాం సామవేదోస్మి. వేదముల్లో సామవేదాన్ని నేనే అని తెలిసి తెలియజేశాడు కదా. ఇంతవరకు వేదపరంగానే మనం చెప్పుకుంటున్నాం. సర్వదుర్వ్యాసః తర్వాత వచ్చినటువంటివి వేద సంబంధమైన నామములే. అందుకే వేదముల్లో సామవేదం ఆయన స్వరూపం ఉన్నప్పుడు ఒక్క దాని గురించి శ్రేష్టత్వం చెప్తే అన్నీ చెప్పినట్లే. మరి విభూతి కదా. వేదములన్నీ భగవత్ స్వరూపములేనా? మళ్ళీ వేదముల్లో సామమునకు ఉన్న ప్రాధాన్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. పైగా సామ శబ్దానికి ఇంకొక అర్థం పరమార్థమే అది కూడా. వైదికమైన అర్థమే. శతి అంతం కరోతితి సామః. లేదా శతి అంతం కరోతి సామ. సామము అనే మాటకు అర్థం ఏమిటి అంటే అంతం ఉందించువాడు. అంటే నాశనం చేయువాడని కాదు దానికి అర్థం. అంతం అనే మాటకు అర్థం ఏంటంటే దేనితో పూర్తవుతుందో అది అంతం. అందుకు సర్వ వేదములు, సర్వ కర్మలు దేనియందు లయమవుతాయో ఆ బ్రహ్మమునకే సామము అని పేరు. అది వేదంలో ఒకానొక మంత్రము మంత్ర పద్ధతికి మాత్రమే సామము కాదు. పరమాత్మ పేరు సామము. ఎందుకంటే వేదములన్నీ పరమాత్మనే చెప్తూ దాని ద్వారా వచ్చే జ్ఞానం ఏది? చెప్పండి వేదముల ద్వారా వచ్చే జ్ఞానం ఏది? పరమాత్మ జ్ఞానమే వేదములకు ఉద్దేశం. మొదట కర్మకాండ ఉంది. తర్వాత ఉండేది జ్ఞానకాండ. అంటే దేనితో పూర్తయింది వేదం? జ్ఞానకాండతో పూర్తయింది. అంటే వేదములకు పూర్తది జ్ఞానమే. ఎందుకు జ్ఞానం? జ్ఞానమే భగవంతుడు. జ్ఞానం ద్వారా భగవంతుడు గనుక అదే జ్ఞానకాండ వేదములకు పూర్తి గనుక వేదాంతం అని పేరు దానికి వచ్చింది. వేదాంతం అంటే ఇదే అర్థం అండి ఇక్కడ. ఎందుకంటే జడ్జ్మెంట్ తోనే వాదన పూర్తవుతుంది. అవునా లేదా? వాడు వీడు బోల్డు వాదించినా చివరికి జడ్జ్మెంట్ తో క్లోజ్. అలాగ వేదము యొక్క జడ్జ్మెంట్ ఏదో అది ఉపనిషత్తు. అందుకే దానికి జ్ఞానానికి వేదాంతం అని పేరు. అది ఎవరిని తీసుకెళ్తుంది? పరమాత్మ వైపే తీసుకెళ్తుంది. సర్వే వేదాః యస్పదమామనంతి అన్నట్లుగా సామము అంటే సర్వ శాస్త్రములకు చివరిదైనటువంటి అంతమైనటువంటి జ్ఞాన స్వరూపుడు. ఇవన్నీ అందులో లీనం అవ్వడానికే పుట్టాయి. ఎందుకయినా శాస్త్రాలు చదువుతామంటే పరమాత్మను పొందడానికి. తడుముకోకుండానే చెప్పాలి. కానీ శాస్త్రములకు గమ్యం ఆయన. అక్కడికి చేరిన తర్వాత మిగిలేది ఎవరు? ఆయనే మిగిలాడు. నదులు సముద్రానికి చేరి ఏది మిగిలింది? సముద్రమే మిగిలింది. కనుక సామము అంటే పరమాత్మ అని అర్థం చెప్పుకోవాలి. అన్నిటిని పరిపూర్ణం చేయువాడు అది. అంతే కాదు ఇంకొక అర్థంలో అంతమొందించువాడు అన్నారు గనుక అని సామాహః ఎలా అయ్యాడు అంటే తనను గానం చేసే వారి పాపాలను అంతమొందిస్తాడు గనుక సామాహః అని అర్థాన్ని కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పిన ఆ శబ్దంలో ఎన్ని అర్థాలు కనబడుతున్నాయి. సామగస్సామః. అయితే ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది. అన్ని శాస్త్రములకు గమ్యము పరమాత్మ. అంటే పరమార్థ జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడే కలిగేదే ఆనందం. అదే శాంతం. అదే మోక్షం. అందుకే తర్వాత నామములు ఆ పరమాత్మని పొందినప్పుడు మోక్ష స్థితిని వర్ణిస్తున్నాయి చూడండి ఇక్కడ. సామ శబ్దం తర్వాత అది పెట్టడం ఒక ఔచిత్యం. ఆ మోక్ష స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే దాన్ని నిర్వాణం అంటారు ఇక్కడ. త్రిసామ, సామాగత్ సామా, నిర్వాణం, భేషజం, భిషక్, సన్యాస కృత్, శమః, శాంతః, నిష్ఠ, శాంతిహి, పారాయణం. త్రిసామా. మూడు సామములు కలవాడు అన్నాడు ఇక్కడ. అయితే వేదం ఋగ్యజుస్సామములు అయినప్పటికీ కూడా ఒక్క సామము గురించే ఎందుకు చెప్పారు అంటే విశేషం ఏంటంటే వేదముల్లో సామగానానికి ఒక ప్రాధాన్యం ఉన్నది ఇక్కడ. కొన్ని ఋగ్వేద మంత్రములే సామవేదాలని కూడా గోచరిస్తుంటాయి. కొన్ని మొత్తం సామవేదం అంతా ఋగ్వేద మంత్రములు అని కాదు గానీ ఋగ్వేదంలో శ్లోక రూపంగా చెప్పబడుతూ అంటే వాళ్ళు శ్లోకమని అనొచ్చు గానీ శ్లోక శబ్దం అక్కడ వాడరు. మంత్రమే అది. అక్కడ మంత్రముగా పలకబడేవి గాన రూపంలో సామగానంలో ఉంటాయి. ఆ సామగానం యజ్ఞంలో చాలా ప్రధానంగా చెప్పబడుతుంది ఇక్కడ. ఎందుకంటే యజ్ఞం చేసేటప్పుడు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికే కదా యజ్ఞం చేస్తారు. ఎవరైనా మనకు అనుకూలం కావలి కోసం యజ్ఞాది క్రియలు. దేవతలు అనుకూలం కావాలి అంటే వాళ్ళని ఏ విధంగా అనుకూల పరచగలం ఏ ద్రవ్యాలు ఇస్తాం వాళ్ళిచ్చిన ద్రవ్యాలే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళని ఆనందపరిచేది ఏంటంటే ఆ గానం. సామగానం. దేవతల్ని అనుకూలపరచుకోవడమే సామము అంటే లొంగదీసుకొనుట అని అర్థం ఇక్కడ. దేవతల్ని మనకు అనుకూలంగా చేసేటువంటి గాన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సామము అంటారు. ఈ సామములు మూడు ఉంటాయి. దేవవ్రతములు అని పేరు ఈ మూడింటికి కలిపి. ఆ మూడు సామములు బృహత్సామము, రథంతర సామము, వామదేవ సామము లేదా వామ దివ్య సామము అని చెప్పబడుతూ మూడు సామములు ఉన్నాయి. ఈ మూడు సామములు కూడాను సర్వ దేవతా రూపుడైన నారాయణుడిని స్తుతించేవి గనుక త్రిసామః మూడు సామముల రూపంలో ఉన్నటువంటి వాడు. అందుకే సామా గాయత విప్రాయ ఇచ్చాదుల విషయములు ఋగ్వేదంలోనే మంత్రం కనబడుతుంది. సామగానం అంత ప్రధానమైనటువంటిది. అంతే కాదు గాయత్రి కూడా త్రిపద మూడు పదములుగా ఉన్నది గనుక అకార ఉకార మకారమైన ప్రణవము మూడు పాదములతో ఉన్నటువంటి గాయత్రి ఋగ్యజుస్సామాత్మికమైన గాయత్రిని కూడా త్రిసామా అంటే మూడు విధములుగా పలకబడుతూ ఆ భగవంతుని దేవతని మనకు అనుకూలం చేయుదు గనుక త్రిసామా అని గాయత్రి కూడా చెప్పవచ్చు అన్నారు పెద్దలు. మొత్తానికి మూడు సామములు అయినది కదా. అంతే కాదు సామాగః సామాగః. గః అంటే సామము ద్వారా గమ్యతే పొందబడువాడు. సామము ద్వారా తెలియబడువాడు ఎవడో అందురు పరమాత్మను. అంటే సామములకు లక్ష్యమైన వాడు. ఇది ఒక అర్థము. సామాగః అంటే సామగానము చేయువాడు. సామగానం చేసే వాళ్ళందరూ విష్ణు స్వరూపులా అంటే సామగానం చేయడం చిన్న విషయం కాదు. ఆ గానము భగవంతుని నుంచి ముందు ముందు వచ్చింది. వేదములన్నీ ముందు భగవంతుని నుంచి శబ్ద రూపంగా వచ్చేవి కదా ఋషులు వినగలిగి మనకు అందించారు. కనుక మొదట సామము ఎవరి నుంచి వినబడింది? భగవాన్ నుంచి వినబడింది గనుక సామగానము చేయువాడు అని కూడా చెప్పారు. అయితే ఆ రూపంగా సామగానం చేసేటటువంటి వేదవేత్త కూడా భగవత్ విభూతి గలవాడే గనుక సామగానము చేయువాడు అది నారాయణ విభూతిన వారు చెప్తున్నారు. ఎందుకంటే సామగానం చాలా విశేషమైనది గనుకనే ఆ గానాన్ని చెప్పారు. అయితే గానం అంటే అర్థం ఏమిటి? తెలియదు కదా గాన శబ్దం మనం సంగీతానికి గానం అంటారు. ఆ మాటకు వస్తే భారతీయ సంగీతం సామవేద జనితమని అందరికీ తెలిసినదే. మన త్యాగయ్య కూడా సామా నిగమ చతుధా మయ గాన విధి గుణ శీల దయాల వాల మాం పాలయ సామజ వర గమనా అని కీర్తనలో సామా నిగమజ అంటే సామవేదము నుంచి కలిగినటువంటి అని తెలియజేశారు. ఆ సామగానం ఏదో దాన్లే సంగీతానికి మాతృక భారతీయ సంగీతానికి మాతృక. సామము దేనికి? ఇది గుర్తుపెట్టుకోండి సామ దండ భేదోపాయం మాట విన్నారు కదా. అంటే మీరు రాజనీతిలో రాజకీయాల్లో మొదట సామము ఎవరితోను వెళ్ళగానే యుద్ధానికి వెళ్ళిపోకూడదు. మంచి మాటలు చెప్పి మంచి మాటలతోనే పని చేయించాలి. అది కూడా కుదరకపోతే బెదిరించడం. అది భేదం. అది కూడా కుదరకపోతే ఇలాగ సామదాన ముందు దానం. వాడు మాటలతో లొంగకపోతే ఏదో ఆఫర్ చేయాలి. లేకపోతే బెదిరించాలి. అది కుదరకపోతే అప్పుడు దండనంలోకి వెళ్తాం. కానీ మొదటిది ఏది? సామ. అందుకే అక్కడ సామ శబ్దం వేశారు. అంటే చక్కటి భావంతో సద్భావంతో అనుకూల పరచుకోవడమే సామము. ఇది రాజనీతిలో రాజులని అనుకూల పరుచుకోవడం. శత్రువులను అనుకూల పరుచుకోవడం. కానీ దేవతలను అనుకూల పరుచుకోవడం. అందుకే భారతీయ సంగీతం యొక్క పరమార్థం దేవతా ప్రసన్నత. అంతేగాని ప్రజలు చప్పట్లు కొట్టాడు కాదు ఇక్కడ. భగవంతుడిని అనుకరించాలి. అందుకే దేనికిరా సంగీతం అంటే భగవత్ ప్రీతి కోసం అని భావించినటువంటి సంస్కృతి మనది. కారణం వేదం నుంచి కలిగిన సంగీతం మనది గనుక వేద ప్రయోజనం ఏమిటి? సంగీత ప్రయోజనం అయింది. ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళే మనకు సంగీతంలో ఆచార్యులుగా చెప్పబడుతున్నటువంటి త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితలు ఇత్యాదులు అందరూ కూడాను ఈ సామగానంతోనే భగవంతుని ఆరాధిస్తూ సామగాన లోల అన్నారు. అదే విధంగా వేదశిరోమాతృ సప్తస్వర నాధాచల దీపా అని త్యాగయ్య గారు చెప్పడమే కాకుండా నాదతనుమనిశం శంకరం నమామి తే మనసా శిరసా మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటూ సంగీతానికి మాతృక సామ అనేటటువంటిది ఒక సంగీతకారుడు చెప్తే బాగుంటుంది. మనం చెప్తే ఏమిటి? ఆయన్ని మించిన సంగీతజ్ఞుడు ఎవరున్నారు? వాగ్గేయకారులు. సంగీతంలో మహా నిధి ఆయన. ఆయన ఆ విధంగా నిరూపిస్తూ చాలా చెప్పాడు.అటువంటి
అటువంటి సామగః సామగానము చేయువాడు సామము ద్వారా తెలియబడువాడు సామమును గమ్యమైనవాడు. ఇంతవరకు సామ గానము చేయువాడు సామము ద్వారా తెలియబడువాడు అన్నం. అసలు సామమే భగవంతుడు అన్నాడు తర్వాత. అంటే త్రిసామ సామగ సామః. సర్వశాస్త్రార్థం ఒకటే బ్రహ్మ జీవైక్యం లేదా జీవ బ్రహ్మైక్యం. దాన్ని చెప్తున్నటువంటి స్వరూపంగా వ్యాసుని భావించాలి. పైన నీలకాంతులుతో ప్రకాశిస్తున్న తనుగ ఆయనది. అటువంటి వ్యాసని మన శంకరులను కూడా అలాగే భావన చేస్తాం. అలాంటి వ్యాసుడు సర్వదుక్ వ్యాసః. అన్ని విజ్ఞానములు అయినవే. ఇది విజ్ఞానంలో ఎన్ని ఉంటాయో ఒకటే జ్ఞానం కదా అంటే బ్రహ్మజ్ఞానం ఒకటే అయినప్పటికీ దాన్ని పొందడానికి రకరకాల ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలన్నీ వేదమే ఇచ్చింది మనకి. అంటే యోగము కావచ్చు, ఉపాసన కావచ్చు, కర్మలు కావచ్చు, ధ్యానము కావచ్చు ఇత్యాదులన్నీ కూడా వేదముల నుంచి వచ్చాయి గనుక ఇన్ని రకాల జ్ఞానములు. అలాగే పరావిద్యలు అపరావిద్యలు లౌకిక విద్యలు పారమార్థిక విద్యలు. ఇవన్నీ మనకి ఇచ్చినది వేదాది శాస్త్రములే. ఈ సర్వ శాస్త్ర జ్ఞానం ఎవడికుందో వాడు సర్వదక్. ఆ జ్ఞానాన్ని లోకానికి విస్తరించి ఇచ్చినవాడు వ్యాసుడు. ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. అసలు పేరు కృష్ణుడండి. ద్వీపంలో పుట్టాడు గనుక ద్వైపాయనుడు. వేదములను వ్యాసము చేశాడు గనుక వేదవ్యాసుడు అని వచ్చింది. అయితే వేదవ్యాసుడు వేదవ్యాసులు కూడా ఇప్పటి మన్వంతరంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. రాబోయే మన్వంతరంలో వ్యాసుడు మారతాడు. ఇదివరకు మన్వంతర మన్వంతరాలు కూడా వ్యాసులు మారారు. కనుక ఎందరో వ్యాసులు మారతారు. అయితే అందరు ఏ వ్యాసుని మనం పట్టుకోవాలి అంటే మన కాలం నాటి వ్యాసుని మనం ఉపాసన చేయాలి. ఆయన కృష్ణద్వైపాయనుడు పరాశర పుత్రుడు సత్యవతి తనయుడు అయినటువంటి వ్యాస భగవానుని మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అయితే వ్యాస అన్నప్పుడు సర్వ మన్వంతరాల్లో వచ్చే వ్యాసుని కూడా ఇక్కడ భావన చేయాలి. ఎందుకు ఈ వ్యాసుడు వచ్చాడు అంటే బ్రహ్మదేవుని నుంచి వేదములు వచ్చిన తర్వాత ఆయా మహర్షులు స్వీకరించారు. తర్వాత కాలాల్లో ఆ వేదమును పద్ధతిగా అందించి చేయాలంటే ఎలాగా అని బ్రహ్మకు ఆలోచన వచ్చి దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఓం అని శబ్దాన్ని ఆయన పలికాడు. ప్రణవ ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఆ శబ్దములోంచి నారాయణుడు తేజస్సుక రూపంతో బయటకు వచ్చింది. అది చూసి ఎవరా అని చూస్తూ ఉంటే అప్పుడు నారాయణుడే తెలియజేశాడు. ఈయన పేరు అపాంతరతముడు. అపాంతరతముడు అప అంతరతమః. లోపల చీకటిని పోగొట్టువాడు. పేరే ఎంత బాగుందండి. బయట చీకటి పోగొట్టడం కదా అంతరతమః అప. అప అంటే తొలగించుట. లోక లోపలి చీకటిని పోగొట్టువాడు ఈయన. ఈయన పేరు అపాంతరతముడు. ఈ అపాంతరతముడే వివిధ మన్వంతరాల్లో వివిధ మహర్షులుగా వచ్చి వేదములను వ్యాసం చేస్తాడు గనుక ఆయా మన్వంతరాల్లో వ్యాసుడుగా వచ్చేది అపాంతరతముడైన నారాయణుడే. కనుక వ్యాసుడు అంటే ఎవరు అపాంతరతముడైన నారాయణుడి యొక్క స్వరూపము. ఇది తెలిసుకుని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఇది వ్యాసుని యొక్క అసలు స్వరూపము. ఇది ఎక్కడ చెప్పబడుతుంది అంటే మహాభారతంలోనే శాంతన శాసనకాలోనే భీష్మపితామహుడు వ్యాసుని గురించి తెలియజేస్తాడు. నేటికి ఉన్నటువంటి ఆచార్య స్వరూపం మహర్షి స్వరూపం వ్యాసులు వారు. నేటికి ఉన్నార మహాభావులు. ఆయన్ని చూసిన కొందరు సిద్ధులు ఉన్నారు. ఆ వ్యాస భగవానుడు అనునిత్యము తన సూక్ష్మ శరీరంతో నిత్యం వైకుంఠానికి వెళ్లి విష్ణు దర్శనం చేసి వస్తుంటాడు అన్న విషయం కూడా మహాభారతంలోనే చెప్పబడుతుంది ఇక్కడ. అటువంటి వ్యాస స్వరూపంలో మనం ధన్యుదమయ్యాం. ఆ వ్యాసునిటువంటి వాడు అంటే వాచస్పతి రయోనిజః అన్నారు ఇక్కడ. వాచస్పతిహి అయోనిజః రెండు మాటలు గానీ ఒక నామంగానే ఇక్కడ చెప్తున్నారు. వాచస్పతయే అయోనిజాయ నమః అన్న నామంగా మనం చెప్పుకోవచ్చు. వాచస్పతి అంటే వాక్కులకు పతి. అంటే విద్యలకు పతి అయిన వాడు అంటే ప్రభుత్వం. విద్యల మీద పూర్ణ అధికారం కలిగినవాడు సర్వ విద్యా జ్ఞానములు కలిగినవాడు వాచస్పతి. ఆయన అయోనిజుడు. అంటే మాతృగర్భంలోంచి కలగలేదు. అట్టి పట్టివాడు. అయితే ఈ రెండు మాటలు వాచస్పతి అయోనిజః బ్రహ్మదేవుడికి వర్తిస్తాయి. బ్రహ్మదేవుడికి అయోనిజుడు అనే పేరు ప్రసిద్ధి. ఆయనే వాచస్పతి. వాగ్దేవతకు పతి. అసలు ముందు వేదాలు ఆయన నోట్లోంచి వచ్చాయి గనుక ఆయనే వాచస్పతి. బ్రహ్మదేవుడికి వర్తిస్తాయి. ఆయన కూడా మన గురువే. అది నారాయణం పద్మభౌమ వసిష్టమంటాం కదా పద్మభౌమ అయినటువంటి బ్రహ్మదేవుడు విష్ణువు తర్వాత గురువు ఆయన. అంటే పరమేశ్వరుడు తర్వాత గురువు ఎవరు బ్రహ్మదేవుడే. కనుక బ్రహ్మదేవుడు అనగానే మనం తెలుసుకోవాల్సింది మనకందరికీ గురువు ఆయన. ఆయన నుంచి భగవానుడు వేదములను అందించాడు. అటువంటి బ్రహ్మను గ్రహించిన మహర్షులందరికీ అది పెరిగింది. అందుకు వాచస్పతియే అయోనిజః అంటే బ్రహ్మదేవుడు రూపంలో ఉన్నటువంటి వాడు. తద్రూపంగా విద్యలను ఇచ్చినవాడు అనే భావమే కాకుండా బ్రహ్మదేవుడు నోటంత ఈ సరస్వతి సరస్వత్ అంటే సరస్వత్ శబ్దం వచ్చింది కదా దాని నుంచి వచ్చాడు అపాంతరతముడు. అందుకే ఆయన పలుకుల నుంచి వచ్చినవాడే తర్వాత ఈ వేదములన్నిటికీ వ్యాసము చేశారు గనుక ఆయన వాచస్పతి అయ్యారు. అయితే సత్యవతి గర్భంలో నుంచి వచ్చినట్టు కనబడినప్పటికీ కూడా పరాశరుడు తన విష్ణు తేజస్సు సత్యోగర్భంగా వచ్చు. ఇలా వెళ్లి అలా అవతరించి వచ్చేశాడు ఆయన ఇక్కడ. కాబట్టి అది అయోనిజ తత్వమే అని చెప్తూ వాచస్పతి రయోనిజః అని వ్యాదవ్యాసునికి ఈ నామాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట అపాంతతముడు ఎలా వచ్చాడు దాని అసల వ్యాస స్వరూపం. ఆయన మాతృగర్భంలో నుంచి వచ్చాడా? అలా వచ్చాడు అంటే అతభూయోదదశృస్వ భూశబ్దే నానువాదయన్ సరస్వతి పుత్రచారాన్ అత్ర సారస్వతో భవత్. అంటే ఆయన నోట్లోంచి శబ్దం వచ్చింది బ్రహ్మదేవుని నుంచి. ఆ శబ్దములోంచి వచ్చాడు గనుక ఆయన మాతృగర్భంలోంచి రాలేదు. అపాంతరతముడు ఆయనే అనేక వ్యాస రూపాలు అవతరించి వచ్చినప్పుడు అయోనిజుడు అయ్యాడు. ఆయన మాతృగర్భంలోంచి రాక వచ్చిన వాడు గనుక అయోనిజుడు అయ్యాడు. వేదవ్యాసం సంబంధించినటువంటి మాటగా ఈ స్తోత్రీకరణ జరిగింది. తర్వాత వేద స్వరూపము తర్వాత చెప్తున్నారు త్రిసామ సామగ సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత శమశాంతః నిష్టా శాంతిహి పరాయణం. మహాభారతం తర్వాత ఉపదేశింపబడుతున్న విష్ణు సహస్రనామ విద్యలో నిన్నటి రోజున సుధన్వా ఖండపరసుహు దారుణో ద్రవిణప్రదః నామా వరకు చెప్పుకున్నాం. ఇందులో గొప్ప ధనస్సు శత్రువులని ఖండించి ఖండగొట్టలి ధరించినటువంటి స్వామి యొక్క రూపాన్ని తెలుసుకోవడమే కాకుండా ఖండపరసు శబ్దంలో విభజించి పాలన చేసి సరైన కాలంలో జగత్తును లయంపు చేయువాడున్న అర్థాన్ని కూడా మనం వేదపరంగా చెప్పుకున్నాం. దారుణః క్షీణించువాడు అని రెండు విధములుగా చేయువాడు. రెండు విధములు అంటే రెండే ఉన్నాయి బంధం మోక్షం. ఈ రెండు కలిగించేవాడు దారుడ అని చెప్పుకోవచ్చు. ద్రవిణప్రదః తర్వాత ద్రవిణప్రదః అంటే ధనమును ఇచ్చువాడు. ద్రవిణం అంటే సంపద. సాయపగుర్తిబ్యాం ద్రవిణం బ్రహ్మవర్త్యసం వయ్యంతత్వాం అని చెప్పారు. ఆయుషు సంపదలు ద్రవిణం అంటే సంపద అని చెప్తూ అలాగే జ్ఞానం ప్రసాదించేవాడు కూడా ద్రవిణప్రదుడు. ధనమును ఇచ్చువాడు. అయితే ద్రవిణం అనే శబ్దానికి కూడా కథ అనునది అని అర్థం. గమన లక్షణం కలిగినవి ద్రవతి గచ్చతి ద్రవిణం అంటే మాత్రం ద్రవిణం. ద్రవిణం అంటే విద్య కూడా ప్రతి ఒక్కరికి వచ్చేదే గనుక ద్రవిణం అనే శబ్దం దానికి చెప్తున్నారు. అయితే గొప్ప ధనము ఏమిటి అయ్యా అంటే ఇప్పుడు వరకు ఉన్నవాళ్ళు చెప్పగలరు. జ్ఞానమే గొప్ప ధనం. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అన్న అర్థం చెప్తే జ్ఞాన ప్రదాయికుడైనటువంటి భగవానుడు దివిస్పృక్. ఒకే పదం విష్ణు శాస్త్రంలో దీన్ని దివిస్పృక్ అని కూడా చదువుకుంటూ ఉంటాం. ఈయన పరవస్థానం దివిస్పృక్ సదబం జ్ఞాతో వాచస్పతి రయోనిజః. దివిస్పృక్ దివిస్పృక్ అంటే జిలోకం అని పైన అంటే పైన ఉన్న లోకం పేరు జిలోకం. దాటినవాడు అంటే విరాట్ పురుషుడుగా ఆయన అని శిరస్సుతో ఆకుతున్నాడు అని చరిత్ర రాసినప్పుడు ఉంటుంది. దీని గురించి మనం చెప్తూ శిరోజ్యౌహు ముఖమపి దఖనే అంటున్నాం కదా భూపాదౌ యస్య నాభిహి శ్లోకంలో శిరోజ్యౌహు అంటే జ్యౌహు ఏదో అదే జిలోకం. అది దివి. ఆ దివిని స్పృక్ అంటే స్పర్శించినవాడు తాకినటువంటి వాడు అని. అంతవరకున్న విరాట్ రూపాన్ని ఒక్కసారి మనం స్మరించుకుంటున్నాం. అంతే కాకుండా మరొక అర్థంలో ఈ స్వరూపాన్ని భావన చేస్తూ పరమోన్నతమైన జ్ఞానమే తివి. దానిని స్పర్శించుట అంటే దానిని అనుభవింప చేసేటటువంటి వాడు ఎవడో అది దివస్పృక్ అన్న అర్థం చెప్తూ నభస్పృశం దీప్త మనంత కాయం అంటూ భగవద్గీతలో కృష్ణ విరాట్ రూపాన్ని చూసినప్పుడు అర్జునుడు ఇదే మాట అంటాడు నభస్పృశం. అక్కడెక్కడో నభస్సుని నీ యొక్క శిరస్సు తాకుతుందయ్యా అంటే అంతవరకు ఆ నభస్సు అంత పటట్లేదు. ఆ పాతాళ నభస్స్థలాంత అన్న భావమే ఇక్కడ భావన చేయవచ్చు. అలా దివిని తాకుతున్నటువంటి విరాట్ రూపుడు సర్వదుక్ వ్యాసః. వరుణో వారుణో వృక్షః పుస్కరాక్షో మహామనాః. వరుణః వరుణః అంటే జల స్వరూపుడు. జలము ఆయన రూపమే. అయితే వరుణా అని వారికి ఎందుకు వచ్చింది పేరు అది కూడా తెలియాలి కదా. వరుణుడు అంటే జలమునుకు పతి. వరుణం అంటే ఏమిటండి? పదాలకు అర్థం తీస్తేనే తత్వం వస్తుంది కదా. వృణోతి సర్వం ఆవృణోతి అంతటిని ఆవరించి ఏది ఉంటుందో అది వరుణః అన్నారు ఇక్కడ. ఇది మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే భూమిలో ముప్పాతిక భాగా ఆవరించింది ఏది? జలమేగా. పైన జలానికి ఒక లక్షణం ఉంది. ఇలా పోయి ఉంది నీరు అలా వ్యాపిస్తుంది. అది కప్పుతుంది. అలాగా ఆవరించుట లక్షణముగా కలిగినటువంటి వాడు. అదే విష్ణువు కూడా. ఆవురు వృత్తి సర్వత వ్యాపించి పడింది గనుక ఆయన వరుణుడే. జలరూపంగా వ్యాపించి ఉన్నాడు గనుక ఆయన వరుణుడు అని అర్థం. వరుణ్ని నమస్కారం చేసుకొని ఉంటే జలధారలతో కప్పుతాడు జగత్తని. అది వరుణః. తర్వాత వారుణః. వరుణః వారుణః అంటే వరుణునికి సంబంధించినది వారుణః. అంటే వ్యాపక లక్షణం వేటి వేటికి ఉన్నదో అవన్నీ వారుణములు. జల సంబంధమైన వ్యవస్థ అంతా వారుణములే. ఇది తెలుసుకోండి. అందుకు వారుణః. జలమునకు భగవంతునికి ఉన్న అనుబంధం తెలియాలంటే అప్సు సర్వం ప్రతిష్టితం. యోపా మాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఎందుకు జలముల గురించి అంత ప్రాధాన్యం చెప్పారో మనకు తెలియదు. శరీరంలో కూడా ఎక్కువ ఉండేది అదే అంట. విజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కనుక జగత్తంతటికి ఆధారం గనుక జల వ్యవస్థలో వరుణో వారుణో రెండూ ఆయనవి. జలములు అంటే పెరిగేట వృక్షః. వృక్షం కూడా ఆయనే. అందుకే నమో వృక్షేభ్యో హరికేషేభ్యః అన్నాం కదా వృక్షాయ అన్న ఒక నామం కూడా ఉంది విడిగా. భగవంతుడు వృక్ష స్వరూపుడు. ఎలాగో అంటే మీరు వృక్షం ఒకసారి చూడండి. ఒకే చెట్టు అనేక రకాల స్వరూపాలలో కనబడతాయి మనకి. కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పళ్ళు. ఒకటి దానికి ఒకటి బంధం లేదు. కానీ అన్నిటికీ ఒక దానితో బంధం ఉంది. అలా ఒక దానితో ఒకటి సంబంధం లేని జీవులందరూ ఎవడి అనుబంధం వల్ల ఉంటున్నారో వాడు భగవంతుడు. అందుకు వృక్ష శబ్దం ఆయనకు వర్తిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు వృక్ష వరనే అనే ధాతువు ప్రకారంగా వరుణ వారుణ శబ్దాలకు ఇది అర్థం ఇక్కడ. అయితే వృక్షము స్థిరంగా నిలిచి అంతట ఆవరించుతుంది అది ఇక్కడ అర్థం. అలాగే ఉంటూ చెట్టంతా కొమ్మలు ఇంత వ్యాపించింది అంటే అంతగా వ్యాపించింది ఆ చెట్టేగా ఇన్నిటిని పట్టుకొని నిలబడింది. అందుకే దానికి వృక్షః అని పేరు. కదలకు నిలచువాడు అని కూడా అర్థం ఉంది వృక్ష శబ్దానికి అర్థం. వృక్షయవ సబ్దో దివితిష్టత్ ఏకః అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మంత్రం. ఎవడు వృక్షములాగా మనకందనంత స్థానంలో నిలబడి ఉన్నాడో వాడు. అంతే కాదు జగత్తును వృక్షంతో పోల్చాడు. ఊర్ధ్వమూలం అదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసియస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ముందు విశ్వాన్ని చూడు. కర్మలతో వృద్ధి చెందుతుంది. కర్మలు అంటే యజ్ఞాదులు. ఆ కర్మలకు మూలం ఏంటి వేదం. కనుక చెట్టుకు ఆకులు ఎలాగో దీనికి వేదములు అలా ఉన్నాయి. ఛందాంసియస్య పర్ణాని. దీని మూలం ఆకాశంలో ఉంది. తిరగడుವುದು చెట్టు గురించి చెప్పడం ఎంత అద్భుతమైన కల్పన అండి ఇక్కడ. దీని మూలం పైన ఉంది కింద లేదు. అక్కడి నుంచి ఇటు వ్యాపిస్తుంది అని చెప్పారు ఆ వృక్ష రూపుడు ఉన్నవాడు. పుష్కరాక్షః. ఈ శబ్దానికి చాలా విస్తారమైన ఇదివరకో చెప్తాం. పుష్కరమైన అక్షం అంటే విస్తారమైన దృష్టి గలవాడు వికసించిన దృష్టి గలవాడు. పుష్కరమునందు వ్యాపించినవాడు. పుష్కరం అంటే పద్మం. హృదయ పద్మంలో వ్యాపించునటువంటి వాడు. మహామనాః. గొప్ప మనస్సు ఉన్నవాడు. ఆయన మనస్సు ఉందండి మనసుకు కూడా అతీతుడే. మన జ్ఞానేన ధాతువు ప్రకారంగా మనాః అంటే జ్ఞాన స్వరూపుడు. మహామనాః అంటే అనంత జ్ఞాన స్వరూపుడైన వాడు. అటువంటి భగవానుని భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతి రాదిత్యః సహిష్ణుర్గతి సత్తమహా మహామనాః అంటే అనంత జ్ఞాన స్వరూపుడైన వాడు. అటువంటి భగవానుని భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతి రాదిత్యః సహిష్ణుర్గతి సత్తమహా ఇప్పుడు వచ్చింది భగవాన్ అనేటువంటి నామం. బాగా వాడతాం. అందుకే అంత భగవద్గీతలో కృష్ణోవాచ ఎక్కడ లేదు. భగవాన్ వాచే. పుస్తకం పేరే భగవద్గీత. ఆయన మాట్లాడితే భగవద్గీత. ఆయన ఏదైనా చేస్తే భాగవతం. అంతే కదా. ఆయన చేష్టలన్నీ భాగవతం. ఆయన మాటలన్నీ భగవద్గీత. రెండిట్లోనూ భగవానుడు. భగవంతునికి సంబంధించిన అంశములు భాగవతం. భగవంతుడు చెప్పింది భగవద్గీత. ఎన్ని పేర్లు అయినా అన్నా ఇదే పేరు. ఈ చెప్పినవన్నీ విష్ణు కథలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ భాగవతంలోనే ఉన్నాయి. ఇవన్నీ కలిపికొడే భగవానుడు. భగవాన్ అంటే ఏమిటి అంటే శుకయోగి మొదట చెప్తాడు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కధ్యతే. బ్రహ్మమని, పరమాత్మ అని, భగవానుడని మూడు పేర్లతో చెప్పబడేవాడు ఒకడే ఆయన అన్నాడు. వాడిని భగవాన్ అన్నాడు ఇక్కడ. భగ శబ్దానికి అర్థం ఏమిటంటే ఆరు గుణములు కలిగినవాడు. ఈ ఆరు గుణములు ఐశ్వర్య గుణములు. ఐశ్వర్య గుణములు అంటే ఈశ్వర సంబంధమైన గుణములు అది కరణం. అంటే భగవాన్ శబ్దానికి ఆయనే వాచ్యుడు. అదేమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్రియః జ్ఞాన వైరాగ్యయోస్యైవ షన్నాం భగ ఇతీరిణ. భగ శబ్దానికి షడ్గుణములు. అది కలవాడు భగవానుడు. షడ్గుణైశ్వర్యములు. వీటిని ఇవే ఐశ్వర్యం అంటే ఈశ్వర గుణములు అవేంటో చూడండి. ముందు ఐశ్వర్యస్య సమగ్రస్య. ఈ సమగ్ర అనే శబ్దం చెప్పబడిన ఆరింటికి వర్తిస్తుంది. సమగ్రం అంటే కంప్లీట్ గా. లేకపోతే గుణాలు కొందరికి ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అది ఆయన దగ్గర సంపూర్ణముగా ఉంది. ఎప్పుడు ఉంటుంది కనుక ఈ ఆరు గుణములు భగవంతునికి చెప్తున్నారు. మొదటిది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద కాదు. ఈశ్వరస్య భావం అథారిటీ. ఒక దాని పైన పట్టు ఉండడాన్ని ఐశ్వర్యం అంటారు ఇక్కడ. అంతే గానీ క్యాషీయర్ దగ్గర బోల్డ డబ్బు ఉంటుంది. ఐశ్వర్యవంతుడిని ఎవరు అనరు. ఎందుకు? అది ఆయనది కాదు. దాని మీద ఆయనకి అధికారం లేదు. అవునా కాదా. కనుక ఐశ్వర్యం అంటే అర్థం ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. సర్వ జగన్నియామక శక్తి. అది ఆయన సంపూర్ణంగా ఉంది. నేను కొందరు నియమిస్తున్నారు కానీ నేను ఈశ్వరుడు అంటే నీకు అది కంప్లీట్ గా లేదు ఆయనకే. సమగ్ర శబ్దం దానికి వేశారు. సమగ్రమైన ఐశ్వర్యం ఎవరికి ఉందో ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య. రెండవది ధర్మము. ధర్మం అంటే విశ్వనియమములు అది ఆయనకే తెలుసు. ధర్మస్య యశసః. యశస్ అంటే సత్కీర్తి. ఈ రోజుల్లో మీడియా వాడు మన వాడైతే మనం కీర్తిమంతులు. అది కీర్తి అండి ఇక్కడ. కీర్తి యశస్ అనే శబ్దానికి ఎంత మంచి మాట చెప్పిందంటే శాస్త్రం. ధర్మము ద్వారా లభించేటటువంటి సత్కీర్తిని యశస్ అనాలి అన్నారు ఇక్కడ. ఎంత మంచి మాట చెప్పరు ఇక్కడ. అంతే కాదు యస్య నామ మహద్యశః. వేదములన్నీ ఎవడిని కీర్తిస్తున్నాయో దేవతలందరూ ఎవడిని కీర్తిస్తున్నారో ఎప్పుడు కీర్తిస్తారు? ఆ కాలంలో. కథ ఎప్పుడునూ అదే యశస్ అంటే అది ఆయన దగ్గర ఉంది. అది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః సిరియః. సిరి అనే మాటకు శోభ, కాంతి, కళ, వైభవం. ఇవన్నీ వర్తిస్తాయి. అవన్నీ కలిగినవాడు ఆయన. ఎప్పుడూ ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు ఎన్ని నాలుగు. జ్ఞాన వైరాగ్య. ఇది ఇంకో గొప్ప విషయం ఇక్కడ. ఇన్ని ఉంటూ అపూర్వమైన జ్ఞానం. జ్ఞానమే ఆయన. ఇన్ని ఉంటూ వైరాగ్యం. ఇన్ని ఉంటూ జగత్తును అదుగుతు దేనికి అంటడు. దేనితోనూ రాగము, అటాచ్మెంట్ లేనివాడు. అది వైరాగ్యం. ఈ ఆరు గుణాలు కలిగిన వాడిని భగవాన్ అనాలి అన్నారు ఇక్కడ. అది మీరు పదం తీసుకొని ప్రతి అవతారంలో ఆ ఆరు ఎలా చూపిస్తాడో వెతకాలండి. అదే నిజంగా రామాయణం చదవడం. అదే నిజంగా భాగవతం చదవడం ఇక్కడ. అంతే కాదు మరొక శబ్దం భగవాన్ కి విష్ణు పురాణం చెప్తుంది. ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పినవి. అందుకే రెండేసి మూడేసి చెప్పామంటే శాస్త్రాల్లో అలా చెప్పాలి నన్ను ఏం చేయమంటారు. మరొక చోట ఎక్కడైనా భగవాన్ శబ్దం వస్తే ఈ రెండో అర్థం తీసుకెళ్ళిపోదాం. కానీ ఇక్కడే చెప్పుకుందాం. భగవాన్ అంటే అర్థం ఏమిటంటే ఆరు తెలిసినవాడు. నేను చెప్తాను ఈ ఆరు ఉందులో ఎవరికైనా తెలిస్తే చెప్పండి వాడిని నేను భగవాన్ అంటాను. ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి విష్ణు పురాణ వాక్యం ఇక్కడ. ఇందులో మూడు జంటలు. ఉత్పత్తి ప్రలయం. సృష్టి యొక్క ఉత్పత్తి ప్రలయం ఎవడికి తెలుసో. ఇందులో ఎవరైనా ఉన్నారా? లేదు. దీన్ని బట్టి భగవానుడు ఒకడు ఉన్నాడు ఒప్పుకోవాల్సిందే. ఉత్పత్తి ప్రలయములు ఎవరికి తెలుసో. ఈ ఉత్పత్తి ప్రలయాల మధ్య వచ్చేవారు జీవులు. భూతానాం జీవుల యొక్క ఆగతిం గతిం రాక పోక. మనకి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ ఇంకా పిల్ చేయం. తర్వాత వాళ్ళు పిల్ చేసుకుంటారు. కనుక రెండు మనకు తెలియవు. ఆగతిం గతిం. వేత్తి విద్యా మవిద్యాంచ అద్భుతమైన మాట చెప్పాడు అండి. సంసారంలో పడి జన్మలెత్తడం అవిద్య. సంసారం నుంచి బయటపడడం విద్య. ఇందులో ఎప్పుడు పడి ఉంటామో ఎంతవరకు పడి ఉంటామో మన చేతిలో లేదు. ఎప్పుడు బయట పడతామో కూడా మన చేతిలో లేదు. అంటే బంధము మోక్షము. ఈ ఆరు ఎవడికి తెలుసో వాడిని భగవాన్ అనాలి. ఎంతో అద్భుతమైన మాట చెప్పారు. అలాంటి భగవానుడైన విష్ణువులకు నమస్కారము. ఇది భగవాన్ సప్తకం. ఇంకొక అర్థం భగం అనే మాట ఎందుకు వచ్చింది? భం వృద్ధిం గచ్ఛతి త్యర్థః. నిరంతరము వృద్ధి చెందునది. అంటే ప్రకృతికి భగము అని పేరు. ఈ ప్రకృతి నిరంతరం వృద్ధి చెందుతూ వెళుతూ ఉంటుంది. అలాంటి ప్రకృతి ఎవడు అధీనంలో ఉన్నదో వాడు భగవానుడు. ఇది అర్థం ఇక్కడ. అని చెప్పి భగవాన్ భగహ. హా ఇది విసర్గలు కావు. భగహ అంటే వృద్ధిని నశింపజేయువాడు. వృద్ధి పొందిస్తాడు. ప్రళయాదులలో వృద్ధిని నశింపజేస్తాడు. ప్రళయాదులలోనే కాదు. ఎప్పటికప్పుడే ఒకడు వృద్ధి చెందుతూ ఉంటుంది తరిగిపోతు ఉంటుంది. అలా వృద్ధి చెందుతాన్ని మళ్ళీ ఉపసంహరించగలగాలి అండి. సముద్రం దగ్గర కెరటాలు అంత ఉవ్వెత్తును లేస్తాయి. మళ్ళీ టప్పి మని పడతాయి. ఉవ్వెత్తుని లేపిన సముద్రమే మళ్ళీ వెంటనే లాక్కుంటుంది లేదా. కనుక జగత్తులో వ్యాపించిన భగవానుడు ఎప్పుడు వృద్ధి చేయాలో అప్పుడు వృద్ధి చేస్తాడు. తిరిగి లాక్కుంటాడు గనుక భగహ అని మాట చెప్పారు. అంతే కాదు శత్రువుల యొక్క వృద్ధిని నశింపజేయువాడు అని అర్థం చెప్పారు. అసురులు వాళ్ళు విర్రవీగుతూ కొంతకాలం టైం బాగుంటే వాళ్ళకి బాగుంటుంది. కొక్కపట దుష్టత్వానికి ఒక టైం ఉంటుంది అండి. బాధపడక్కర్లే వాళ్ళకి టైం అయిపోతుంది. అది కూడా తెలుసుకోవాలి. అందరు పుట్టలేరు ఇలాంటి రాక్షసులు పోయారు. కనుక వాళ్ళని పోగొడతాడు. వాళ్ళకి ఒక టైం ఇస్తాడు. ఆ టైం అయిపోయినప్పుడు వాళ్ళని తీసేస్తాడు. ఇప్పుడు ఎండలు ఇచ్చి మళ్ళీ వానలు రాబోతున్న టైంలో రెక్కల పురుగులు బోల్డ్ వస్తాయి. ఇరిగేషన్ మీద పడితే గోడల నిండా ఇంటి నిండా ఉంటాయి. ఎంత చిరాకు అండి ఎంతసేపు? కొంతసేపే. అలా కొన్ని వస్తూ ఉంటాయి. కనుక అలా వృద్ధి పెరిగిపోయేటటువంటి వాటిని క్షయింపజేసేవాడు భగహ. ఇలా వృద్ధి చెందుట పెంచుట చేస్తున్న ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అయ్యో వృద్ధి చెందిపోయాయి. అయ్యో పోయాయి అని రెండిటికి బాధపడడు. ఎందుకంటే ఆనందం ఆయన స్వభావం గనుక భగహానంది ఆనంది వనమాలీ. ఈ నామములు చూస్తూ ఉంటే మేదినిపతి గురించి మహావరాహో గోవిందః సుషేనః కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తః చక్రగదాధరః. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఈయన సామాన్యుడు కాదయ్యా. ఈయన బ్రహ్మకు కూడా మూలమైనవాడు. మేము బ్రహ్మనే వేద అంటాం. ఆయనకు కూడా వేధ ఈయన. సృష్టికర్తకే సృష్టికర్త కనుక వేదాః. బ్రహ్మకు వేద అనే పేరు ఎందుకు వచ్చిందండి? నిర్మించి నిర్వర్తించే వాడిని వేదా అనాలి అన్నాడు ఇక్కడ. కనుక వి అనేది విశేషము. దాహ అంటే దుధాన్ ధారణ పోషణయోహో అని అర్థం ప్రకారంగా ధరించువాడు పోషించువాడు ఎవడో వాడు దాహ. విశేషముగా ధరించి పోషించేవాడు బ్రహ్మదేవుడు. ఆయనకు కూడా ఈయన సృష్టికర్త కనుక వేదాః. స్వాంగః. స్వాంగః అంటే అర్థం ఏంటంటే స్వం స్వయమేవ అంగం కార్యకరణే సహకారి యస్య. తనకు తానే సహకారి అయినవాడు స్వాంగుట్టం. అంటే ఎవడో సహకరిస్తే నేను. ఇదుగో భూమిని తెస్తున్నాను. మీరు చెయ్యి వేయండి అని వాడు అడగలేదు. తనకు తానే తీసుకొచ్చాడు. కనుక తనకు తానే సహకారి అయినవాడు స్వయం ప్రకాశ స్వరూపుడైన వాడు ఎవడో వాడు స్వాంగః. అజితః. స్వాంగ శబ్దానికి అర్థం చక్కని అంగములు గలవాడు. మంచి అవయవాలు యజ్ఞ వరాహ స్వామి. అవునండి మంచి బలిసినవి. మంచి అవయవాలు అంటే అర్థం ఏంటంటే యజ్ఞ యజ్ఞ వరాహ స్వామి ప్రతి అవయవం యజ్ఞ స్వరూపం. ఆయన నాలుక అగ్ని. ఆయన ముట్టెలు సుక్స్రువాదులు. ఆయన పాదములు చాతుర్హోత్రములు. ఆయన రోమములు దర్బలు. యజ్ఞ వరాహ స్వామి వర్ణన యజ్ఞమే ఒక రూపం ధరిస్తే యజ్ఞ వరాహం. అయితే వరాహం భూమిని ఉద్ధరించింది అంటాం కానీ యజ్ఞ వరాహం ఎందుకు అన్నారంటే యజ్ఞమే భూమిని ఉద్ధరిస్తుంది అని చెప్పడానికే ఆయన యజ్ఞ వరాహ స్వామి ధరించారు. ఇది వేద మహర్షి ప్రపంచానికి ఇచ్చిన సూచన. ఇప్పటికీ అధునాతన ప్రపంచం తెలుసుకోలేకపోతుంది. తర్వాత ఎప్పుడో తెలుసుకుంటుంది. విశ్వాన్ని రక్షించేది, పోషించేది యజ్ఞమే. ఈ జ్ఞానాన్ని ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కారం. యజ్ఞవరాహ స్వామి. ఆయన అజితాః. ఆయన ఎప్పుడు జయించలేడు. జయింపబడనివాడు స్వభావమే అది. ఇది ఎలా చెప్పగలరు అంటే ఆయన వచ్చేటప్పుడు హిరణ్యాక్షుడు పెట్టిన సైన్యాలన్నీ ఆయన మీదకి వచ్చాయి. విదిలించాడు అంటే మొత్తం పోయారు. హిరణ్యాక్షుడు పోయాడు. అప్పుడు అర్థమైంది అందరికీ. మిగిలిన వాళ్ళకి. ఈయన అజితః. ఈయనను జయించలేము అని. ఈయనే కృష్ణుడు. కనుక గోవింద శబ్దం కృష్ణ శబ్దం ఎవరివి? వరాహ స్వామి. ఏం మా కృష్ణువు కాదు. ఆయన ఆ పని చేశారు గనుక ఆయనే కృష్ణుడు. సరిపోయింది. అంతే కాదు ఏకశృంగో వరాహత్వం అని ఎవరన్నారో తెలుసా? ఒక్క శృంగంతో వచ్చిన వరాహ స్వామి నువ్వయ్యా అని బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తిని స్తుతించాడు అని అర్థం ఇక్కడ. అంటే భూమిని ఉద్ధరించిన స్వభావం కనుక రాముడిని ఇప్పుడు ఉద్ధరించవు. వాళ్ళ కృష్ణుడిని ఉద్ధరించాడు. సరిపోయింది. తర్వాత నామం అజితః కృష్ణః. కృష్ణః అంటే కర్షించువాడు అన్న అర్థం ఇక్కడ. భూమిని పట్టి లాగుతాడు అంటే భూమిని పట్టి కర్షించి నిలబెట్టాడు. ఎప్పుడు? ఆ రోజుల్లో అప్పుడు అదే చేస్తున్నాడు ఆయన. అందుకే కృష్ణః. దీనికి పెద్ద ప్రమాణం ఉదృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహునా వేదమంత్రమే చెప్తుంది ఇక్కడ. అందుకు ఆ మహానుభావుడు కృష్ణః. దృఢః. ఇలా పట్టాడు తెలుసా? ఇదిగో పడిపోతే జాగ్రత్తగా పట్టుకోండి అని కాదు. దృఢః గట్టిగా పట్టాడు. పట్టు ఎలా ఉందంటే ఇది ఒక సైట్ నుంచి కాదుట. సమ్మీక కర్షణం. అన్ని వైపుల నుంచి పట్టాడు. సంకర్షణః. అచ్యుతః. పట్టాడు. తాను జారను పట్టిన భూమిని జారనివ్వడు. కనుక అచ్యుతః సంకర్షణ అచ్యుతః. ఇప్పుడు చదవండి ఈ నామములన్నీ వరాహస సక్రాత్సారం పక్ర. తర్వాత నామములు వరుణో వారుణో వృక్షః. పుష్కరాక్షో మహామనాః. వరుణః.