అలాగే తనయందు సర్వ జగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు. సంక్షేప్త క్షేమ కృత్. అతను ఏం చేస్తాడంటే క్షేమం కలిగిస్తాడు. భగవంతుని స్వభావమే క్షేమం కలిగించుట. క్షేమ కృత్ అంటే క్షేమాన్ని కలిగించినవాడు. క్షేమం అంటే యోగ క్షేమం వహామ్యహం భగవాండే చెప్పాడు. లేనిది లభించడం యోగం. ఉన్నది పోకుండా ఉండడం క్షేమం. ఇప్పుడు ప్రతి వాడికి రెండు కావాలని ఉందా లేదా? అది ఇచ్చేవాడిని నేనే అన్నాడు ఇక్కడ. యోగ క్షేమం. అసలు అసలు క్షేమం అనే మాటకు అర్థం ఏమిటి? అందరికీ క్షేమం అంటే అందరూ క్షేమంగా ఉన్నారా? అది అవసరమేనండి. ఒక అర్థం. అసలు క్షేమం ఏది? నువ్వు ఇవాళ క్షేమంగా ఉన్నది అనుకుంటున్నది ఎప్పుడు క్షేమంగా ఉండదు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు క్షేమంగా ఉండేది ఒకటి ఉన్నది. అది ఏమిటో తెలుసా? క్షీ క్షయే క్షీ నివాసగత్యోః క్షీ నివృత్తాయం అనే ప్రకారంగా సర్వ బంధములు తొలగుటయే క్షేమము అని ఇక్కడ అర్థం. సన్యాసకుల దగ్గరికి వచ్చి సర్వ బంధములు తొలగించు వాడే క్షేమకృత్. బంధాలు దుఃఖాలు తొలగించడమే క్షేమం. అది కలిగించేవాడే క్షేమకృత్. ఇప్పుడు ఏది బాగులేదండి ఇందులో? సంక్షేప్త క్షేమ కృత్. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తున్నాడు అనుకోవద్దు. అనివర్తి దేని నుంచి మరలని వాడు అంటే సాంసారికమైన ధర్మములు, విషయములు, ఇవి విడిచిపెట్టకుండా ఎవడైతే పాటిస్తాడో వాడు అనివర్తి. అంటే ప్రవృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాడు. ఇవన్నీ విడిచిపెట్టి ఎవడైతే వెళ్తున్నాడో వాడు సన్యాసి. వాడు నివృత్తాత్మ. మళ్ళీ ప్రవృత్తి రూపంలో నివృత్తి రూపంలో ఉన్నటువంటి వాడు అని చక్కగా చెప్పారు. అలాంటి వాడే తర్వాత మాట ఏంటంటే ఎవరైతే ప్రవృత్తి ధర్మంలో వాటిల్లో ఉంటారో వాడికి అన్నీ ఒకే సమకూర్చి పెడుతున్నాడు. సంక్షేప్త అన్ని సమకూర్చుకోవడం. అది ప్రవృత్తి ధర్మం. క్షేమ కృత్ అన్ని బంధాలు నిర్మూలించడం నివృత్తి ధర్మం. కనుక ఇక్కడ వరుసగా చూస్తే ఆ నామములో కూర్పులు ఎంత అందం ఉంది అనివర్తి నివృత్తాత్మ ప్రవృత్తి నివృత్తి రూప ధర్మం. దానికి మరొక పాఠం సంక్షేప్త క్షేమ కృత్. ఇన్ని చేస్తాడు అని అసలు స్వరూపము అటువు ఇటు రెండుగా ఉండడం కాదు ఇన్ని చేస్తున్నా ఆయన స్వరూపం శివః. శివః అనే మాటకు ఒకటే అర్థం. నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి వాడు నిస్త్ర్యైగుణ్య త్రిగుణములకు అతీతముగా ఉన్నవాడు శివుడు. అంతేకాదు ఇన్ని ఆయన యందే జరుగుతున్నాయి కదండీ ప్రవృత్తి అయినా నివృత్తి అయినా ఆయనలోనే జరుగుతున్నాయి. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాడు కూడా పరమాత్మ యందే ఉన్నవాడు నిజానికి. ఏదో ప్రపంచం పట్టింది కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు ప్రవృత్తిలో ఉన్న వాడికి. ప్రవృత్తి మార్గం అంటే సంసారంలో పడి కొట్టుకోవడమే ప్రవృత్తి. వాడికి పరమాత్మ గుర్తు రావట్లేదు. కానీ పరమాత్మలోనే ఉన్నాడు వాడు కూడా. ఎందుకు గుర్తు రావట్లేదు చెప్పండి. ఆ గుర్తులో సంసారం ఉంది అది బాధ. సంసారం గుర్తు ఉంది కనుక పరమాత్మ గుర్తు రావట్లేదు. కానీ సన్యాసికి పరమాత్మే గుర్తుంటాడు ఇది గుర్తుండదు. కానీ రెండిటిలోనూ పరమాత్మ ఉన్నాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రెండిటిలో ఉంటూ రెండిటికి అంటకుండా ఉన్నవాడే శివః తర్వాత మాట. సంక్షేప్త క్షేమకృత్ శివః. విష్ణు సహస్ర నామాల్లో రెండు మాటలు శివ నామం వచ్చింది ఇక్కడ. అంటే శివుడు ఆయన. శివ శబ్దానికి ఇంకొక అర్థం ఇక్కడ చెప్తాం. మిగిలిన అర్థాలు నేను చెప్పను ఇదివరకు చెప్పాను నాకు జ్ఞాపకం ఉంది. సర్వ శర్వ శివ స్థాణుహు ఇంకొక్క అర్థం చెప్పేసుకుందాం ఇక్కడ. శేతే అస్మిన్ సర్వమితి శివః ఎవడి యందు అన్ని ఆధారపడి ఉన్నాయో అతడు శివుడు. అటు ప్రవృత్తి మార్గం చెప్పాడు నివృత్తి మార్గం చెప్పాడు. ఇవి రెండు ఆయన ఇచ్చినవే కదా. ప్రవృత్తి నివృత్తి మార్గములు ఎవడి మీద ఆధారపడి ఉన్నాయో అతడు శివః. ఎంత అందమైన కూర్పు అండి. ఇక్కడ నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి. మీరు మొత్తం చదివితే మంత్రంలా ఉంటాయి. 13 నామాలుగా ఇవి తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్య ప్రదమైనటువంటి మంత్రం. ఇంకా విడిచిపెడతామా? శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంవరః శ్రీదశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఇక్కడ నుంచి శ్రీ అనే నామములతో ఒక వరుసగా కొన్ని శ్లోక పాదాలు వస్తున్నాయి. మీరు మొత్తం చదివితే మంత్రంలా ఉంటాయి. 13 నామాలుగా ఇవి తీసుకోవచ్చు. 13 నామాల మహామంత్రం. ఇది ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రం. ఇంకా విడిచిపెడతామా? శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంవరః శ్రీదశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ఇదో మంత్రంగా జపించుకోవచ్చు. ఎవరు? ఐశ్వర్యం కావలసిన వారు. అసలు ఐశ్వర్యమైన పరమాత్మ కావలసిన వాళ్ళు కూడా చేసుకోదగ్గ మహామంత్రం అండి. ఇన్ని మారు శ్రీ అని రావడంతో శ్రవ్యంగా ఉంటుంది. విష్ణు సహస్రంల అందం ఏంటంటే అర్థమైనా అర్థం కాకపోయినా వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. అది శబ్ద శక్తి. అది కుముదః ఆనంద కలిగించే శబ్దం. విష్ణు సహస్రంల శబ్దార్థ శక్తి ఉంటదని ముందే చెప్పాం కదా. ఆయన నామాలు కదా. అర్థం చూస్తుంటే ఇంకా మధురంగా ఒక్కొక్క దానిలో బోల్డ్ బోల్డ్ వస్తున్నాయి. ఎందుకంటే సంక్షేపం నుంచి విస్తారం వచ్చినట్టు ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు శ్రీవత్సవక్షా అంటే శ్రీవత్సలాంఛనము వక్షస్థలంలో కలిగినటువంటి నారాయణుడు. ఇది అర్థం ఇక్కడ. అయితే శ్రీవత్సవక్షా శబ్దానికి వైదికమైన మరొక అర్థం చెప్పారు అంటే వత్స అనే మాటకు పలుకునది అని అర్థం. వద్వ్యక్తాయాం వాచ్య అని ధాతువును అనుసరించి వదతి ఇతి వత్సః. పలుకునది వత్సము. అంటే శబ్దించునది ఏది? వేదము. వేదానికి మరొక పేరు శ్రీ. అది శ్రీ రూపమైన వేదధ్వని ఎవడి హృదయములో ఉన్నదో అతడు శ్రీవత్సవక్షాః. ఈ అర్థం కూడా మనం తీసుకోవచ్చు. రెండునూ. మొదటిది శ్రీవత్సలాంచనంతో ఉన్నటువంటి నారాయణుడు. నారాయణ వక్షస్థలంలో శ్రీవత్సము అనే ఒక లాంచనం ఉంటుంది. లాంచనం అంటే ఒక గుర్తు. అది ఉంటుంది. శ్రీవాసః శ్రీవాసః అంటే లక్ష్మికి నివాసమైన వాడు. లక్ష్మి అనే మాటకు మనం శ్రీ అనే మాటకు అర్థం చెప్పుకున్న శోభా కాంతి కళ ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. శోభా కాంతి కళ వైభవం అన్నీ ఆయనలో ఉన్నాయి గనుక ఆయన శ్రీవాసః. శ్రీపతిహి ఏదో ఆయనలో ఉన్నాయి గానీ వాటి మీద ఆయనకేమి అధికారం లేదని లేదు. తనలో ఉన్న వాటి మీద తనకు అధికారం ఉండాలి కదండీ. ఇప్పుడు మనలో అన్నీ ఉన్నాయి వాటి మీద అధికారం లేదో ఎలా చెప్తారు వినాల్సింది. కానీ తన యందున్న సంపదలకి తానే పతి. అందుకే శ్రీపతిహి. అంటే లక్ష్మికి పతి అయిన వాడు. ఒక అర్థం తెలుస్తూనే ఉంది. శిరులకు ఏలిక అయినటువంటి వాడు. పైగా పతి అనే శబ్దానికి ఇంకో అర్థం చెప్పుకుందాం. రక్షతి పాతి ఇతి. అంటే స్త్రీని రక్షించువాడు. స్త్రీని రక్షించాలండి పోతే ఎలాగా? కానీ సర్వ జగత్తులో ఉన్న ఐశ్వర్యాలని రక్షించేవాడు శ్రీపతి. లక్ష్మీపతి అనే అర్థం తీసుకోవచ్చు. ఇది తీసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఇక్కడ శ్రీ శ్రీ శ్రీ ఇన్ని మారు వస్తుంది గనుక శ్రీకి ఒక అద్భుతమైన అర్థం ఉంది తెలుసుకోండి ఇక్కడ. అది ఋచస్సామాని యజూగుంషి సాహిశ్రీరమృతాసతాం అని వేదం వేదమునకు శ్రీ అని పేరు చెప్పింది తెలుసుకోవాలి ఇక్కడ. వేదమే నారాయణుడు. అది లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఎప్పుడైనా మీరు చదివితే వేదస్వరూపిణి అని లక్ష్మీదేవినే చెప్తారు. అంతెందుకు మీరు శ్రీసూక్తం చదువుతూ ఉంటారు. జాతవేదోమమావహ వేదమే లక్ష్మీస్వరూపం అని వాడు కాదు ఇది బాగా తెలుసుకోండి. వేదమే లక్ష్మి. అంటే జ్ఞానమే లక్ష్మి. ఇంతవరకు ఐశ్వర్యం శోభా కాంతి కళ అన్నాం కదా. కనుకనే శ్రీ అంటే జ్ఞానం అని అర్థం చేసుకుంటే వేదము జ్ఞానము ఎవడి యందు ఉన్నాయో వాడు వేదమునకు జ్ఞానమునకు ఎవడు ప్రభువో అతడు. అది వేదైశ్య సర్వైరహమే వేద్యాయితి ఆ విషయంలో తెలుసుకోవాలి. శ్రీమతాంవరః శ్రీమంతులలో శ్రేష్ఠుడు. మనం శ్రీమంతులని చాలా మందిని చూస్తూ ఉంటాం. బాగా సంపద ఉన్న వాళ్ళని మనం శ్రీమంతులు అండి అంటూ ఉంటాం. కానీ సంపదలు ఉన్న వాళ్ళందరూ శ్రీమంతులు. వాడి కంటే వీడు శ్రీమంతుడు వీడి కంటే వాడు శ్రీమంతుడు. అవునో కాదో. మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పది మంది బిలియనీర్స్ లో నేను పదవ వాడినని ఉన్నారు. అంటే పైన ఒక తొమ్మిది మంది ఉన్నారు. వాళ్ళ లిస్టు కూడా గ్యారెంటీ లేదు. మరో రెండో ఏడు వచ్చేటప్పటికి మొదలు వాడు పదో వాడిగా ఉండొచ్చు. ఇదేమిటండి? వీళ్ళందరూ మారిపోయే శ్రీలు. కానీ ఎప్పుడు శ్రీ ఆయన దగ్గరే ఉంది. ఆయనను మించి శ్రీమంతుడు మరొకడు లేడు గనుక శ్రీమతాంవరః శ్రీమంతులలో గొప్పవాడు. మీరు శ్రద్ధగా వింటున్నారు అన్నాను. మరి ఒక అర్థం చెప్పనా? శ్రీమంతులు ఎవడిని వరిస్తారో వాడు అన్నాడు ఇక్కడ. వరించుట అంటే కోరుకొనుట, కావాలి అనుకొనుట. ఇక్కడ ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఇన్ని విష్ణు సహస్రం చదువుతాం కానీ విష్ణువు కావాలని అనుకుంటున్నామా? విష్ణు సహస్రం వల్ల ఏదో కావాలంటాం కానీ విష్ణువు కావాలని అనుకుంటామా? విష్ణువు కావాలనుకునే వాడు శ్రీమంతుడే కావాలనుకుంటాడు. శ్రీమంతుడు. జ్ఞానము కలవాడు. వేదాది జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయన తప్ప ఇంకోటి అక్కర్లేదంటారు. తెలివైన వాళ్ళు ఆయన్ని అడుగుతారు. మనమా? ఆయన దగ్గరికి వెళ్లి కూడా మా వాళ్ళు బాగుండాలి వీడు బాగుండాలని అడిగితే ఆయన్ని అడుగుతున్నామండి? ఆయన్నే కోరుకునే వాళ్ళు ఎవరండి? ఒక ప్రహ్లాదుడు. ఆయన్నే కోరుకున్నాడు. నీవే తప్ప ఇతః పరం మరగ అంటే నన్ను ఈ కష్టాల నుంచి కాపాడడానికి నువ్వు తప్ప ఇంకోడు లేడని కాదు. ఈ కష్టం ఇవాళ ఒకటి వచ్చింది రేపు ఒకటి వస్తుంది నాకు ఇవి కాదు కావాల్సింది నువ్వే కావాలి. నువ్వు తప్ప నాకు మరొకటి లేదు అని అర్థం కజీరే ఆయన మాటల్లో. అందుకే శ్రీమతాంవరః వాళ్ళు వరిస్తున్నటువంటి వారు. ఎంత అందమైనటువంటి మాట? అలాంటి వాడు. అందుకే మనకంటే శ్రీమంతులు దేవతలు. ఒకరు సంపద కలిగిన వాళ్ళు గనుక. మనకంటే శ్రీమంతులు యోగులు జ్ఞానం కలిగిన వారు గనుక. వాళ్ళందరూ విష్ణువే కావాలనుకుంటున్నారు అంటే శ్రీమంతులకు వరముగా ఉన్నటువంటి వాడు. అని ఒక్కసారి నమస్కారం చేసుకొని అటువంటి స్వామికి దండం పెట్టి తర్వాత శ్రీదః శ్రీశః శ్రీనివాస శ్రీదః. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ శివః శ్రీవత్సవక్షా శ్రీవాసః శ్రీపతి శ్రీమతాంవరః. అనివర్తి. అనివర్తి అంటే అర్థం మరలిన వాడు. అంటే ఒక దాంట్లో ఉంటూ దాంట్లోంచి బయటికి వచ్చేసిన వాడు. వాడు అనివర్తి. అంటే దాని నుండి బయటికి వచ్చిన వాడు. మరలువాడు అని అర్థం. అనివర్తి. అంటే మరలబోని అట్ట అన్నిటికీ. అంటే అందరు ఉన్నట్టే ఉంటాడు కానీ అన్నిటి నుంచి దూరంగానే ఉంటాడు. అది అనివర్తి. ఇందాక చెప్పిన సన్యాస కృత్తికి ఇక్కడ అర్థం ఇంచుమించు. అన్ని ధర్మముల నుండి వెళ్ళిన నివర్తి అంటే మరలు వాడు. అనివర్తి అనే మాటకు మరలు వాడు కాడు. ఇది అర్థం. అంటే ధర్మములలో ఉంటాడు కానీ ధర్మం నుంచి మరలడు ఆయన. ధర్మములలో ఉంటాడు. నిజానికి నివర్తి నివృత్తాత్మ ఇది వరకు చెప్పుకొని తెలుసుకుంటే వీటన్నిటి నుంచి మరలి ఉన్న వాడు. అక్కడ చెప్పింది మరలి ఉన్న వాడు అని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేని నుంచి మరలి ఉండడు. నివర్తి అంటే మరలుట. మరలిన వాడు. అనివర్తి అంటే మరలు వాడు కాడు. మరలుట అంటే విడిచిపెట్టుట, వదులుట. అని వదిలిపెట్టడు అని అర్థం ఇక్కడ. ఏమిటి వదిలిపెట్టడు? ఎవరిని వదిలిపెట్టడు? ధర్మప్రియుడు కదా భక్తప్రియుడు కదా. భక్తులను విడిచిపెట్టడు. ఈ అర్థాలు తీసుకోండి. కానీ వెను తిరగడమే మరలుట. ఉన్న దాని నుంచి బయటికి వెను తిరగడం. ఈయన దేవాసుర యుద్ధం చేసినప్పుడు వెను తిరగడు. అందుకే అనివర్తి. యుద్ధంలో వెన్ను చూపని వాడు మహా సూరుడు అంటారు కదా. కనుక ఏ యుద్ధంలో వెన్ను చూపాడండి మా నారాయణుడు? దేవాదానవ సంగ్రామంలో ఎక్కడా కూడాను వెన్ను చూపని వీరుడు. కనుక అనివర్తి అంటే మరలు వాడు కాడు. ఎన్ని రకాలుగా? అంటే జగద్రక్షణ నుంచి ఎప్పుడు మరలడు. ఆయన మరలితే ఉండగలమా అండి? అంతే కానీ కొంతకాలం జగత్తు నడిపి నాకు విరక్తి పుట్టింది నన్ను వదిలేసాడు అనుకోండి ఏమవుతాం? అందుకే ఎప్పుడు ఈ జగన్నిర్వహణ అనే ధర్మం నుంచి మరలిపోడు గనుక అనివర్తి. యుద్ధము నుంచి వెను తిరగడు గనుక అనివర్తి. కనుక అనివర్తి అయినటువంటి వాడు. అయింది కదా. నివృత్తాత్మ. పోనీ కొద్ది స్పేస్ ఇస్తే కొద్ది గ్యాప్ ఇచ్చినా పనికొచ్చేది. వెంటనే అన్నాడు మరలిన వాడు. దేని నుంచి మరలని వాడు అన్నాడు. ఇప్పుడేమన్నారు? అన్నిటి నుంచి మరలిన వాడు. అన్ని వదిలేసేసాడు ఇక్కడ. వదిలితే ఏమైపోతాం? మరి వదిలిన వాడు అన్నారండి అంటే అర్థం అన్నిటిలో వదలకుండా ఉన్నాడు. దేన్ని పట్టుకోలేదు. అది తెలుసుకుంటే చాలు ఇక్కడ. నివృత్తాత్మ అంటే అర్థం ఏంటంటే ఇన్ని చేస్తాడు ఇన్ని ఉంటాడు కానీ దేనికి అంటడు. ఎప్పుడు నివృత్తాత్మ స్వరూపంలోనే ఉంటాడు. అంటే విషయముల నుండి మరలిన స్వభావం. ఆయనకేమి విషయాల లంపటాలు ఉన్నాయా? ఉన్నట్టు కనబడతాడు. భక్తులంటే ఎంత ప్రేమో శత్రువులంటే ఎంత కోపమో. అనుకుంటున్నావా అర్జున నమే ద్వేష్యోస్తి కశ్చన. నాకు ఎవడు ద్వేషించదగిన వాడు లేడు. ఆ మాటకు వస్తే ప్రియమైన వాడు ఉన్నాడా వాడు లేడు అన్నాడు ఇక్కడ. మళ్ళీ ఇంకో చోట అంటాడు ప్రియో హి జ్ఞాని అత్యర్థం అంటాడు. జ్ఞానులు నాకు ప్రియులు. ఏదో ఒకటి చెప్పండి. భక్తులు జ్ఞానులు ఆయనకు ఇష్టమే కానీ ఎవడు ఇష్టమైన వాడు కాడు అన్నాడు ఇక్కడ. అంటే నేనంటే ఇష్టపడేవాడు నేను అందరికీ ఇష్టమైన వాడిని అని తెలుసుకుంటాడు అది దాని యొక్క అర్థం ఇక్కడ. అది భావం. నిజానికి ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు కరుణ ఉన్నది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రపంచ వ్యవహారం నడుపుతున్నా దానికి అంటని వాడు గనుక నివృత్తాత్మ. సంక్షేప్త క్షేమ కృత్ తర్వాత నామములు. సంక్షేప్త అనేమిటి అర్థం ఏంటంటే సూక్ష్మ రూపంగా చేయడం. అంత ఉన్న దాన్ని ఇంత చేయడం సంక్షేపం. నిజానికి అది చాలా కష్టం అండి సంక్షేపం చేయడం. విస్తరించడం కష్టమే సంక్షేపం చేయడం కష్టమే. ఒక దూది కండిని వస్త్రంగా విస్తరింపజేశాడు. కదా. మళ్ళీ దూది కండిగా చేయండి. దూది కండే సంక్షేపము వస్త్రము విస్తారము. అందుకే సంక్షేపం కారణం విక్షేపం కార్యం అన్నాడు ఇక్కడ. కనుక వివిధముగా అగుట విక్షేపం. ఒకటిగా అగుట సంక్షేపం. కనుక అన్నిటిని కలిపి ఒక్కటిగా చేసి ఉంచుట అంటే స్థూరమును అప్పట్టి సూక్ష్మముగా చేయువాడు. అది సంక్షేపం. అందుకే జగత్తంతా విస్తరిల్లింది. తర్వాత ప్రళయ కాలంలో మొత్తం ఎక్కడికి పోతుంది? నశించిపోదు. అంతా ఒక దగ్గర లాగేసుకుంటాడు. మళ్ళీ తర్వాత జగత్ రూపంలో విస్తరింపజేస్తాడు. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్పాడండి. ఆయన వీధిలో నుంచి వెళ్తుంటే ఒక ఆమె బొమ్మలు అమ్ముకునేది. బుట్టలోంచి బొమ్మలన్నీ తీసి పెట్టేదట. ఎవడో బొమ్మ కొనుక్కున్న వాడు కొనుక్కున్నాడు. మిగిలిన బొమ్మలన్నీ వాడు బుట్టలో వేసేదట. కనుక కర్మ తీరిన బొమ్మలు వెళ్ళిపోయాక ఇంకా కర్మ ఉన్న బొమ్మలని బుట్టలో వేసుకుని మళ్ళీ సృష్టిలో పరచేవాడే భగవంతుడని చెప్పి ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. కనుక సంక్షేప్త వాడు క్షేమం. ఇలా సంక్షేపణం చేస్తాడు. అది అందమైనటువంటి వృక్షం. ఇంకా చెప్పాలంటే వట వృక్షం కార్యం బీజం సంక్షేపం. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఒక్క బీజంలో సంక్షేపంగా వృక్షమంతా ఉంది. అలాగే తన యందు సర్వ జగత్తు సంక్షేపంగా కలిగినటువంటి వాడు సంక్షేప్త క్షేమ కృత్. శమ ధర్మం గురించి చెప్తూ మాండూక్య ఉపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం అన్నాడు ఇక్కడ. ప్రపంచ దృష్టి పూర్తిగా శమించిపోతే కలిగే స్థితి ఏమిటి? ఏమంటారు? మరొక్కసారి చెప్పండి. శమః శాంతః తర్వాత నమస్కారం. ఇక్కడ శమః శాంతః అన్నీ తొలగిపోయిన తర్వాత ఉండే స్థితి. ఉదాహరణకి ఒక కొలనులో అలలు అలా కదులుతున్నాయి. శమము లేదు. అలలు ఆగిపోయాయి. అప్పుడు ఎలా ఉంటుంది కొలను? శాంతం. అందుకే అలలు అణగుట శమము. అణగిన స్థితి శాంతము. అది శమః శాంతః సన్యాస కృత్ శమశాంసః. అయితే శాంతము ఎంత గొప్పది అంటే శాంతః అవికృత మానసః సస్తోవా అని అర్థం చెప్తారు. అవికృత మానసః శాంతః. ఎవడికి మనోవికారములు ఉండవో వాడు శాంతుడు. అసలు అది వస్తే గాని సుఖం లేదు తెలుసా? అంతవరకు ఎప్పుడు కష్టమే. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు. అంతే కానీ మరి యదాంతం తెలుసండి మేమే చెప్తాం మీరే చెప్తారా? మేమే చెప్తాం అని కొందరు తయారవుతుంటారు. వాళ్లకేమిటి లభిస్తుందండి. అందుకే దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యం లేదు అన్నారు మా త్యాగయ్య. అంటే తత్కాలంగా ఇంద్రియాలని గ్రహించవచ్చు గాక. అందుకు దాంతుడు. వేదాంత వాక్యాలు వల్లివేయవచ్చు గాక. మాకు తెలుసు మహా వాక్యాలు మీకేనా? అన్నారు అంటే వారికి కూడా శాంతం లేకపోతే సౌఖ్యం లేదు తెలుసుకోవాలి అన్నారు. ఇది శాంత స్థితి. ఎంత గొప్పగా శమః శాంతః. నిష్ఠా తర్వాత. శాంతం నిష్ఠగా ఉండాలండి. నిష్ఠ అంటే నియమ నిష్ఠ అని అర్థంలో వాడతాం. అవి కూడా భగవంతుడే గానీ శాంత స్థితిలో నిలిచిపోవడమే నిష్ఠ. అంటే నేను కొద్ది కాలం శాంతంగా ఉన్నానండి తర్వాత ఉండలేకపోయాను అంటే ఎలాగండి ఇక్కడ? శాంతమునందు నిలిచిపోవుట అది నిష్ఠ. ఆ స్థితి భగవత్ స్వరూపం. అంతేకాదు భగవంతుని స్వరూపం నిష్ఠే. ఎందుకంటే ఆయన ఇన్ని ఎంత జగత్తు తానే కూడా ఏ మనోవికారం లేని వాడు. ఎప్పుడు స్వస్థుడే. స్వస్థత ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్యంగా ఉండుట. ఆరోగ్యంగా ఉంటే శాంతంగానే ఉంటాడు ఎవడైనా. స్వస్థత స్వస్థత అంటే స్వ స్థ. స్వ స్వరూపమునందు ఉండుటయే స్వస్థత. వాడికి అసలు ఆరోగ్యం అండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా ఉన్నటువంటి వాడు స్వస్వరూపమునందు నిలిచి ఉన్నాడు గనుక నిష్ఠ. నిష్ఠ అనే మాటకు అర్థం నితరాం తిష్ఠతి. అంటే పరిపూర్ణముగా నిలిచి ఉండుట. భగవంతుడే నిష్ఠ అన్నారు ఇక్కడ. అన్ని పరిపూర్ణముగా ఆయనలోనే నిలిచి ఉంటాయి గనుక ఆయనే నిష్ఠ. రెండు రకాల అర్థాలు చెప్పుకోవాల్సింది. శాంతగ నిష్ఠ. ఇది శాంత స్థితిలో ఉండేటటువంటి శాంతుడు. శాంత అంటే శాంతుడు. శాంతుడికి ఏముంటుందండి? శాంతి ఉంటుంది. శాంతి ఉంటే శాంతుడు అయ్యాడు. అంటే శాంతి. శాంతి కలవాడు శాంతుడు. అది శమహా తర్వాత శాంతగ చెప్పి శాంతమునందు ఎప్పుడూ ఉంటాడు గనుక నిష్ఠ చెప్పి దాని తర్వాత శాంతిహి అనే మాట ఇక్కడ. శాంతిహి అంటే సమస్త అవిద్యా నివృత్తిహి శాంతిహి. ఒక్క మాటలో చెప్పేశారు భగవత్పాదుల వారు శంకరులు భాష్యం చెప్తూ. అవిద్య పూర్తిగా తొలగిన స్థితి పేరు శాంతి. ఆ స్థితి ఎవడికి ఉందో వాడు శాంతుడు. అది పొందడానికి పనికొచ్చేది శమము. ఇప్పుడు తెలిసిపోయింది కదా. అదే సన్యాస ధర్మం. సంసారం పూర్తిగా నిర్మూలింపబడాలంటే శమం ఉండాలి. శమం వల్ల శాంతి, శాంతి వల్ల శాంతం. వాడు శాంతుడు అవుతాడు. అసలు పొందాల్సింది అదే. అది పొందితే ఇంకోటి పొందనవసరం లేదు. అదే అన్నిటికీ పరమగతి. పరమగతి అంటే అల్టిమేట్. అక్కడికి వెళ్ళిన వాడు ఇంకోటి పొందక్కర్లేదు. అక్కడికి వెళ్ళే వరకు ఇది అది అది ఇది. అక్కడికి వెళ్ళేగా అది. అందుకే పరమమైన ఆశ్రయం కనుక పారాయణం తర్వాత పెట్టాడు. సన్యాసికి ధర్మం ఏమిటయ్యా అంటే ఒకటే ధర్మం శమః. సన్యాస కృత్ శమః. సన్యాసంలో ప్రధానం కనబడవలసిన లక్షణం శమః. కోపం పరుషవాక్కు 10 మందిని ఒక దగ్గరికి పోగేసి వాడిని తిట్టా వీడిని తిట్టా ఇవి చేసారంటే వేషధారి తప్ప సన్యాసి కాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక సన్యాసికి ఉండవలసిన ధర్మం శమము. శమము దమము విన్నారు కదా. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము. అంటే మనస్సుని నిగ్రహించుట. మరి దమం ఎందుకు చెప్పలేదండి? మీరు కొంచెం ఆలోచిస్తుండండి. ఏది చెప్తే విన్నది వింటాను నిద్రపోయింది నిద్రపోతాం అనుకుండా. శమము అనేది అంతరిందియ నిగ్రహం అని చెప్పిరు గానీ బాహ్యేంద్రియ నిగ్రహం ఎందుకు చెప్పలేదు అంటే ముందు మనస్సుతో అనుకుంటే కదా బాహ్యేంద్రియాలని నిగ్రహిస్తాం. నేను బాహ్యేంద్రియాలని నిగ్రహిస్తాను అనుకోవాల్సింది ఏది? మనస్సు. అంటే దృశ్యం అక్కడ పదార్థం కనబడుతుంది. కినియాలనిపిస్తూ ఉంటుంది దేనికి? ఇంద్రియాలకి. కోరకూడదు అని చెప్పేది ఎవడు? అంటే బాహ్యేంద్రియాలని గ్రహించాలి అని ఉండవలసింది ఏది? మనస్సును ప్రధానంగా నిగ్రహించుకోవాలి. అందుకనే శమమునకు ప్రాధాన్యం చెప్పారు. శమము అంటే ముఖ్యంగా చెప్పవలసినది ఇంద్రియ వృత్తులను మనస్సుతో సహా మనస్సు కూడా ఇంద్రియమే. మనస్సుతో సహా నిరోధించుటయే శమము. ఈ శమం ఎక్కడ ఉంటుందో అక్కడ విష్ణువు ఉన్నాడు. శమం ఆయన స్వరూపం. అలాంటి శమ స్వరూపుడు. అందుకు ఒక్కొక్క ఆశ్రమానికి ఒకటి ప్రధానంగా ఉందని చెప్పి చూడండి. ధర్మో నియమో వనవాసినాం వనప్రస్తులకి శాస్త్రంలో చెప్పిన ధర్మాలు పాటించడం లోక వ్యవహారాలు లేవు. అది వాడి ధర్మం. దానం దాదమేవ గృహస్థానాం గృహస్తుడికి దానం ధర్మం. శుశ్రూషా బ్రహ్మచారిణాం బ్రహ్మచారికి గురు శుశ్రూష ధర్మం. ఇప్పుడు తెలుస్తుంది కదా. గురు శుశ్రూష బ్రహ్మచారికి ధర్మము. గృహస్తుడికి దానము ధర్మము. అంటే ఇది ఒకటే ధర్మం కాదు మెయిన్ ఇంపార్టెంట్ ప్రధానం అది ఉండాలి. ప్రధానం చేయాలి. బ్రహ్మచారి ఏం చేయాలి? గురు శుశ్రూష చేయాలి. వానప్రస్థాశ్రమవాసి ఏం చేయాలి? శాస్త్రం ఏం చెప్పిన ధర్మాన్ని పాటించాలి. అంటే ఇది ధర్మం. యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం. వనవాసికి నియమము అవసరం. అంటే తపో నియమమును శాస్త్ర నియమాలు. సన్యాసికి శమము ధర్మం. ప్రశమో ధర్మః. కనుక సన్యాసానికి తర్వాత శమః అనే మాట చెప్పడం అది విశేషం. శమము ఉండాలండి. కనుక శమమే ఆయన స్వరూపం. సన్యాసాన్ని కలిగించే పరమానందుడు. ఇన్ని సంసార బంధాలని నిర్మూలించుటయే సన్యాసకృత్. ఇది ఒక అర్థం. ఇంతవరకు ఆశ్రమం పరంగా చెప్పాం. సంసార బంధాన్ని నిర్మూలిస్తాడు. అదే కదా అసలు. మరి భిషక్కు అంటే చేసే పని ఇది. సంసారం అనే రోగాన్ని పోగొట్టాడు కనుక సన్యాసి. తర్వాత ఏం చేస్తున్నాడు? సన్యాసానికి ధర్మం ఉంది శమం. ధర్మం కొరకు ఉండవలసింది శమం. శమం కలుగదు. అన్నీ విడిచిపెట్టేయండి కానీ భాగిని చూస్తే కోపం వస్తుంది అన్నాడంట కదా. అంటే అర్థం అదొకటి అఘోరిస్తుంది లోపల. శమము అనే మాట ఎంత గొప్పదండి. అది తెలుసుకోవాలి. అంతేకాదు పరమాత్మ వారికి మరొక అర్థం. సకల భూత కోటిని క్షమింపజేస్తాడు. శమ ధర్మం గురించి చెప్తూ మాండూక్య ఉపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం అన్నాడు ఇక్కడ. ప్రపంచ దృష్టి పూర్తిగా శమించిపోతే కలిగే స్థితి ఏమిటి? ఏమంటారు? మరొక్కసారి చెప్పండి. శమః శాంతః తర్వాత అన్నాడు ఇక్కడ. శాస్త్రం చెప్తుంది ఇక్కడ. శాస్త్ర లక్షణములు ఇవి. ముందు సన్యాసం అంటే మనకు అవగాహన కలగాలి కదా. అందుకు. కనుక సన్యాస కృత్ ఇది పద్ధతి. అయితే ఇక్కడ ఇంకొక అర్థం. అందరికీ సన్యాసానికి అర్హత లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. మళ్ళీ వాదాల్లోకి దిగితే శాస్త్రం వాదనకు కాదు చెప్పింది చేయడానికి. సన్యాసానికి అర్హత లేకపోయినా ప్రతి వాడు సన్యాసి కావచ్చు. ఇదేమిటి? ఎలా చెప్పారు? అంటే నేను చెప్పలేదు పురాణం శాస్త్రం చెప్పింది. ఆశ్రమం ఒక్కటే మిగిలిన ఆశ్రమాలు పాటించడానికి అనువైనది. బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి కొద్ది కాలం. అందులోనే ఒక టైం గృహస్తుగా ఉంటాను, ఒక టైం వానప్రస్థంగా ఉంటాను అంటే కుదరదు. వానప్రస్థుడు కొంత టైం నేను గృహస్తుగా ఉన్నాను అంటే కుదరదు. సన్యాసి. ఆ రోజు గృహస్తు ఆపిటి సన్యాసి అంటే కుదరదు. కానీ గృహస్తు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటే బ్రహ్మచారి. గృహస్తు భౌతిక విషయ లాలస తగ్గించుకొని కేవలం శరీర పోషణార్థం లభించేటంత తృప్తిగా ఉంటూ దైవ పితృ కర్మలు ఆచరిస్తూ ధర్మబద్ధంగా ఆర్జించింది తృప్తి చెందుతూ ఇంకా ఆశలు పెంచుకోకుండా వెళ్తే గృహస్థాశ్రమంలో వానప్రస్థం. గృహస్థాశ్రమంలో ఉంటూనే వైరాగ్యం బాగా కలిగి ఆశ్రమం విడిచిపెట్టకుండా ఆశ్రమ ధర్మం పాటిస్తూ అంటే నా వైరాగ్యం వచ్చింది నిన్నెను ఉపనిషత్తులు 10 కంఠస్థం పట్టేసాను గనుక ఇంకా నేను రేపటి నుంచి సంధ్యావందనం చేయను పూజలు చేయను తద్దినాలు మానేసాను అంటే వాడు భ్రష్టుడు అంటారు తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు సన్యాసిని చెప్పు. సన్యాసికి ఏవి లేవు తద్దినాలు లేవు ఏమీ లేవు. వాడికి వాడికి తద్దినం పెట్టుకుంటాడు సన్యాసంలో. తెలుసా? కానీ గృహస్థ ధర్మాల్లో ఉంటూ నాలుగు ఉపనిషత్తులు చదివాను గనుక ఇది ముఖ్యం అండి పూజలు ముఖ్యమా? నమస్కారాలు ముఖ్యమా? అన్నాడు వాడు భ్రష్టుడు అంటారు తెలియాలి. నువ్వు ఉన్నది గృహస్థాశ్రమంలో దానికి తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే పడవలో వెళ్తూ ఉన్నాం. అసలు పడవ నేను కాదు కదండీ. ఆ ఒడ్డులో చేరినా ఇక్కడ ఉన్న ఒకడే. కనుక ఒడ్డులో ఎవడు ఉన్నాడో వీడే వాడే ఇక్కడ ఉన్నాడు. కనుక పడవక్కర్లేదు అని దడ్డు వదిలేస్తే మునిగిపోతాడు. తెలుసుకోండి ఇక్కడ. నువ్వు ఉన్నది నదిలో కనుక ఒడ్డుకి వెళ్ళే వరకు పడవని జాగ్రత్తగా నడపాలి. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కనుక గృహస్థ ధర్మాన్ని పాటించాలి. గృహస్తు సన్యాసి ఎప్పుడు అవుతాడు? జనక మహారాజును చూసి తెలుసుకోవాలి. అంటే గృహస్తుగా తన ధర్మం తను పాటిస్తున్నాడు. కానీ అంటట్లేదు. విధిగా చేస్తున్నా చేస్తున్నా అహంకారం లేదు. భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాడు. సాక్షిగా అన్ని చూస్తున్నాడు. ఆత్మ స్థితియందే తాను ఉన్నాడు. తన ఆత్మ విచారణలోనే ఉన్నాడు. ఆత్మ విచారణ ఉంది ఆత్మ స్థితి ఉన్నది. గృహస్థంలో సన్యాసం. గృహస్థం సన్యాసి కావచ్చు చూశారా? దానికి బట్ట మార్చక్కర్లేదు. ఎక్కడికో పోనక్కర్లేదు. అది గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసిలు ఎంతమంది ఉన్నారు? నేను అలాంటి వాడినే అన్నాడు కృష్ణుడు. ఎంత పని చేస్తున్నాడు యుద్ధాలు చేసి. నేనే కాదు జనకాదయః అని చెప్పాడు ఇక్కడ. వాళ్ళు అలాంటి వాళ్ళే. కనుక సన్యాసం అనేది ఒక ఆశ్రమ వ్యవస్థగా ఎంత గౌరవించాలో ఒక స్థితిగా ఉండాలి తెలుసుకోవాలి. ఇవి రెండు తెలుసుకోవాలి ఇక్కడ. ఈ స్థితి నీకు ఎలా వస్తుంది? సన్యాస స్థితి ఎలా వస్తున్నది? ఆ స్థితి రానంత వరకు గృహస్థ ధర్మం పాటిస్తూనే ఉండాలి. అది భగవదర్పణ బుద్ధితో భగవత్ భక్తితో చేస్తే భగవంతుడు దయ చూపించి నీకు ఆ జ్ఞాన స్థితిని ఇస్తాడు. ఆ జ్ఞాన స్థితి ఎవరు ఇచ్చాడు? అందుకే సన్యాస కృత్ సన్యాసమును కలిగించువాడు. అంతేకాదు సన్యాసమనే నివృత్తి మార్గ వ్యవస్థను వేద రూపంగా ఏర్పరిచిన వాడను మొదటి అర్థం. రెండవది ఉత్తమ సాధకుడు భగవంతుడే కావాలనుకునే వాడికి అటువంటి సన్యాసత్వాన్ని ఇస్తాడు. వాడికి ఒకటే ఉంటుంది వాడికి లక్ష్యం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంత కాలే పరామృతాత్ పరిముత్యంతి సర్వే. ఇందాక మనకి నోటికి వచ్చు. నోటికి వచ్చు అది బాధ. వేదాంత విజ్ఞానంలో సందేహం లేనటువంటి ప్రయోజనాత్మకమైన కలిగి యతయః నిగ్రహ సంపన్నులు. శుద్ధమైన అంతఃకరణ గలవారే శుద్ధ సత్వులు అంటే శుద్ధమైన అంతఃకరణ కలిగినటువంటి వారే ఎప్పుడు బ్రహ్మ లోకంలో ఉంటారట. బ్రహ్మ లోకం అంటే సగుణ బ్రహ్మ లోకమును కాదు లోకం అంటే స్థితి. ఆ బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉంటారు. వాళ్ళు సన్యాస యోగాత్ సన్యాస యోగము చేత పొనిపొందుతారు కనుక ఆ యోగం ఈశ్వరానుగ్రహం వల్ల రావలసిందే. నువ్వు ప్రయత్నం చేయాలి ఆ స్థితి ఆయన ఇవ్వాలి. అందుకే వారైనా నారాయణ నారాయణ అనవలసిందే. ఆ స్థితి ఆయన ఇవ్వవలసిందే. అందుకే సన్యాసకృత్ అనే మాట ఇంత చక్కగా. అంటే సన్యాస మార్గముతో సంసార బంధనాన్ని నిర్మూలించువాడు సన్యాసం అనే మాటకే తొలగించు స్థితి. తొలగించు స్థితి న్యాసం. అది మామూలుగా తొలగడం కాదు. మరేదో సెలవు పెట్టి కొంచెం దూరం వెళ్ళి నేను ఇవాళ సన్యాసిని అండి అంటే మళ్ళీ సెలవైపోతే ఇంటికి వస్తాం. అదా సన్యాసం? సం, ని న్యాసం సన్యాసం. అంటే సంపూర్ణముగా సమగ్రముగా విషయముల నుంచి తొలగిన స్థితి పేరు సన్యాసము. ఆ స్థితి రావడం ఎంత తేలికండి? ఎంతో ధ్యానం చేసినప్పుడు పరమాత్మే కావాలనిపిస్తుంది. మళ్ళీ పక్కన ఫోన్ చూడగానే అమ్మాయి చేసిందా? అయిపోయావ్. లాగేస్తే అంత తేలిక కాదు. అది భగవానుడు ఇవ్వవలసిందే ఆ స్థితి. అందుకే సన్యాసకృత్ అనే మాటకు ఇంత అర్థం. ఆయనే సం సన్యాస మార్గము ద్వారా సంసార బంధనాన్ని సంపూర్ణముగా నిర్మూలించువాడు సన్యాసి. సన్యాసికి ధర్మం ఏమిటయ్యా అంటే ఒకటే ధర్మం. క్షమః. కాషాయ దండ మాత్రేణ యతిసంపూజ్యతే సదా అన్నారు. వాడు సన్యాసి వ్రతంతో ఉన్నాడా లేదా నీకనవసరం. వాడు సన్యాసం పద్ధతిగా తీసుకుంటే చాలు మనం నమస్కరించు. నిజంగా సన్యాస స్థితికి వెళ్లిపోయాడు అనుకోండి నీ భాగ్యం. అందు సన్యాసం మళ్ళీ రెండు రకాలు. వివిదిశ వివిదిషా సన్యాసం, విద్వత్ సన్యాసం అని రెండు చెప్పారు ఇక్కడ. అంటే ఒకడు వివేకవంతుడై లౌకిక విషయాల పట్ల వైరాగ్యం కలిగి. వైరాగ్యం లేని వాడికి సన్యాసం లేదు ఇది గుర్తుపెట్టుకోండి. వైరాగ్యం లేని వాడికి సన్యాసం లేదు. ఎలాగో ఫ్రీగా ఉన్నాను గనుక ఖాళీగా ఉన్నాను పని ఏమీ లేదు గానీ సన్యాసం అవుతున్నా. పని లేకపోవడం సన్యాసి కాదు. తెలుసుకోండి ఇక్కడ. మహా వైరాగ్యవంతుడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి, అకుంఠితమైనటువంటి వైరాగ్యం. సామాన్యం కాదండీ ఇంకా మరీ లౌకిక విషయాల్లోకి దూరను అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగినవాడు సన్యాసి కాగలడు. వాడికి ఏర్పరిచిన ఒక ధర్మం ఉంది. సన్యాసం అంటే ఖాళీగా తిరగడం కాదు వాడికి కొన్ని నియమాలు ఉన్నాయి. గురువులు ఊస్తూకున్నట్టే. ఏంది నియమాలో పాపం సన్యాసులు వాళ్ళు సామాన్యం కాదు. వాడు వాదాల్లో దిక్కొడదు. సభలు, సమావేశాలు చేయకూడదు. తగుదునమ్మా అని ముందుకు రాకూడదు. వీలైనంత ఏకాంత జీవితం ఉండాలి. నిరంతరం బ్రహ్మతత్వ చింతన చేయాలి. క్షమము, దమము మొదలైన ప్రధానంగా ఉండాలి. ఇవన్నీ సన్యాసి నియమాలు. అవి పాటి పరమాత్మను తెలుసుకొనుటకై సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆ నియమాలు పాటిస్తూ గురువు ద్వారా నిరంతరం మహావాక్యముని శ్రవణం చేసి మననం చేస్తూ ఉండేవాడు వివిదిషా సన్యాసి. తెలుసుకోవాలనే తపనతో సన్యసించాడు. ఎందుకంటే మళ్ళీ ప్రపంచంలో పడిపోతే సాధన జరగదు. అందుకే ఆ ఆ దీక్షలో ఉంటాడు. వీళ్ళు వివిదిషా సన్యాసులు. విద్వత్ సన్యాసులు అంటే ఆ బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకొని ఇంకా ప్రపంచముతో అంటకుండా తిరిగేటటువంటి మహానుభావులు ఉంటారు. ఆదిశంకర భగవత్పాదుల వంటి వారు. వాళ్ళు విద్వత్ సన్యాసులు అని చెప్పబడతారు. వివిదిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. వీరు పని ఏమిటంటే ఏకాంతం. జనసమ్మర్దంలోకి వెళ్ళకూడదు. అంతే కాదు వాద ప్రతివాదాల్లో పాల్గొనరాదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. దేశాన్ని ఉద్దరిస్తాను బయలుదేరరాదు. ఇన్నీ ఉన్నా వీళ్ళకి. శాస్త్రం చెప్తుంది మీకు కావాలంటే ప్రమాణాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ కూడా. పీఠాధీశ్వరుడు సన్యాసం వేరు. వారికి ధర్మ ప్రతిష్ఠాపన బాధ్యత ఉంది. అందుకే వారు పని కత్తి మీద సాము వంటిదండీ. ధ్యానమా కావాలన్నంత ఉంది. బ్రహ్మ వ్యక్తులు వాళ్ళు. అటువంటప్పుడు సర్వసంఘ పరిత్యాగులై ఉంటారు. దేని మీద ఆసక్తి ఉండదు. అయినప్పటికీ ఆ వ్యవస్థను కాపాడడం కోసం అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వైరాగ్యంతో ఉండాలి. ధర్మ ప్రతిష్ఠాపన వారు నోటంట వచ్చేది అనుగ్రహ భాషణం. అందుకని వారు చర్చలకు రారు. వారితో చర్చిస్తానంటే తప్పు. పీఠాధీశ్వరులు జగద్గురువులు శాసిస్తారు గానీ చర్చించరు. తెలుసుకోండి ఇక్కడ. వారి మాట శాసనం. వారి స్ఫురణ శాసనం. వారు ఉపాసించి బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుతారు. మరి ఏ పీఠమునందు ఉన్నారో ఆ శారద ఆ శక్తి వారికొక స్ఫురణనిస్తుంది. అలగని వాళ్ళకి శాస్త్రజ్ఞానం లేక కాదు శాస్త్ర ప్రమాణాలతోనే ఉంటారు. కానీ శాస్త్ర ప్రమాణాన్ని మించిన స్ఫురణ కూడా వాళ్ళకి ఉంటుంది. ఒక భారతీ తీర్థేశ్వరులు వారు ఒక విధుశేఖర భారతీ స్వామిని ఎంపిక చేశారు అంటే అటు శాస్త్రజ్ఞానము చూశారు. నిరంతరం శారదామూర్తికి అభిన్యులు గనుక ఆదిశంకరులు ప్రతిష్ఠించిన ఆ శారదాదేవి స్ఫురణ ఉన్నది. అందుకు ఒక మాట చెప్తారు అక్కడ. ఆదిశంకరులే మఠామ్నాయుల్లో రచించారు. నా పీఠమునందు వచ్చే పీఠాధిపతులు నాకు అభిన్యులు అన్నాడు, నాకు వేరు కారు అన్నాడు. అని శంకరులే శాసించిన తర్వాత వారిని ప్రశ్నించడం మహా పాపం. వారిని ఆశ్రయించాలి, వారి పాదాలను నమ్ముకోవాలి, వారు ఏమి చెప్తే అదే ధర్మం తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత ధర్మం అవునా కాదా అని చర్చ చేయరాదు. మహా పండితులైన ఏది ధర్మమని మీమాంస కలిగినప్పుడు వారి ముందు నిలబడినప్పుడు వారి నోట పలికినదే ధర్మము, ఏత ధనుశాసనం. కేత దుపదేశః ఏష ఉపదేశః అది ఉపదేశము తెలుసుకోండి ఇక్కడ. అది సన్యాసంలో మరొక స్థాయి. అవి ఎక్కుకూడదు. ప్రతివాడు పీఠా పీఠాధిపతులు కాకూడదు. పీఠాధిపతులం కాలేదు కదా అని మనమే పీఠాలు పెట్టుకోకూడదు. తెలుసుకోండి. ఇవి శాస్త్ర మర్యాదలు ఇప్పుడు చెప్తున్నటువంటివి. ఎవరికో అనుక్క కలిగించడం కోసమో, బుజ్జగించడం కోసమో చెప్పట్లేదు. శాస్త్రం చెప్తున్నాం ఇక్కడ. శాస్త్ర లక్షణములు ఇవి. ముందు సన్యాసం అంటే మనకు అవగాహన కలగాలి కదా? అందుకు. కనుక సన్యాసకృత్ ఇది పద్ధతి. అయితే ఇక్కడ ఇంకొక అర్థం. అందరికీ సన్యాసాన్ని అర్హత లేదు. తర్వాత నామం సంసార రోగం కుదరాలి కదా? సంసార రోగం కుదుర్చుకోవడం కోసం కొందరు ఏం చేస్తారు అంటే ఇంకా ఈ సంసార విషయాల జోలికి వెళ్ళరు. వెళితే కదా రోగం. ఎంతకాలం ఇవే పట్టుకు వేలాడుతూ వీటి గురించి, వాటి గురించి దుఃఖపడుతూ ఎప్పటికీ అవే పట్టుకు వేలాడుతుంటే పోతాం ఎప్పుడో ఒకప్పుడు. పోయి మళ్ళీ అవే పట్టుకు వేలాడడానికి పుడతాం. అంతే కదా. ఏమి లాభం రాదు. మళ్ళీ వీటిలోకే పడతాం. గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలని విచారణ చేసుకుని కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఉండరండి. కొద్దిమందే ఏకే అమృతత్వమానుకు. ఏ కొద్ది మందో అంతే కచ్చిచ్చన చిదానంద లహరీం భజంతి భజంతి త్వాన్యః అందరూ కారు. కోటికొకడు కశ్చిత్ ధీరః ఎవడో ఒక్కడు. కోట్లలో కోట్లలో ఎవడో ఒక్కడు. వాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ నిస్సారములని విషయములపై వాంఛలని తొలగించుకుంటూ విషయములని పెంచే కర్మలని తొలగించుకొని శుద్ధుడై వాటిని క్షయించి శమము దమము మొదలైన అంటే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములు వహించి గురువు ద్వారా బ్రహ్మ తత్వాన్ని పొంది నిరంతరం దానినే మననం చేస్తూ ఉంటాడు. వాడిని సన్యాసి అంటారు ఇక్కడ. ఈ సన్యాస స్థితి భగవదనుగ్రహం వలనే లభిస్తుంది కనుక సన్యాసకృత్ తర్వాత నామం. సన్యాసమును ఇచ్చువాడు. సన్యాసమును చేయువాడు. సన్యాసం భగవంతుడు ఇస్తాడండి ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆయనే ఇవ్వాలి. అలాగే నాకు మొన్ననే ఇంట్లో వాళ్ళు కోపంగా ఉన్నారని చెప్పి వైరాగ్యం కలిగి సన్యాసి అయిపోయాను అంటే అది కాదు సన్యాసం. సన్యాసం పుచ్చుకోవడం ఒక పద్ధతి. మనకు వైరాగ్యం కలిగి కాషాయ వస్త్రాలు వేసుకుని వెళ్లిపోతే తప్పు. ఊరికేనే కాషాయ వస్త్రాలు వేసుకుంటే నగ్నంగా తిరిగినంత పాపం తెలుసుకోండి ఇక్కడ. దశవిధ నగ్నాలు అని శాస్త్రం చెప్తుంది. కనుక మనం రిటైర్ అయిపోయి ఇంకా కాషాయాలు పడదాం అంటే తప్పు. సన్యాసాశ్రమానికి ఒక పద్ధతి ఉంది. అందుకే ఆదిశంకరుడు జ్ఞాని అయినప్పటికీ ఆతుర సన్యాసం తీసుకున్నప్పటికీ పద్ధతిగా సన్యాసం తీసుకోవాలి. పద్ధతిగా సన్యాసం అంటే భారతీ తీర్థ స్వామి వారు విధిశేఖర భారతీ తీర్థ స్వామి వారికి ఇచ్చిన సన్నివేశం మనకు తెలుస్తుంది. అది శాస్త్రీయమైనటువంటి సన్యాసం. అలా సన్యాస స్వీకారం. అప్పుడు ఎవరు ఇస్తారు సన్యాసం? గురువు ఇస్తాడు. అంటే వీడు యోగ్యుడని చూడాలి. దానికి తగ్గట్టు ఇస్తాడు సన్యాసం. ఆదిశంకరులకు సన్యాసం ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు వారు. వారు అటువంటి వారు. కానీ ఈ సన్యాస స్థితికి తీసుకెళ్ళినటువంటివాడు ఇన్ని గురు రూపాల్లో ఉన్నటువంటి భగవానుడే కనుక వ్యాసుడి నామం కూడా గురువుల్లో ఒకటిగా చెప్పుకున్నాం కదా. భగవానుడే గనుక సన్యాస స్థితిని ఇచ్చువాడు. దీన్ని బట్టి అర్థం సన్యాసాశ్రమాన్ని ఇచ్చేవాడని అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సన్యాసాశ్రమం ఉత్కృష్టమైన ఆశ్రమం. ఒక్క సన్యాసి కనబడితే శివుణ్ని చూసినంత, విష్ణువుణ్ని చూసినంత అని చెప్పారు. అయితే కలియుగంలో చాలా చాలా కనబడతాయి అది ఒక ప్రమాదం. ఎవణ్ని కాదననే శక్తి మనకు లేదు. వాడు సన్యాసి కాదని శక్తి సంసారికి మనకు ఎక్కడ ఉంటుంది ఎక్కడ? కానీ సంసారంగానే సరిగ్గా లేవు. అందరూ గొప్ప గృహస్తులు అనుకున్నారా? పెళ్లిళ్లు చేసుకుని కుటుంబాలు వ్యవహరించే వాళ్ళంతా గొప్ప గృహస్తులు ఏం కారు. గృహస్తు అనడానికి ఒక పద్ధతి ఉంది. బ్రహ్మచారికి ఒక నిర్వచనం ఉంది. పేర్లు ఉంటే ఏమండీ ఈ రోజుల్లో పెళ్లి కాకపోతే బ్రహ్మచారి, పెళ్లి అయితే గృహస్తు. రిటైర్ అయితే వానప్రస్తు, అందరూ వదిలేస్తే సన్నాసి. కాదు కాదు సన్నాసి. అంతే కదా. ఇవి ఆశ్రమాలు. పద్ధతి లేదు వీటికి. కనుక పెద్దలు నాలుగింటికి పద్ధతులు చెప్పారు. అలా ఒక వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ ఏర్పరచినవాడు భగవానుడు. ఇదిగో మీరు ఈ ఆశ్రమాలలో ఉన్నప్పుడు ఇలా ఉండండి. అందుకే ప్రవృత్తి, నివృత్తి రూపమైన వ్యవస్థని ఏర్పరచినవాడు ఎవడు? భగవానుడు. దేని ద్వారా ఏర్పరిచాడు? వేదముల ద్వారా. వేదమే ఇది ప్రవృత్తి ధర్మం అని, ఇది నివృత్తి ధర్మం అని చెప్తుంది. అందుకని సన్యాస ధర్మం ఏమవుతుంది? నివృత్తి. ఇంకా విషయములు లౌకిక పరంపర నుంచి నివృత్తి అంటే మరలుట. ప్రవృత్తి అంటే దానిలో ప్రవర్తించుట. ప్రవృత్తి, నివృత్తి. ఈ రెండు తెలుసుకుంటే ఇదివరకు నామాలు తర్వాత నామాలు కూడా పనికి వస్తాయి. కనుక నివృత్తి స్థితిని సన్యాసం అంటారు. ఈ సన్యాస యోగం అవలంబించిన పెద్దలని ఒక్కసారి తలంచుకుంటే మన సన్యాసం కానక్కర్లేదని సన్యాసిని నమస్కరిస్తే చాలు. కాషాయ దండ మాత్రేణ యతిసంపూజ్యతే సదా అన్నారు. వాడు సన్యాస వ్రతంతో ఉన్నాడా లేదా నీకనవసరం. వాడు సన్యాసం పద్ధతిగా తీసుకుంటే చాలు మనం నమస్కరించు. నిజంగా సన్యాస స్థితికి వెళ్లిపోయాడు అనుకోండి నీ భాగ్యం. అందు సన్యాసం మళ్ళీ రెండు రకాలు. వివిదిశ వివిదిషా సన్యాసం, విద్వత్ సన్యాసం అని రెండు చెప్పారు ఇక్కడ. ఇక్కడ చెప్పేటప్పుడు సినిమాల వాళ్ళని, నాటకాల వాళ్ళని మళ్ళీ ఎత్తి చూపిస్తున్నాం అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇంత మహావిషయమైన మహాభారతం ధారగా సాగుతుంటే ఇందులో చెప్పే ధార్మిక విషయాలు, విజ్ఞాన విషయాలు, ప్రపంచానికి కావలసిన ఉపదేశాలు, లోతైన అంశాలు వీటి వేటిని పట్టించుకోకుండా ఏదో ఒక్క మాట తీసుకుని దీనికి ఎప్పుడో ఎవరో అన్న వాడితో ముడిపెట్టి వివాదాలు సృష్టించి దాని ద్వారా ఎక్కువ వ్యూయర్షిప్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల వారికి ఒక విన్నపం ఇది. ఇన్ని మహావిషయాల ప్రవాహంలో ఏదో ఒక మాట తీసుకుని పది మంది చూసే అవకాశం ఉంటుంది కదా అని దాన్ని వివాదాలకు గురి చేయవద్దు. ఎందుకంటే ఈ విషయాలు ఏవి చెప్పినా వ్యక్తులు దృష్టిలో ఉండరు. ప్రతివారు ప్రతిభావంతులే, మహామహులలే. ప్రతిభతో లోకానికి ఉపకారం చేసేవాళ్లే. మంచిదే. కానీ ఆ ప్రతిభ వేదాల గురించి, భారతం గురించి, రామాయణం గురించి నిర్ణయించడానికి సరిపోదు అని మాత్రమే ఇక్కడ విన్నవించుకుంటున్నాం. కనుక ప్రవచనాల్ని విజ్ఞాన దృష్టితో వినాలి గానీ వివాద దృష్టితో వినవద్దు. వివాదాల్ని ముక్కలు చేసి షార్ట్స్గా పెట్టి ప్రజాకర్షణతో వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం అనేది కూడని పద్ధతి. పాపులారిటీకి ఎన్నో మార్గాలు ఉండొచ్చు. కానీ వివాదాలు విడిచిపెట్టండి, విజ్ఞానాల్ని గ్రహించండి అని చెప్తున్నాం. మరొకటి కాదు. కానీ తీసుకుని వివాదం తీయడం ప్రధానం కాదు. అక్కడున్న ధర్మం ఏమిటి? వ్యాస హృదయం ఏమిటి? ఇది తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని సహృదులు అందిపుచ్చుకుని పది మందికి అందించే ప్రయత్నం చేయాలి వివాదాలు లేకుండా అంతే ఇక్కడ. ఎన్ని మహా విషయాలు? ఔచిత్యాలు, ఇంతవరకు లోకంలో ఉన్న అపోహలు, కూమర్సలు వీటిని తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఆ జరిగేటప్పుడు ఎవరి వల్ల అపోహలు కూమర్సులు వచ్చాయో వారిని విమర్శించారు అనుకుంటారు. వారిని విమర్శించట్లేదు, అపోహల్ని కూమర్సులని తొలగిస్తూ సత్యం ఏంటో చెప్పే ప్రయత్నం చేయడమే జరుగుతుంది. అందుకే ప్రతీసారి శ్లోకం చదువుతూ ఎందుకు చెప్తున్నాం అంటే ఇది అందరి ముందు కూర్చున్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడట్లేదు. వ్యాస వాక్యాన్ని యథాతథంగా గమనిస్తూ తత్ సంబంధమైన ఇతర శాస్త్రాలను అన్వయిస్తూ చెప్తున్న విషయమని సవినయంగా మరొక్క మారు విజ్ఞలైన వారికి చెప్తున్నాం. వేదంలో సామగానం అనేది కొందరు స్పృహ లేకుండానే చేయొచ్చు. ఏదో సామగానం చేసి విద్యా ప్రదర్శన చేసి దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ సంకీర్తన కేవలం భగవత్ భక్తితో భగవదనుభూతితో ఉంటుంది కనుక దాన్ని ఎక్కువగానే భావన చేసేవారు కొందరు. అందుకే అది గొప్ప మందు గనుక భేషజం తర్వాత మాట. భేషజం అంటే ఏమిటి? అంతకముందు ఔషధం జగతశ్చేతకు వచ్చింది. ఇప్పుడు భేషజం వచ్చింది. భేషజం అనే మాటకు అర్థం ఏంటంటే చికిత్స. అయితే మందు అని అర్థంలో కూడా వాడతాం. ఎందుకంటే మందు వల్ల రోగం కుదరబడుతుంది గనుక భేషజం అనే వ్యవహారం మందు కు కూడా వాడుతూ ఉంటాం కానీ భేషజం అంటే భేషజద్ చికిత్సాయ అనే ధాతువు నుంచి వచ్చింది ఇది. అంటే రోగాదులని నిర్మూలన చేసే చికిత్సా శక్తి భగవత్ స్వరూపం ఇది తెలుసుకోండి. ఒక మందు వేసుకున్నాం, ఆ మందు వల్ల రోగం పోయింది. ఆ ఔషధానికి ఆ శక్తి ఎవరు ఇచ్చారు? ఔషధుల నుంచి కదా తీసుకుని ఔషధం తయారు చేసాం. ఇప్పుడు నేను చెప్పుకునే కెమికల్స్తో చెప్పట్లేదు ఇక్కడ. అయితే అది కూడా ప్రకృతిజన్యమే అది వేరే విషయం కానీ సాధారణంగా ఔషధుల నుంచి తయారు చేస్తారు ఔషధం. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఔషధి ఔషధము ఇస్తున్నారు. అంటే దానికి ఈ రోగాన్ని పోగొట్టే శక్తి ఉంది కదా? ఆ శక్తిని ఎవడు పెట్టాడు ఔషధుల్లో? భగవానుడే గా? కనుక చికిత్స చేసే వాటిలో చికిత్స చేసే శక్తిగా ఉన్నవాడు ఆయనే గనుక భేషజం ఇది తెలుసుకుంటే ఈ ఔషధం పుచ్చుకుంటే భగవంతుడు గుర్తు రావాలండి. ఆయన గుర్తొస్తే మందు బాగా పని చేస్తుంది ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఔషధే చింతయేద్ విష్ణు అన్నారు ఇక్కడ. కనుక భేషజం అంటే చికిత్సా స్వరూపుడు. ఇది ఆలోచిస్తే ఎన్నో విషయాల్లో చికిత్సా ఉపయోగ గుణం ఉందండి. మీరు మనం అనుభవిస్తున్న ప్రతీ పదార్థంలో చికిత్స చేసే శక్తి ఉన్నది. అవునా కాదా చెప్పండి. మీరు ఆలోచించండి. కేవలం రోగం వచ్చినప్పుడు ఇచ్చే మందులోనే కాదు. సూర్యకిరణముల ముందు నిలబడితే ఆ కిరణాల వల్ల కొన్ని రోగాలు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు. డీ విటమిన్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఒకటేమిటి చాలా అందుకే ఇప్పుడు పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు సూర్యుడు ముందు నిలబడితే ఎన్ని రోగాలు పోతాయో. ఇప్పుడు కిరణాల్లో రోగాహరణ శక్తి ఉందా లేదా? అలాగే ఒకాయనకి అజీర్తి మొదలైనవి అన్నీ ఉంటే డాక్టర్ గారు చెప్పారు నువ్వు నీళ్ళు ఎక్కువ తాగాలయ్యా. సరిగ్గా నీళ్ళు తాగకపోతే కదా రోగం వస్తుంది. కనుక నీళ్ళల్లో ఏముంది? చికిత్స చేసే గుణం ఉందా లేదా? ఆహారంలో అది కూడా చికిత్సకు పనికి వచ్చేది అనే ఉద్దేశంతో తినాలి. కొందరు నాలుక వరకే చూసుకుంటూ ఉంటే రోగాలకు తీసుకెళ్తుంది. అందుకే జానెడు పొట్ట కోసం రెండు అంగుళాలు, ఆ రెండు అంగుళాల నాలుక మీద రుచి కోసం జానెడు పొట్టను బాధపెడతారు ఎందుకయ్యా అన్నారు గురువు గారు. అంటే నాలుక మీద రుచి కోసం పొట్టను పాడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ. కనుక ఆహారంలో కూడా చికిత్స చేసేవి ఉన్నాయా లేదా? కొంతమంది ఈ పోపుల డబ్బా తోనే వైద్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ప్రతీ దాంట్లోనూ కూడాను చికిత్సా రూపమైన శక్తిగా భగవానుడు ఉన్నాడు. మొత్తం జగత్తులో ఉన్నాడు. మన శరీరంలో కూడా చికిత్స చేసే శక్తి ఉన్నది. ఇమ్మ్యూన్ సిస్టం అంటాం. దానికి అదే రోగాన్ని తొలగించుకొని యుద్ధం చేయగలదు లోపల చేరిన క్రిమితో. అవునా లేదా? ఇప్పుడు ఎక్కడ లేదో చెప్పండి. అన్ని చోట్ల ఉంది. అన్ని చోట్ల ఉన్న వాడిని ఏమంటారు? విష్ణువు అంటారు వ్యాపించాడు గనుక. కానీ వ్యాపించిన విష్ణువే భేషజ స్వరూపుడై ఉన్నాడు. భేషజ స్వరూపుడై ఉండడమే కాదు చికిత్సా రూపంలో ఉండడమే కాకుండా చికిత్స చేసేవాడు కూడా ఆయనే అన్నారు ఇక్కడ. కనుక చికిత్స చేసే శక్తి ప్రతీ దానికి ఉంది కానీ ఇది ఫలానా దాన్ని చికిత్స చేస్తుందని జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం ఉన్నవాడు వైద్యుడు. కనుక భిషక్ అనే మాటకు వైద్యుడు అని అర్థం ఇక్కడ. భేషజ స్వరూపుడై ఉండడమే కాదు చికిత్సా రూపంలో ఉండడమే కాకుండా చికిత్స చేసేవాడు కూడా ఆయనే అన్నారు ఇక్కడ. కనుక చికిత్స చేసే శక్తి ప్రతీ దానికి ఉంది కానీ ఇది ఫలానా దాన్ని చికిత్స చేస్తుందని జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం ఉన్నవాడు వైద్యుడు. కనుక భిషక్ అనే మాటకు వైద్యుడు అని అర్థం ఇక్కడ. ఇది తెలిస్తే చికిత్స ఆయనే, చికిత్స చేసేవాడు ఆయనే అని తెలిస్తే వైద్యో నారాయణో హరిహి అని నమస్కారం చేసుకుంటాం. అందుకే అసలు ఆయన భిషక్ అని తెలుసుకో అన్నారు ఇక్కడ. ఏంటి రోగాల నుంచి బయట పడతాడండి. ఇలా అనుకున్నా పర్వాలేదండి. అన్ని రోగాల నుంచి బయటపెట్టేవాడే విష్ణువు. సందేహం లేదు. అందుకే ఎవరు విష్ణు నామం పలుకుతారో వాళ్ళు రోగాల నుంచి బయటపడతారు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన. ఒకాయన హాస్పిటల్ పాలయ్యాడు. పెద్దవాడైపోయాడు. అనారోగ్యం తీవ్రంగా ఉన్నది. డాక్టర్లు చేతులెత్తేసారు. ఇంకా పిలుచుకోండి వాళ్ళందరినీ అయిపోయిందని. కానీ వాళ్ళ మిత్రుడు ఏం చేశారంటే అక్కడ మాకు అనుమతి ఇవ్వండి ఇక్కడ కూర్చుని మేము విష్ణు సహస్రం చదువుతాం అన్నారండి. వాళ్ళందరూ కలిసి పద్ధతిగా ఎలా పెడితే అలాగా ఫ్యాంట్స్లు షర్ట్స్లు వేసుకుని ఎలా కూర్చుంటే అలా కాకుండా పద్ధతిగా కూర్చుని చేతులు విభూతి పట్టుకుని విష్ణు సహస్రం మొత్తం చదివి అతనికి విభూది ధారణ చేసి మిగిలింది పొట్లం కట్టి దిండు కింద పెట్టేసారండి. ఆశ్చర్యకరంగా అతను కోలుకున్నాడు. డాక్టర్లు కూడా అబ్బురం పొందారు. అంటే భగవన్ నామములోనే చికిత్స చేయగలిగే శక్తి ఉంది. భగవత్ స్మరణలో చికిత్స చేయగలిగే శక్తి ఉంది. దాన్ని నారాయణ భట్టాద్రి పెద్ద ఉదాహరణ. కేరళలో పక్షవాతగ్రస్తుడై గురువాయురప్ప అయినటువంటి శ్రీ మన్నారాయణని శిష్ట పరమాత్మ ఎదురుగా కూర్చుని భగవత్కథా గానం చేసాడు. వెయ్యి శ్లోకాలు గానం చేయగానే పక్షవాత వ్యాధి పోయింది. ఇప్పటికి అది పారాయణం చేస్తూ రోగాల నుంచి బయటపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే చికిత్సా స్వరూపుడు ఆయన, చికిత్సకుడు ఆయనే. ఎన్నుదహరణలు చెప్పొచ్చు. మీరే చాలా చెప్పగలరు. ఆయన నామానికి ఆ శక్తి ఉన్నది. ఆయన కథకి ఆ శక్తి ఉన్నది. ఆయన ధ్యానానికి ఆ శక్తి ఉన్నది, ఆయన స్మరణకి ఆ శక్తి ఉన్నది. ఆయన కథా శ్రవణానికి కూడా ఆ శక్తి ఉన్నది ఇక్కడ. అది ఆయన స్వరూపం అది. అంటూ అద్భుతమైన మాట చెప్పారు. అసలు ఓ పెద్ద రోగముందయ్యా అది పోవట్లేదు. ఇవన్నీ చిన్న చిన్న రోగాలు. ఎందుకంటే దగ్గు, జలుబు, కడుపు నొప్పి ఇవన్నీ ఒక పెద్ద రోగం ఉంటే ఇవన్నీ వస్తాయట. కనుక జలుబుకు మందు, దగ్గుకు మందు, కడుపు నొప్పికి మందు కాదు. ఈ మూడింటికి మూలమైన మరొక పెద్ద జబ్బు ఉంది లోపల. దాని సింప్టమ్స్ ఇవి. సింప్టమ్స్కి మందు ఇస్తావా? రోగారికి మందు ఇస్తావా? అలాగే మనం అనుభవించే సుఖదుఃఖాలు ఇవన్నీ రోగాలైతే అసలు రోగం సంసారం. అది రోగమని డయాగ్నిస్ చేయడానికి ఈ జీవితం చాలదు. ఎవరో కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు ఇదిగో రోగం అని. వాళ్ళు మాత్రమే దీని నుంచి బయట పడాలి అనుకుంటారు. మిగిలిన వాళ్ళు ఇది తింటే బావుండునో పోతే ఎక్కడికి అని దీనిలోనే బాధపడుతుంటారు. అది అలవాటు అయిపోయాక రోగం కూడా వదులుకోవడం కష్టం. అది ఎన్ని రోజులు తగ్గితే పధహారు రోజులు తగ్గితే అది దుఃఖం కలుగుతుంది. కనుక అలవాటైపోయిన రోగం ఏంటయ్యా? ఈ జన్మలో కాదు అనేక జన్మల నుంచి అలవాటైపోయిన సంసారం. భగవంతుడికి అలవాటు కాలేదు సంసారం అలవాటైపోయింది. మీరు ఎలా చెప్తారంటే భగవంతుడు అలవాటైతే పుట్టేవాళ్ళం కాం. సంసారమే అలవాటైంది మనకి. అలవాటైపోవడం వల్ల ఇదే నేను అనుకుని ఉంటే బావుండును అనుకుంటున్నారు. ఈ రోగం. కనుక తెలివైన వాడు గుర్తు గుర్తుంచుకుని సంసారరోగ అపహాయ. సంసారం అనే రోగాన్ని పోగొట్టేవాడు ఎవరంటే ఒక్కడే వైద్యుడు దానికి ఇంకా ఎవ్వరూ లేరండి.
ఇంతవరకు చెప్పిన జ్ఞాన స్వరూపుడు ఆనంద స్వరూపుడైన పరమాత్మయే దీనికి వైద్యుడు. చికిత్స ఆయనే చికిత్సకుడు ఆయనే చికిత్స జ్ఞానము చికిత్సకుడు విష్ణువును తెలుసుకోండి ఇక్కడ. జ్ఞానం ఒక్కటే మందు సర్వ రోగాలకి. జ్ఞానం ఉన్నవాడిని ఏ దుఃఖం ఏం చేయలేదు. మనం ఏం చేస్తాం అంటే దుఃఖానికి మూలమైన సంఘటన మార్చాలని ప్రయత్నిస్తాం. నీకు జ్ఞానం కలిగితే సంఘటన ఎలా ఉన్నా నీకేం పర్వాలేదు. ఒక బాగా సంపన్నుడు ఒకాయన ఉన్నాడు. ఆయనకేదో కంటికి ఒక రోగం వచ్చింది. మంచి తెలిసిన పెద్దాయన అన్నాడంటే నువ్వు ఎప్పుడు నీలం రంగు చూస్తూ ఉంటే నీకు రోగం పోతుంది అన్నాడు. వెంటనే పెయింటర్స్ ని పిలిపించి తాను ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నీలం రంగు పూయించుతూ ఉంటాడు. ఊరంతా నీలం రంగే. అయితే ఒకాయన వచ్చి ఇంత కష్టపడే కంటే నీళ్ళ కళ్ళజోడు పెట్టుకుంటే అయిపోయింది కదా అన్నాడు ఇక్కడ. అయిపోయిందండి మొత్తం. కానీ ఊరంతా రంగు పూయడం కంటే నువ్వు పెట్టేసుకో. అందుకే సంఘటనలను మార్చే కంటే నీకు జ్ఞానం వస్తే ప్రపంచం అంతా ఆనందమే. అది దృష్టుం జ్ఞానమయం కురుస్వా. ఎవడు దృష్టి జ్ఞానంతో ఉంటుందో వాడికి అంతా ఆనందమేనయ్యా అన్నాడు. అజ్ఞానం ఎవడు నారాయణుడు. తన హృదయంలో నారాయణుడు ఉన్నవాడికి సుఖము, దుఃఖము రెండూ ఉండవు. నిర్వాణమే ఆనందముంటుంది ఇక్కడ. వాడు ఇంకా దేనికి రాగద్వేషాలకి లోను కాడు. ఆ స్థితి రావాలండి. అందుకే భేషజం భిషక్ ఇలాంటి నామాలు చదువుతుంటే రోగాలు పోవా? పోయి తీరుతాయి. తర్వాత నామం అయితే ఇప్పుడు మనకొకటి అర్థమైంది. అన్ని శాస్త్రములకు గమ్యము పరమాత్మ. అంటే పరమార్థ జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడే కలిగేదే ఆనందం. అదే శాంతం. అదే మోక్షం. అందుకే తర్వాత నామములు ఆ పరమాత్మని పొందినప్పుడు మోక్ష స్థితిని వర్ణిస్తున్నాయి చూడండి ఇక్కడ. సామ శబ్దం తర్వాత అది పెట్టడం ఒక ఔచిత్యం. ఆ మోక్ష స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే దాన్ని నిర్వాణం అంటారు ఇక్కడ. నిర్వాణం అనే మాటకు అర్థం ఏంటంటే పరమానందము అని అర్థం ఇక్కడ. ఎందుకు దానికి ఆ పేరు పెట్టారంటే సర్వ దుఃఖములు ఎక్కడ నిర్మూలింపబడుతున్నాయో అలా నిర్మూలింపబడగా కలిగినటువంటి ఆనంద దుఃఖాలు నిర్మూలించబడ్డమే ఆనందం కాదండి. ఆనందం ఏది కొత్తగా వస్తుందా? దుఃఖం పోతే వచ్చేది ఆనందమే. అంటే మనం ఏ దుఃఖం పోయినా ఆనందంగా ఉందని అంటూ ఉంటాం. కానీ మరో దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ అలా కాదు సర్వ దుఃఖములు దేనితో నాశనం అవుతాయో తెలుసుకో అన్నాడు ఇక్కడ. దీనికి అత్యంతిక దుఃఖనాశనము అంటుంది వేదాంత శాస్త్రం. అత్యంత దుఃఖనాశనం అంటే ఇవాళ ఏదో కడుపునొప్పి వచ్చింది దుఃఖం. రేపు తగ్గిపోయింది దుఃఖం పోయింది. ఇలా మనం చాలా చాలా ఆనందాలు అనుభవించేస్తుంటాం. కానీ కడుపునొప్పి వచ్చి తగ్గితే ఆనందం కానీ కడుపునొప్పే రాకపోతే ఆనందంగా ఉంటామా? చెప్పండి. ఎండలో వెళ్ళినటువంటి వాడు చెట్టు నీడ చేరితే అమ్మయ్యా అని ఆనందిస్తాడు. ఎప్పుడు చెట్టు నీడలో ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడా? కనుక దుఃఖ నిర్మూలనం ఆనందమా? ఇది ఆలోచించుకోండి అని చెప్పాడు. అసలు ఆనందం పరమాత్మ స్వరూపం. దానిని పొందగలిగితే దుఃఖమే లేదు. అది స్వస్వరూపం. అందుకు అది అసలైన ఆనందం గనుక అక్కడికి వెళ్ళేటప్పుడు సర్వ దుఃఖాలు నిర్మింపబడ్డాయి. దుఃఖాలు ఎన్ని రకాలు అండి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఇంకా చాలా ఉన్నాయి లేండి. జన్మ ఒక దుఃఖం. వృద్ధాప్యం మరొక దుఃఖం. వారధక్యం తర్వాత వచ్చేది మరణం. అది పెద్ద దుఃఖం. మరణం అయిపోయక దుఃఖమే లేదా? మరో దుఃఖం జన్మ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ లోపల దుఃఖాలను ఏం చెప్పాలా? అందరికీ తెలిసినవి. దాని మీద ఉపన్యాసం అక్కర్లేదు. ఆనందం గురించి ఉపన్యాసం కానీ దుఃఖాల గురించి ఉపన్యాసం అక్కర్లేదు. అనుభవించేదే. ఆనందం గురించి ఎందుకు చెప్పాలంటే ఈ ఆనందమేమో అదే ఆనందమే అని కన్ఫ్యూజన్ ఎక్కువ. అంటే అసలానందం భగవంతుడే. అది ఎలాంటిది అంటే సర్వ దుఃఖములు అత్యంతిక నాశనమైన తర్వాత ఏ పరమానంద తత్వం ఉన్నదో అది నారాయణ స్వరూపం గనుక ఆయనే నిర్వాణము. అక్కడికి చేర్చడమే సర్వ శాస్త్రముల గమ్యం గనుక సామః నిర్వాణం అనే మాట ఇచ్చారు ఇక్కడ. అలాంటి నిర్వాణ స్వరూపుడు. అందుకే అందరి హృదయంలో దుఃఖాన్ని నేను పోగొడుతున్నాను అని భగవానుడు చెప్పుకున్న దాన్నే అధర్వ వేదం చెప్తుంది. అగ్ని హృదయం శోకం తంతే నిర్వాపయామసి అనే మంత్రంలో హృదయంలో ఉన్నటువంటి శోకాన్ని తొలగించేటువంటి అగ్నికి అగ్ని అంటే ఇక్కడ పరమాత్మనార్థంలోనే వేదం వాడింది అది. ఇది గుర్తుపెట్టుకోండి. అటువంటి పరమాత్మను శరణ వేడుతూ కనబడుతుంది. అంతే కాదు భగవాన్ ని సామగానం చేస్తూ ఉంటే మనసుకు ఒక శాంతి లభిస్తుంది. అందుకే తెలివైనటువంటి వారు గానముతో భగవంతుని స్తుతించి ఆయన అనుభూతిని పొందుతారు. భగవత్ అనుభూతే నిర్వాణం ఒక్క మాటలో చెప్పాలంటే. భగవంతుడిని అనుభవానికి తెచ్చుకుంటే అదే ఆనందం. ఆ ఆనందమే లక్ష్యంగా జీవించేవాడు భక్తుడు. ఆ ఆనందమే లక్ష్యంగా జీవించేవాడు యోగి. వాడే జ్ఞాని. అంటే మిగిలిన ఆనందాలు లక్ష్యములు. అది పొందడం లక్ష్యం. అది పొందిన తర్వాత కలిగే స్థితి పేరు నిర్వాణం. అలాంటి నిర్వాణ స్వరూపుడు. అందుకే ఆయన గానం చేస్తే ఎన్ని రకాల ఆనందాలు కలుగుతాయో చైతన్య మహాప్రభువు చెప్తున్నాడు. చేతో దర్పణ మార్జనం, భవమహా దావాగ్ని నిర్వాపణం, శ్రేయః కైరవచంద్రికా వితరణం, విద్యావధూజీవనం, ఆనందాంబి వర్ధనం, ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం. సర్వాత్మ స్నపనం, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అన్నాడు. భగవత్ సంకీర్తనము సామగానమే మరొకటి ఏం ఉన్నది? వేదముల్లో తద్రూపంలో చేస్తే వేదజనితమైన సంగీతము ఆ పని చేస్తుంది. భగవత్ గానం యొక్క మహిమ ఏమిటంటే ముందు చేతో దర్పణ మార్జనం చిత్తం అనే అద్దాని శుద్ధి చేస్తుంది. భవ మహా దావాగ్ని నిర్వాపణం సంసారం అనే దావాగ్నిని తొలగిస్తుంది. ఏం చేస్తుంది? దావాగ్ని నిర్వాపణం. నిర్వాణం. తీసుకోండి. సంసారం అనే దావాగ్నిని చల్లార్చుతుంది. ఇది చల్లారు అంత తేలిక కాదండి. ఇది నిరంతరం కాలుతూనే ఉంటుంది. ఏంటంటే చిన్న తోట కాదు అగ్ని అరణ్యం. భవారణ్యపు అగ్ని ఆ దావాగ్నిని ఉపశమింప చేసే శక్తి భగవత్ సంకీర్తనకు ఉంది. అందుకే భవ మహా దావాగ్ని నిర్వాపణం శ్రేయః కైరవ చంద్రికా వితరణం. శ్రేయస్సులు అనే కలువులను వికసింపజేసే వెన్నెల వంటిది అన్నాడు. వెన్నెల వస్తే కలువులు ఎలా వికసిస్తాయో భగవత్ సంకీర్తన కలగగానే శ్రేయస్సులు అలా కలుగుతాయి అని చెప్పాడు ఇక్కడ. శ్రేయః కైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం. ఏమి అందమైన మాట చెప్పాడండి. విద్యలనే వధువులకి ఇదే జీవనం. అంటే విద్యలకి భగవత్ సంకీర్తనమే జీవనము. ఆ సంకీర్తన లేనప్పుడు విద్యలన్నీ వ్యర్థమే. భగవంతుడిని కీర్తించనప్పుడు విద్యలన్నీ వ్యర్థమే. ఆ మాటేగా నారదుడు వ్యాసుడికి చెప్పి అందుకే భాగవతం రాయవయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఎన్ని కబుర్లు చెప్పండి. ఎంత మేధో విన్యాసాలు చేయండి. భగవత్ సంకీర్తన లేనప్పుడు అవన్నీ వ్యర్థమే. అందుకే తులసీదాస్ ఒక మాట చెప్తాడు. నేను రామాయణం రాయడానికి సిద్ధపడ్డాను కానీ నాకు అంత శక్తి ఉందా? అయినప్పటికీ రాముని కీర్తిస్తున్నాను గనుక నా దేవశాలలు ఉన్నా పోతాయి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన అటువంటి వాడు. సంకీర్తనకున్న శక్తి ఇది. ఆ కారణం చేతనే విద్యావధూజీవనం, ఆనందాంబి వర్ధనం. పున్నమొస్తే సముద్రం పొంగుతుందట. భగవత్ సంకీర్తన కలిగితే ఆనందం అనే సముద్రం పొంగుతుంది. ఆనందాంబి వర్ధనం. ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం. భగవత్ సంకీర్తన చేసినప్పుడు అందులో ప్రతి పదంలో పరిపూర్ణమైన ఆనందం అనే అమృతము మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అంతే కాదు బాగా తాపంతో దాహంతో ఉన్నవాడు ఒక జలపాతం కింద నిలబడ్డాడు అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది? షవర్ మొత్తం పోతుంది. అలాగే మొత్తం తడిపి శుద్ధం చేయగలిగేటువంటి శక్తి భగవత్ సంకీర్తనకు ఉంది కనుక సర్వాత్మ స్నపనం, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అది దుఃఖాలన్నటిని అంతం ఉందించేటువంటిది ఏదో ఆ ఆనందమే నిర్వాణం. అంతేగాని దుఃఖాలు అంతమవగా మిగిలిన ఏ ఆనందం ఉన్నదో ఆ ఆనంద స్వరూపుడు గనుక నిర్వాణం. అంటే పరమగతి కేవల ఆనంద స్వరూపుడు. అసలు అసలు అదే మనకు మందు అండి. ఇది అది మందు కాదు. భగవత్ సంకీర్తనే మందు. అందుకే చాలాదా బ్రహ్మమిది సంకీర్తనం, మీకు జాలెల్ల నడిపించు సంకీర్తనం, సామజము గాచినది సంకీర్తనం, సామమునకెక్కుడి సంకీర్తనం అన్నాడు రఘునాథాచార్యుల వారు. సామజము గాచినది. అంటే ఏనుగుని కాపాడింది భగవత్ సంకీర్తనమే అవునా లేదా? గజేంద్రుడిని కాపాడినటువంటిది. అంతేగాని సామమునకు ఎక్కుడు. వేదంలో సామగానం కంటే గొప్పది ఈ సంకీర్తనం అన్నాడు. అంటే వేదంలో సామగానం అనేది కొందరు స్పృహ లేకుండానే చేయొచ్చు. ఏది సామగానం చేసి విద్యా ప్రతిష్టన చేసి దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ సంకీర్తన కేవలం భగవత్ భక్తితో భగవత్ అనుభూతితో ఉంటుంది కనుక దాన్ని ఎక్కువగానే భావన చేశారు కొందరు. అందుకే అదే గొప్ప మందు గనుక భేషజం తర్వాత మాట. ఇంతవరకు సామగానము చేయువాడు, సామము ద్వారా తెలియబడువాడు వాడు అన్నాం. అసలు సామమే భగవంతుడు అన్నారు తర్వాత నామం. అంటే తriసామ, సామాగత్ సామాః. సామమే భగవానుడు. సామము అనగానే ఇంతకు ముందు చెప్పాను అనుకూల పరచుకునేటటువంటి ఒకానొక పద్ధతిని భగవత్ స్వరూపంగానే భావించాలి ఇక్కడ. అందుకే ఆ సామరూపంలో ఉన్నటువంటి వాడు ఈ మాట తన గీతంలో చెప్పాడు జాగ్రత్తగా వింటే. వేదానాం సామవేదోస్మి. వేదముల్లో సామవేదాన్ని నేనే అని తెలిసి తెలియజేశాడు కదా. ఇంతవరకు వేదపరంగానే మనం చెప్పుకుంటున్నాం. సర్వదుర్వ్యాసః తర్వాత వచ్చినటువంటివి వేద సంబంధమైన నామములే. అందుకే వేదముల్లో సామవేదం ఆయన స్వరూపం ఉన్నప్పుడు ఒక్క దాని గురించి శ్రేష్టత్వం చెప్తే అన్నీ చెప్పినట్లే. మరి విభూతి కదా. వేదములన్నీ భగవత్ స్వరూపములేనా? మళ్ళీ వేదముల్లో సామమునకు ఉన్న ప్రాధాన్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. పైగా సామ శబ్దానికి ఇంకొక అర్థం పరమార్థమే అది కూడా. వైదికమైన అర్థమే. శతి అంతం కరోతితి సామః. లేదా శతి అంతం కరోతి సామ. సామము అనే మాటకు అర్థం ఏమిటి అంటే అంతం ఉందించువాడు. అంటే నాశనం చేయువాడని కాదు దానికి అర్థం. అంతం అనే మాటకు అర్థం ఏంటంటే దేనితో పూర్తవుతుందో అది అంతం. అందుకు సర్వ వేదములు, సర్వ కర్మలు దేనియందు లయమవుతాయో ఆ బ్రహ్మమునకే సామము అని పేరు. అది వేదంలో ఒకానొక మంత్రము మంత్ర పద్ధతికి మాత్రమే సామము కాదు. పరమాత్మ పేరు సామము. ఎందుకంటే వేదములన్నీ పరమాత్మనే చెప్తూ దాని ద్వారా వచ్చే జ్ఞానం ఏది? చెప్పండి వేదముల ద్వారా వచ్చే జ్ఞానం ఏది? పరమాత్మ జ్ఞానమే వేదములకు ఉద్దేశం. మొదట కర్మకాండ ఉంది. తర్వాత ఉండేది జ్ఞానకాండ. అంటే దేనితో పూర్తయింది వేదం? జ్ఞానకాండతో పూర్తయింది. అంటే వేదములకు పూర్తది జ్ఞానమే. ఎందుకు జ్ఞానం? జ్ఞానమే భగవంతుడు. జ్ఞానం ద్వారా భగవంతుడు గనుక అదే జ్ఞానకాండ వేదములకు పూర్తి గనుక వేదాంతం అని పేరు దానికి వచ్చింది. వేదాంతం అంటే ఇదే అర్థం అండి ఇక్కడ. ఎందుకంటే జడ్జ్మెంట్ తోనే వాదన పూర్తవుతుంది. అవునా లేదా? వాడు వీడు బోల్డు వాదించినా చివరికి జడ్జ్మెంట్ తో క్లోజ్. అలాగ వేదము యొక్క జడ్జ్మెంట్ ఏదో అది ఉపనిషత్తు. అందుకే దానికి జ్ఞానానికి వేదాంతం అని పేరు. అది ఎవరిని తీసుకెళ్తుంది? పరమాత్మ వైపే తీసుకెళ్తుంది. సర్వే వేదాః యస్పదమామనంతి అన్నట్లుగా సామము అంటే సర్వ శాస్త్రములకు చివరిదైనటువంటి అంతమైనటువంటి జ్ఞాన స్వరూపుడు. ఇవన్నీ అందులో లీనం అవ్వడానికే పుట్టాయి. ఎందుకయినా శాస్త్రాలు చదువుతామంటే పరమాత్మను పొందడానికి. తడుముకోకుండానే చెప్పాలి. కానీ శాస్త్రములకు గమ్యం ఆయన. అక్కడికి చేరిన తర్వాత మిగిలేది ఎవరు? ఆయనే మిగిలాడు. నదులు సముద్రానికి చేరి ఏది మిగిలింది? సముద్రమే మిగిలింది. కనుక సామము అంటే పరమాత్మ అని అర్థం చెప్పుకోవాలి. అన్నిటిని పరిపూర్ణం చేయువాడు అది. అంతే కాదు ఇంకొక అర్థంలో అంతమొందించువాడు అన్నారు గనుక అని సామాహః ఎలా అయ్యాడు అంటే తనను గానం చేసే వారి పాపాలను అంతమొందిస్తాడు గనుక సామాహః అని అర్థాన్ని కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పిన ఆ శబ్దంలో ఎన్ని అర్థాలు కనబడుతున్నాయి. సామగస్సామః. అయితే ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది. అన్ని శాస్త్రములకు గమ్యము పరమాత్మ. అంటే పరమార్థ జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడే కలిగేదే ఆనందం. అదే శాంతం. అదే మోక్షం. అందుకే తర్వాత నామములు ఆ పరమాత్మని పొందినప్పుడు మోక్ష స్థితిని వర్ణిస్తున్నాయి చూడండి ఇక్కడ. సామ శబ్దం తర్వాత అది పెట్టడం ఒక ఔచిత్యం. ఆ మోక్ష స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే దాన్ని నిర్వాణం అంటారు ఇక్కడ. త్రిసామ, సామాగత్ సామా, నిర్వాణం, భేషజం, భిషక్, సన్యాస కృత్, శమః, శాంతః, నిష్ఠ, శాంతిహి, పారాయణం. త్రిసామా. మూడు సామములు కలవాడు అన్నాడు ఇక్కడ. అయితే వేదం ఋగ్యజుస్సామములు అయినప్పటికీ కూడా ఒక్క సామము గురించే ఎందుకు చెప్పారు అంటే విశేషం ఏంటంటే వేదముల్లో సామగానానికి ఒక ప్రాధాన్యం ఉన్నది ఇక్కడ. కొన్ని ఋగ్వేద మంత్రములే సామవేదాలని కూడా గోచరిస్తుంటాయి. కొన్ని మొత్తం సామవేదం అంతా ఋగ్వేద మంత్రములు అని కాదు గానీ ఋగ్వేదంలో శ్లోక రూపంగా చెప్పబడుతూ అంటే వాళ్ళు శ్లోకమని అనొచ్చు గానీ శ్లోక శబ్దం అక్కడ వాడరు. మంత్రమే అది. అక్కడ మంత్రముగా పలకబడేవి గాన రూపంలో సామగానంలో ఉంటాయి. ఆ సామగానం యజ్ఞంలో చాలా ప్రధానంగా చెప్పబడుతుంది ఇక్కడ. ఎందుకంటే యజ్ఞం చేసేటప్పుడు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికే కదా యజ్ఞం చేస్తారు. ఎవరైనా మనకు అనుకూలం కావలి కోసం యజ్ఞాది క్రియలు. దేవతలు అనుకూలం కావాలి అంటే వాళ్ళని ఏ విధంగా అనుకూల పరచగలం ఏ ద్రవ్యాలు ఇస్తాం వాళ్ళిచ్చిన ద్రవ్యాలే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళని ఆనందపరిచేది ఏంటంటే ఆ గానం. సామగానం. దేవతల్ని అనుకూలపరచుకోవడమే సామము అంటే లొంగదీసుకొనుట అని అర్థం ఇక్కడ. దేవతల్ని మనకు అనుకూలంగా చేసేటువంటి గాన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సామము అంటారు. ఈ సామములు మూడు ఉంటాయి. దేవవ్రతములు అని పేరు ఈ మూడింటికి కలిపి. ఆ మూడు సామములు బృహత్సామము, రథంతర సామము, వామదేవ సామము లేదా వామ దివ్య సామము అని చెప్పబడుతూ మూడు సామములు ఉన్నాయి. ఈ మూడు సామములు కూడాను సర్వ దేవతా రూపుడైన నారాయణుడిని స్తుతించేవి గనుక త్రిసామః మూడు సామముల రూపంలో ఉన్నటువంటి వాడు. అందుకే సామా గాయత విప్రాయ ఇచ్చాదుల విషయములు ఋగ్వేదంలోనే మంత్రం కనబడుతుంది. సామగానం అంత ప్రధానమైనటువంటిది. అంతే కాదు గాయత్రి కూడా త్రిపద మూడు పదములుగా ఉన్నది గనుక అకార ఉకార మకారమైన ప్రణవము మూడు పాదములతో ఉన్నటువంటి గాయత్రి ఋగ్యజుస్సామాత్మికమైన గాయత్రిని కూడా త్రిసామా అంటే మూడు విధములుగా పలకబడుతూ ఆ భగవంతుని దేవతని మనకు అనుకూలం చేయుదు గనుక త్రిసామా అని గాయత్రి కూడా చెప్పవచ్చు అన్నారు పెద్దలు. మొత్తానికి మూడు సామములు అయినది కదా. అంతే కాదు సామాగః సామాగః. గః అంటే సామము ద్వారా గమ్యతే పొందబడువాడు. సామము ద్వారా తెలియబడువాడు ఎవడో అందురు పరమాత్మను. అంటే సామములకు లక్ష్యమైన వాడు. ఇది ఒక అర్థము. సామాగః అంటే సామగానము చేయువాడు. సామగానం చేసే వాళ్ళందరూ విష్ణు స్వరూపులా అంటే సామగానం చేయడం చిన్న విషయం కాదు. ఆ గానము భగవంతుని నుంచి ముందు ముందు వచ్చింది. వేదములన్నీ ముందు భగవంతుని నుంచి శబ్ద రూపంగా వచ్చేవి కదా ఋషులు వినగలిగి మనకు అందించారు. కనుక మొదట సామము ఎవరి నుంచి వినబడింది? భగవాన్ నుంచి వినబడింది గనుక సామగానము చేయువాడు అని కూడా చెప్పారు. అయితే ఆ రూపంగా సామగానం చేసేటటువంటి వేదవేత్త కూడా భగవత్ విభూతి గలవాడే గనుక సామగానము చేయువాడు అది నారాయణ విభూతిన వారు చెప్తున్నారు. ఎందుకంటే సామగానం చాలా విశేషమైనది గనుకనే ఆ గానాన్ని చెప్పారు. అయితే గానం అంటే అర్థం ఏమిటి? తెలియదు కదా గాన శబ్దం మనం సంగీతానికి గానం అంటారు. ఆ మాటకు వస్తే భారతీయ సంగీతం సామవేద జనితమని అందరికీ తెలిసినదే. మన త్యాగయ్య కూడా సామా నిగమ చతుధా మయ గాన విధి గుణ శీల దయాల వాల మాం పాలయ సామజ వర గమనా అని కీర్తనలో సామా నిగమజ అంటే సామవేదము నుంచి కలిగినటువంటి అని తెలియజేశారు. ఆ సామగానం ఏదో దాన్లే సంగీతానికి మాతృక భారతీయ సంగీతానికి మాతృక. సామము దేనికి? ఇది గుర్తుపెట్టుకోండి సామ దండ భేదోపాయం మాట విన్నారు కదా. అంటే మీరు రాజనీతిలో రాజకీయాల్లో మొదట సామము ఎవరితోను వెళ్ళగానే యుద్ధానికి వెళ్ళిపోకూడదు. మంచి మాటలు చెప్పి మంచి మాటలతోనే పని చేయించాలి. అది కూడా కుదరకపోతే బెదిరించడం. అది భేదం. అది కూడా కుదరకపోతే ఇలాగ సామదాన ముందు దానం. వాడు మాటలతో లొంగకపోతే ఏదో ఆఫర్ చేయాలి. లేకపోతే బెదిరించాలి. అది కుదరకపోతే అప్పుడు దండనంలోకి వెళ్తాం. కానీ మొదటిది ఏది? సామ. అందుకే అక్కడ సామ శబ్దం వేశారు. అంటే చక్కటి భావంతో సద్భావంతో అనుకూల పరచుకోవడమే సామము. ఇది రాజనీతిలో రాజులని అనుకూల పరుచుకోవడం. శత్రువులను అనుకూల పరుచుకోవడం. కానీ దేవతలను అనుకూల పరుచుకోవడం. అందుకే భారతీయ సంగీతం యొక్క పరమార్థం దేవతా ప్రసన్నత. అంతేగాని ప్రజలు చప్పట్లు కొట్టాడు కాదు ఇక్కడ. భగవంతుడిని అనుకరించాలి. అందుకే దేనికిరా సంగీతం అంటే భగవత్ ప్రీతి కోసం అని భావించినటువంటి సంస్కృతి మనది. కారణం వేదం నుంచి కలిగిన సంగీతం మనది గనుక వేద ప్రయోజనం ఏమిటి? సంగీత ప్రయోజనం అయింది. ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళే మనకు సంగీతంలో ఆచార్యులుగా చెప్పబడుతున్నటువంటి త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితలు ఇత్యాదులు అందరూ కూడాను ఈ సామగానంతోనే భగవంతుని ఆరాధిస్తూ సామగాన లోల అన్నారు. అదే విధంగా వేదశిరోమాతృ సప్తస్వర నాధాచల దీపా అని త్యాగయ్య గారు చెప్పడమే కాకుండా నాదతనుమనిశం శంకరం నమామి తే మనసా శిరసా మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటూ సంగీతానికి మాతృక సామ అనేటటువంటిది ఒక సంగీతకారుడు చెప్తే బాగుంటుంది. మనం చెప్తే ఏమిటి? ఆయన్ని మించిన సంగీతజ్ఞుడు ఎవరున్నారు? వాగ్గేయకారులు. సంగీతంలో మహా నిధి ఆయన. ఆయన ఆ విధంగా నిరూపిస్తూ చాలా చెప్పాడు.అటువంటి
అటువంటి సామగః సామగానము చేయువాడు సామము ద్వారా తెలియబడువాడు సామమును గమ్యమైనవాడు. ఇంతవరకు సామ గానము చేయువాడు సామము ద్వారా తెలియబడువాడు అన్నం. అసలు సామమే భగవంతుడు అన్నాడు తర్వాత. అంటే త్రిసామ సామగ సామః. సర్వశాస్త్రార్థం ఒకటే బ్రహ్మ జీవైక్యం లేదా జీవ బ్రహ్మైక్యం. దాన్ని చెప్తున్నటువంటి స్వరూపంగా వ్యాసుని భావించాలి. పైన నీలకాంతులుతో ప్రకాశిస్తున్న తనుగ ఆయనది. అటువంటి వ్యాసని మన శంకరులను కూడా అలాగే భావన చేస్తాం. అలాంటి వ్యాసుడు సర్వదుక్ వ్యాసః. అన్ని విజ్ఞానములు అయినవే. ఇది విజ్ఞానంలో ఎన్ని ఉంటాయో ఒకటే జ్ఞానం కదా అంటే బ్రహ్మజ్ఞానం ఒకటే అయినప్పటికీ దాన్ని పొందడానికి రకరకాల ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలన్నీ వేదమే ఇచ్చింది మనకి. అంటే యోగము కావచ్చు, ఉపాసన కావచ్చు, కర్మలు కావచ్చు, ధ్యానము కావచ్చు ఇత్యాదులన్నీ కూడా వేదముల నుంచి వచ్చాయి గనుక ఇన్ని రకాల జ్ఞానములు. అలాగే పరావిద్యలు అపరావిద్యలు లౌకిక విద్యలు పారమార్థిక విద్యలు. ఇవన్నీ మనకి ఇచ్చినది వేదాది శాస్త్రములే. ఈ సర్వ శాస్త్ర జ్ఞానం ఎవడికుందో వాడు సర్వదక్. ఆ జ్ఞానాన్ని లోకానికి విస్తరించి ఇచ్చినవాడు వ్యాసుడు. ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. అసలు పేరు కృష్ణుడండి. ద్వీపంలో పుట్టాడు గనుక ద్వైపాయనుడు. వేదములను వ్యాసము చేశాడు గనుక వేదవ్యాసుడు అని వచ్చింది. అయితే వేదవ్యాసుడు వేదవ్యాసులు కూడా ఇప్పటి మన్వంతరంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. రాబోయే మన్వంతరంలో వ్యాసుడు మారతాడు. ఇదివరకు మన్వంతర మన్వంతరాలు కూడా వ్యాసులు మారారు. కనుక ఎందరో వ్యాసులు మారతారు. అయితే అందరు ఏ వ్యాసుని మనం పట్టుకోవాలి అంటే మన కాలం నాటి వ్యాసుని మనం ఉపాసన చేయాలి. ఆయన కృష్ణద్వైపాయనుడు పరాశర పుత్రుడు సత్యవతి తనయుడు అయినటువంటి వ్యాస భగవానుని మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అయితే వ్యాస అన్నప్పుడు సర్వ మన్వంతరాల్లో వచ్చే వ్యాసుని కూడా ఇక్కడ భావన చేయాలి. ఎందుకు ఈ వ్యాసుడు వచ్చాడు అంటే బ్రహ్మదేవుని నుంచి వేదములు వచ్చిన తర్వాత ఆయా మహర్షులు స్వీకరించారు. తర్వాత కాలాల్లో ఆ వేదమును పద్ధతిగా అందించి చేయాలంటే ఎలాగా అని బ్రహ్మకు ఆలోచన వచ్చి దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఓం అని శబ్దాన్ని ఆయన పలికాడు. ప్రణవ ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఆ శబ్దములోంచి నారాయణుడు తేజస్సుక రూపంతో బయటకు వచ్చింది. అది చూసి ఎవరా అని చూస్తూ ఉంటే అప్పుడు నారాయణుడే తెలియజేశాడు. ఈయన పేరు అపాంతరతముడు. అపాంతరతముడు అప అంతరతమః. లోపల చీకటిని పోగొట్టువాడు. పేరే ఎంత బాగుందండి. బయట చీకటి పోగొట్టడం కదా అంతరతమః అప. అప అంటే తొలగించుట. లోక లోపలి చీకటిని పోగొట్టువాడు ఈయన. ఈయన పేరు అపాంతరతముడు. ఈ అపాంతరతముడే వివిధ మన్వంతరాల్లో వివిధ మహర్షులుగా వచ్చి వేదములను వ్యాసం చేస్తాడు గనుక ఆయా మన్వంతరాల్లో వ్యాసుడుగా వచ్చేది అపాంతరతముడైన నారాయణుడే. కనుక వ్యాసుడు అంటే ఎవరు అపాంతరతముడైన నారాయణుడి యొక్క స్వరూపము. ఇది తెలిసుకుని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఇది వ్యాసుని యొక్క అసలు స్వరూపము. ఇది ఎక్కడ చెప్పబడుతుంది అంటే మహాభారతంలోనే శాంతన శాసనకాలోనే భీష్మపితామహుడు వ్యాసుని గురించి తెలియజేస్తాడు. నేటికి ఉన్నటువంటి ఆచార్య స్వరూపం మహర్షి స్వరూపం వ్యాసులు వారు. నేటికి ఉన్నార మహాభావులు. ఆయన్ని చూసిన కొందరు సిద్ధులు ఉన్నారు. ఆ వ్యాస భగవానుడు అనునిత్యము తన సూక్ష్మ శరీరంతో నిత్యం వైకుంఠానికి వెళ్లి విష్ణు దర్శనం చేసి వస్తుంటాడు అన్న విషయం కూడా మహాభారతంలోనే చెప్పబడుతుంది ఇక్కడ. అటువంటి వ్యాస స్వరూపంలో మనం ధన్యుదమయ్యాం. ఆ వ్యాసునిటువంటి వాడు అంటే వాచస్పతి రయోనిజః అన్నారు ఇక్కడ. వాచస్పతిహి అయోనిజః రెండు మాటలు గానీ ఒక నామంగానే ఇక్కడ చెప్తున్నారు. వాచస్పతయే అయోనిజాయ నమః అన్న నామంగా మనం చెప్పుకోవచ్చు. వాచస్పతి అంటే వాక్కులకు పతి. అంటే విద్యలకు పతి అయిన వాడు అంటే ప్రభుత్వం. విద్యల మీద పూర్ణ అధికారం కలిగినవాడు సర్వ విద్యా జ్ఞానములు కలిగినవాడు వాచస్పతి. ఆయన అయోనిజుడు. అంటే మాతృగర్భంలోంచి కలగలేదు. అట్టి పట్టివాడు. అయితే ఈ రెండు మాటలు వాచస్పతి అయోనిజః బ్రహ్మదేవుడికి వర్తిస్తాయి. బ్రహ్మదేవుడికి అయోనిజుడు అనే పేరు ప్రసిద్ధి. ఆయనే వాచస్పతి. వాగ్దేవతకు పతి. అసలు ముందు వేదాలు ఆయన నోట్లోంచి వచ్చాయి గనుక ఆయనే వాచస్పతి. బ్రహ్మదేవుడికి వర్తిస్తాయి. ఆయన కూడా మన గురువే. అది నారాయణం పద్మభౌమ వసిష్టమంటాం కదా పద్మభౌమ అయినటువంటి బ్రహ్మదేవుడు విష్ణువు తర్వాత గురువు ఆయన. అంటే పరమేశ్వరుడు తర్వాత గురువు ఎవరు బ్రహ్మదేవుడే. కనుక బ్రహ్మదేవుడు అనగానే మనం తెలుసుకోవాల్సింది మనకందరికీ గురువు ఆయన. ఆయన నుంచి భగవానుడు వేదములను అందించాడు. అటువంటి బ్రహ్మను గ్రహించిన మహర్షులందరికీ అది పెరిగింది. అందుకు వాచస్పతియే అయోనిజః అంటే బ్రహ్మదేవుడు రూపంలో ఉన్నటువంటి వాడు. తద్రూపంగా విద్యలను ఇచ్చినవాడు అనే భావమే కాకుండా బ్రహ్మదేవుడు నోటంత ఈ సరస్వతి సరస్వత్ అంటే సరస్వత్ శబ్దం వచ్చింది కదా దాని నుంచి వచ్చాడు అపాంతరతముడు. అందుకే ఆయన పలుకుల నుంచి వచ్చినవాడే తర్వాత ఈ వేదములన్నిటికీ వ్యాసము చేశారు గనుక ఆయన వాచస్పతి అయ్యారు. అయితే సత్యవతి గర్భంలో నుంచి వచ్చినట్టు కనబడినప్పటికీ కూడా పరాశరుడు తన విష్ణు తేజస్సు సత్యోగర్భంగా వచ్చు. ఇలా వెళ్లి అలా అవతరించి వచ్చేశాడు ఆయన ఇక్కడ. కాబట్టి అది అయోనిజ తత్వమే అని చెప్తూ వాచస్పతి రయోనిజః అని వ్యాదవ్యాసునికి ఈ నామాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట అపాంతతముడు ఎలా వచ్చాడు దాని అసల వ్యాస స్వరూపం. ఆయన మాతృగర్భంలో నుంచి వచ్చాడా? అలా వచ్చాడు అంటే అతభూయోదదశృస్వ భూశబ్దే నానువాదయన్ సరస్వతి పుత్రచారాన్ అత్ర సారస్వతో భవత్. అంటే ఆయన నోట్లోంచి శబ్దం వచ్చింది బ్రహ్మదేవుని నుంచి. ఆ శబ్దములోంచి వచ్చాడు గనుక ఆయన మాతృగర్భంలోంచి రాలేదు. అపాంతరతముడు ఆయనే అనేక వ్యాస రూపాలు అవతరించి వచ్చినప్పుడు అయోనిజుడు అయ్యాడు. ఆయన మాతృగర్భంలోంచి రాక వచ్చిన వాడు గనుక అయోనిజుడు అయ్యాడు. వేదవ్యాసం సంబంధించినటువంటి మాటగా ఈ స్తోత్రీకరణ జరిగింది. తర్వాత వేద స్వరూపము తర్వాత చెప్తున్నారు త్రిసామ సామగ సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత శమశాంతః నిష్టా శాంతిహి పరాయణం. మహాభారతం తర్వాత ఉపదేశింపబడుతున్న విష్ణు సహస్రనామ విద్యలో నిన్నటి రోజున సుధన్వా ఖండపరసుహు దారుణో ద్రవిణప్రదః నామా వరకు చెప్పుకున్నాం. ఇందులో గొప్ప ధనస్సు శత్రువులని ఖండించి ఖండగొట్టలి ధరించినటువంటి స్వామి యొక్క రూపాన్ని తెలుసుకోవడమే కాకుండా ఖండపరసు శబ్దంలో విభజించి పాలన చేసి సరైన కాలంలో జగత్తును లయంపు చేయువాడున్న అర్థాన్ని కూడా మనం వేదపరంగా చెప్పుకున్నాం. దారుణః క్షీణించువాడు అని రెండు విధములుగా చేయువాడు. రెండు విధములు అంటే రెండే ఉన్నాయి బంధం మోక్షం. ఈ రెండు కలిగించేవాడు దారుడ అని చెప్పుకోవచ్చు. ద్రవిణప్రదః తర్వాత ద్రవిణప్రదః అంటే ధనమును ఇచ్చువాడు. ద్రవిణం అంటే సంపద. సాయపగుర్తిబ్యాం ద్రవిణం బ్రహ్మవర్త్యసం వయ్యంతత్వాం అని చెప్పారు. ఆయుషు సంపదలు ద్రవిణం అంటే సంపద అని చెప్తూ అలాగే జ్ఞానం ప్రసాదించేవాడు కూడా ద్రవిణప్రదుడు. ధనమును ఇచ్చువాడు. అయితే ద్రవిణం అనే శబ్దానికి కూడా కథ అనునది అని అర్థం. గమన లక్షణం కలిగినవి ద్రవతి గచ్చతి ద్రవిణం అంటే మాత్రం ద్రవిణం. ద్రవిణం అంటే విద్య కూడా ప్రతి ఒక్కరికి వచ్చేదే గనుక ద్రవిణం అనే శబ్దం దానికి చెప్తున్నారు. అయితే గొప్ప ధనము ఏమిటి అయ్యా అంటే ఇప్పుడు వరకు ఉన్నవాళ్ళు చెప్పగలరు. జ్ఞానమే గొప్ప ధనం. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అన్న అర్థం చెప్తే జ్ఞాన ప్రదాయికుడైనటువంటి భగవానుడు దివిస్పృక్. ఒకే పదం విష్ణు శాస్త్రంలో దీన్ని దివిస్పృక్ అని కూడా చదువుకుంటూ ఉంటాం. ఈయన పరవస్థానం దివిస్పృక్ సదబం జ్ఞాతో వాచస్పతి రయోనిజః. దివిస్పృక్ దివిస్పృక్ అంటే జిలోకం అని పైన అంటే పైన ఉన్న లోకం పేరు జిలోకం. దాటినవాడు అంటే విరాట్ పురుషుడుగా ఆయన అని శిరస్సుతో ఆకుతున్నాడు అని చరిత్ర రాసినప్పుడు ఉంటుంది. దీని గురించి మనం చెప్తూ శిరోజ్యౌహు ముఖమపి దఖనే అంటున్నాం కదా భూపాదౌ యస్య నాభిహి శ్లోకంలో శిరోజ్యౌహు అంటే జ్యౌహు ఏదో అదే జిలోకం. అది దివి. ఆ దివిని స్పృక్ అంటే స్పర్శించినవాడు తాకినటువంటి వాడు అని. అంతవరకున్న విరాట్ రూపాన్ని ఒక్కసారి మనం స్మరించుకుంటున్నాం. అంతే కాకుండా మరొక అర్థంలో ఈ స్వరూపాన్ని భావన చేస్తూ పరమోన్నతమైన జ్ఞానమే తివి. దానిని స్పర్శించుట అంటే దానిని అనుభవింప చేసేటటువంటి వాడు ఎవడో అది దివస్పృక్ అన్న అర్థం చెప్తూ నభస్పృశం దీప్త మనంత కాయం అంటూ భగవద్గీతలో కృష్ణ విరాట్ రూపాన్ని చూసినప్పుడు అర్జునుడు ఇదే మాట అంటాడు నభస్పృశం. అక్కడెక్కడో నభస్సుని నీ యొక్క శిరస్సు తాకుతుందయ్యా అంటే అంతవరకు ఆ నభస్సు అంత పటట్లేదు. ఆ పాతాళ నభస్స్థలాంత అన్న భావమే ఇక్కడ భావన చేయవచ్చు. అలా దివిని తాకుతున్నటువంటి విరాట్ రూపుడు సర్వదుక్ వ్యాసః. వరుణో వారుణో వృక్షః పుస్కరాక్షో మహామనాః. వరుణః వరుణః అంటే జల స్వరూపుడు. జలము ఆయన రూపమే. అయితే వరుణా అని వారికి ఎందుకు వచ్చింది పేరు అది కూడా తెలియాలి కదా. వరుణుడు అంటే జలమునుకు పతి. వరుణం అంటే ఏమిటండి? పదాలకు అర్థం తీస్తేనే తత్వం వస్తుంది కదా. వృణోతి సర్వం ఆవృణోతి అంతటిని ఆవరించి ఏది ఉంటుందో అది వరుణః అన్నారు ఇక్కడ. ఇది మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే భూమిలో ముప్పాతిక భాగా ఆవరించింది ఏది? జలమేగా. పైన జలానికి ఒక లక్షణం ఉంది. ఇలా పోయి ఉంది నీరు అలా వ్యాపిస్తుంది. అది కప్పుతుంది. అలాగా ఆవరించుట లక్షణముగా కలిగినటువంటి వాడు. అదే విష్ణువు కూడా. ఆవురు వృత్తి సర్వత వ్యాపించి పడింది గనుక ఆయన వరుణుడే. జలరూపంగా వ్యాపించి ఉన్నాడు గనుక ఆయన వరుణుడు అని అర్థం. వరుణ్ని నమస్కారం చేసుకొని ఉంటే జలధారలతో కప్పుతాడు జగత్తని. అది వరుణః. తర్వాత వారుణః. వరుణః వారుణః అంటే వరుణునికి సంబంధించినది వారుణః. అంటే వ్యాపక లక్షణం వేటి వేటికి ఉన్నదో అవన్నీ వారుణములు. జల సంబంధమైన వ్యవస్థ అంతా వారుణములే. ఇది తెలుసుకోండి. అందుకు వారుణః. జలమునకు భగవంతునికి ఉన్న అనుబంధం తెలియాలంటే అప్సు సర్వం ప్రతిష్టితం. యోపా మాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఎందుకు జలముల గురించి అంత ప్రాధాన్యం చెప్పారో మనకు తెలియదు. శరీరంలో కూడా ఎక్కువ ఉండేది అదే అంట. విజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కనుక జగత్తంతటికి ఆధారం గనుక జల వ్యవస్థలో వరుణో వారుణో రెండూ ఆయనవి. జలములు అంటే పెరిగేట వృక్షః. వృక్షం కూడా ఆయనే. అందుకే నమో వృక్షేభ్యో హరికేషేభ్యః అన్నాం కదా వృక్షాయ అన్న ఒక నామం కూడా ఉంది విడిగా. భగవంతుడు వృక్ష స్వరూపుడు. ఎలాగో అంటే మీరు వృక్షం ఒకసారి చూడండి. ఒకే చెట్టు అనేక రకాల స్వరూపాలలో కనబడతాయి మనకి. కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పళ్ళు. ఒకటి దానికి ఒకటి బంధం లేదు. కానీ అన్నిటికీ ఒక దానితో బంధం ఉంది. అలా ఒక దానితో ఒకటి సంబంధం లేని జీవులందరూ ఎవడి అనుబంధం వల్ల ఉంటున్నారో వాడు భగవంతుడు. అందుకు వృక్ష శబ్దం ఆయనకు వర్తిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు వృక్ష వరనే అనే ధాతువు ప్రకారంగా వరుణ వారుణ శబ్దాలకు ఇది అర్థం ఇక్కడ. అయితే వృక్షము స్థిరంగా నిలిచి అంతట ఆవరించుతుంది అది ఇక్కడ అర్థం. అలాగే ఉంటూ చెట్టంతా కొమ్మలు ఇంత వ్యాపించింది అంటే అంతగా వ్యాపించింది ఆ చెట్టేగా ఇన్నిటిని పట్టుకొని నిలబడింది. అందుకే దానికి వృక్షః అని పేరు. కదలకు నిలచువాడు అని కూడా అర్థం ఉంది వృక్ష శబ్దానికి అర్థం. వృక్షయవ సబ్దో దివితిష్టత్ ఏకః అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మంత్రం. ఎవడు వృక్షములాగా మనకందనంత స్థానంలో నిలబడి ఉన్నాడో వాడు. అంతే కాదు జగత్తును వృక్షంతో పోల్చాడు. ఊర్ధ్వమూలం అదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసియస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ముందు విశ్వాన్ని చూడు. కర్మలతో వృద్ధి చెందుతుంది. కర్మలు అంటే యజ్ఞాదులు. ఆ కర్మలకు మూలం ఏంటి వేదం. కనుక చెట్టుకు ఆకులు ఎలాగో దీనికి వేదములు అలా ఉన్నాయి. ఛందాంసియస్య పర్ణాని. దీని మూలం ఆకాశంలో ఉంది. తిరగడుವುದು చెట్టు గురించి చెప్పడం ఎంత అద్భుతమైన కల్పన అండి ఇక్కడ. దీని మూలం పైన ఉంది కింద లేదు. అక్కడి నుంచి ఇటు వ్యాపిస్తుంది అని చెప్పారు ఆ వృక్ష రూపుడు ఉన్నవాడు. పుష్కరాక్షః. ఈ శబ్దానికి చాలా విస్తారమైన ఇదివరకో చెప్తాం. పుష్కరమైన అక్షం అంటే విస్తారమైన దృష్టి గలవాడు వికసించిన దృష్టి గలవాడు. పుష్కరమునందు వ్యాపించినవాడు. పుష్కరం అంటే పద్మం. హృదయ పద్మంలో వ్యాపించునటువంటి వాడు. మహామనాః. గొప్ప మనస్సు ఉన్నవాడు. ఆయన మనస్సు ఉందండి మనసుకు కూడా అతీతుడే. మన జ్ఞానేన ధాతువు ప్రకారంగా మనాః అంటే జ్ఞాన స్వరూపుడు. మహామనాః అంటే అనంత జ్ఞాన స్వరూపుడైన వాడు. అటువంటి భగవానుని భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతి రాదిత్యః సహిష్ణుర్గతి సత్తమహా మహామనాః అంటే అనంత జ్ఞాన స్వరూపుడైన వాడు. అటువంటి భగవానుని భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతి రాదిత్యః సహిష్ణుర్గతి సత్తమహా ఇప్పుడు వచ్చింది భగవాన్ అనేటువంటి నామం. బాగా వాడతాం. అందుకే అంత భగవద్గీతలో కృష్ణోవాచ ఎక్కడ లేదు. భగవాన్ వాచే. పుస్తకం పేరే భగవద్గీత. ఆయన మాట్లాడితే భగవద్గీత. ఆయన ఏదైనా చేస్తే భాగవతం. అంతే కదా. ఆయన చేష్టలన్నీ భాగవతం. ఆయన మాటలన్నీ భగవద్గీత. రెండిట్లోనూ భగవానుడు. భగవంతునికి సంబంధించిన అంశములు భాగవతం. భగవంతుడు చెప్పింది భగవద్గీత. ఎన్ని పేర్లు అయినా అన్నా ఇదే పేరు. ఈ చెప్పినవన్నీ విష్ణు కథలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ భాగవతంలోనే ఉన్నాయి. ఇవన్నీ కలిపికొడే భగవానుడు. భగవాన్ అంటే ఏమిటి అంటే శుకయోగి మొదట చెప్తాడు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కధ్యతే. బ్రహ్మమని, పరమాత్మ అని, భగవానుడని మూడు పేర్లతో చెప్పబడేవాడు ఒకడే ఆయన అన్నాడు. వాడిని భగవాన్ అన్నాడు ఇక్కడ. భగ శబ్దానికి అర్థం ఏమిటంటే ఆరు గుణములు కలిగినవాడు. ఈ ఆరు గుణములు ఐశ్వర్య గుణములు. ఐశ్వర్య గుణములు అంటే ఈశ్వర సంబంధమైన గుణములు అది కరణం. అంటే భగవాన్ శబ్దానికి ఆయనే వాచ్యుడు. అదేమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్రియః జ్ఞాన వైరాగ్యయోస్యైవ షన్నాం భగ ఇతీరిణ. భగ శబ్దానికి షడ్గుణములు. అది కలవాడు భగవానుడు. షడ్గుణైశ్వర్యములు. వీటిని ఇవే ఐశ్వర్యం అంటే ఈశ్వర గుణములు అవేంటో చూడండి. ముందు ఐశ్వర్యస్య సమగ్రస్య. ఈ సమగ్ర అనే శబ్దం చెప్పబడిన ఆరింటికి వర్తిస్తుంది. సమగ్రం అంటే కంప్లీట్ గా. లేకపోతే గుణాలు కొందరికి ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అది ఆయన దగ్గర సంపూర్ణముగా ఉంది. ఎప్పుడు ఉంటుంది కనుక ఈ ఆరు గుణములు భగవంతునికి చెప్తున్నారు. మొదటిది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద కాదు. ఈశ్వరస్య భావం అథారిటీ. ఒక దాని పైన పట్టు ఉండడాన్ని ఐశ్వర్యం అంటారు ఇక్కడ. అంతే గానీ క్యాషీయర్ దగ్గర బోల్డ డబ్బు ఉంటుంది. ఐశ్వర్యవంతుడిని ఎవరు అనరు. ఎందుకు? అది ఆయనది కాదు. దాని మీద ఆయనకి అధికారం లేదు. అవునా కాదా. కనుక ఐశ్వర్యం అంటే అర్థం ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. సర్వ జగన్నియామక శక్తి. అది ఆయన సంపూర్ణంగా ఉంది. నేను కొందరు నియమిస్తున్నారు కానీ నేను ఈశ్వరుడు అంటే నీకు అది కంప్లీట్ గా లేదు ఆయనకే. సమగ్ర శబ్దం దానికి వేశారు. సమగ్రమైన ఐశ్వర్యం ఎవరికి ఉందో ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య. రెండవది ధర్మము. ధర్మం అంటే విశ్వనియమములు అది ఆయనకే తెలుసు. ధర్మస్య యశసః. యశస్ అంటే సత్కీర్తి. ఈ రోజుల్లో మీడియా వాడు మన వాడైతే మనం కీర్తిమంతులు. అది కీర్తి అండి ఇక్కడ. కీర్తి యశస్ అనే శబ్దానికి ఎంత మంచి మాట చెప్పిందంటే శాస్త్రం. ధర్మము ద్వారా లభించేటటువంటి సత్కీర్తిని యశస్ అనాలి అన్నారు ఇక్కడ. ఎంత మంచి మాట చెప్పరు ఇక్కడ. అంతే కాదు యస్య నామ మహద్యశః. వేదములన్నీ ఎవడిని కీర్తిస్తున్నాయో దేవతలందరూ ఎవడిని కీర్తిస్తున్నారో ఎప్పుడు కీర్తిస్తారు? ఆ కాలంలో. కథ ఎప్పుడునూ అదే యశస్ అంటే అది ఆయన దగ్గర ఉంది. అది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః సిరియః. సిరి అనే మాటకు శోభ, కాంతి, కళ, వైభవం. ఇవన్నీ వర్తిస్తాయి. అవన్నీ కలిగినవాడు ఆయన. ఎప్పుడూ ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు ఎన్ని నాలుగు. జ్ఞాన వైరాగ్య. ఇది ఇంకో గొప్ప విషయం ఇక్కడ. ఇన్ని ఉంటూ అపూర్వమైన జ్ఞానం. జ్ఞానమే ఆయన. ఇన్ని ఉంటూ వైరాగ్యం. ఇన్ని ఉంటూ జగత్తును అదుగుతు దేనికి అంటడు. దేనితోనూ రాగము, అటాచ్మెంట్ లేనివాడు. అది వైరాగ్యం. ఈ ఆరు గుణాలు కలిగిన వాడిని భగవాన్ అనాలి అన్నారు ఇక్కడ. అది మీరు పదం తీసుకొని ప్రతి అవతారంలో ఆ ఆరు ఎలా చూపిస్తాడో వెతకాలండి. అదే నిజంగా రామాయణం చదవడం. అదే నిజంగా భాగవతం చదవడం ఇక్కడ. అంతే కాదు మరొక శబ్దం భగవాన్ కి విష్ణు పురాణం చెప్తుంది. ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పినవి. అందుకే రెండేసి మూడేసి చెప్పామంటే శాస్త్రాల్లో అలా చెప్పాలి నన్ను ఏం చేయమంటారు. మరొక చోట ఎక్కడైనా భగవాన్ శబ్దం వస్తే ఈ రెండో అర్థం తీసుకెళ్ళిపోదాం. కానీ ఇక్కడే చెప్పుకుందాం. భగవాన్ అంటే అర్థం ఏమిటంటే ఆరు తెలిసినవాడు. నేను చెప్తాను ఈ ఆరు ఉందులో ఎవరికైనా తెలిస్తే చెప్పండి వాడిని నేను భగవాన్ అంటాను. ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి విష్ణు పురాణ వాక్యం ఇక్కడ. ఇందులో మూడు జంటలు. ఉత్పత్తి ప్రలయం. సృష్టి యొక్క ఉత్పత్తి ప్రలయం ఎవడికి తెలుసో. ఇందులో ఎవరైనా ఉన్నారా? లేదు. దీన్ని బట్టి భగవానుడు ఒకడు ఉన్నాడు ఒప్పుకోవాల్సిందే. ఉత్పత్తి ప్రలయములు ఎవరికి తెలుసో. ఈ ఉత్పత్తి ప్రలయాల మధ్య వచ్చేవారు జీవులు. భూతానాం జీవుల యొక్క ఆగతిం గతిం రాక పోక. మనకి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ ఇంకా పిల్ చేయం. తర్వాత వాళ్ళు పిల్ చేసుకుంటారు. కనుక రెండు మనకు తెలియవు. ఆగతిం గతిం. వేత్తి విద్యా మవిద్యాంచ అద్భుతమైన మాట చెప్పాడు అండి. సంసారంలో పడి జన్మలెత్తడం అవిద్య. సంసారం నుంచి బయటపడడం విద్య. ఇందులో ఎప్పుడు పడి ఉంటామో ఎంతవరకు పడి ఉంటామో మన చేతిలో లేదు. ఎప్పుడు బయట పడతామో కూడా మన చేతిలో లేదు. అంటే బంధము మోక్షము. ఈ ఆరు ఎవడికి తెలుసో వాడిని భగవాన్ అనాలి. ఎంతో అద్భుతమైన మాట చెప్పారు. అలాంటి భగవానుడైన విష్ణువులకు నమస్కారము. ఇది భగవాన్ సప్తకం. ఇంకొక అర్థం భగం అనే మాట ఎందుకు వచ్చింది? భం వృద్ధిం గచ్ఛతి త్యర్థః. నిరంతరము వృద్ధి చెందునది. అంటే ప్రకృతికి భగము అని పేరు. ఈ ప్రకృతి నిరంతరం వృద్ధి చెందుతూ వెళుతూ ఉంటుంది. అలాంటి ప్రకృతి ఎవడు అధీనంలో ఉన్నదో వాడు భగవానుడు. ఇది అర్థం ఇక్కడ. అని చెప్పి భగవాన్ భగహ. హా ఇది విసర్గలు కావు. భగహ అంటే వృద్ధిని నశింపజేయువాడు. వృద్ధి పొందిస్తాడు. ప్రళయాదులలో వృద్ధిని నశింపజేస్తాడు. ప్రళయాదులలోనే కాదు. ఎప్పటికప్పుడే ఒకడు వృద్ధి చెందుతూ ఉంటుంది తరిగిపోతు ఉంటుంది. అలా వృద్ధి చెందుతాన్ని మళ్ళీ ఉపసంహరించగలగాలి అండి. సముద్రం దగ్గర కెరటాలు అంత ఉవ్వెత్తును లేస్తాయి. మళ్ళీ టప్పి మని పడతాయి. ఉవ్వెత్తుని లేపిన సముద్రమే మళ్ళీ వెంటనే లాక్కుంటుంది లేదా. కనుక జగత్తులో వ్యాపించిన భగవానుడు ఎప్పుడు వృద్ధి చేయాలో అప్పుడు వృద్ధి చేస్తాడు. తిరిగి లాక్కుంటాడు గనుక భగహ అని మాట చెప్పారు. అంతే కాదు శత్రువుల యొక్క వృద్ధిని నశింపజేయువాడు అని అర్థం చెప్పారు. అసురులు వాళ్ళు విర్రవీగుతూ కొంతకాలం టైం బాగుంటే వాళ్ళకి బాగుంటుంది. కొక్కపట దుష్టత్వానికి ఒక టైం ఉంటుంది అండి. బాధపడక్కర్లే వాళ్ళకి టైం అయిపోతుంది. అది కూడా తెలుసుకోవాలి. అందరు పుట్టలేరు ఇలాంటి రాక్షసులు పోయారు. కనుక వాళ్ళని పోగొడతాడు. వాళ్ళకి ఒక టైం ఇస్తాడు. ఆ టైం అయిపోయినప్పుడు వాళ్ళని తీసేస్తాడు. ఇప్పుడు ఎండలు ఇచ్చి మళ్ళీ వానలు రాబోతున్న టైంలో రెక్కల పురుగులు బోల్డ్ వస్తాయి. ఇరిగేషన్ మీద పడితే గోడల నిండా ఇంటి నిండా ఉంటాయి. ఎంత చిరాకు అండి ఎంతసేపు? కొంతసేపే. అలా కొన్ని వస్తూ ఉంటాయి. కనుక అలా వృద్ధి పెరిగిపోయేటటువంటి వాటిని క్షయింపజేసేవాడు భగహ. ఇలా వృద్ధి చెందుట పెంచుట చేస్తున్న ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అయ్యో వృద్ధి చెందిపోయాయి. అయ్యో పోయాయి అని రెండిటికి బాధపడడు. ఎందుకంటే ఆనందం ఆయన స్వభావం గనుక భగహానంది ఆనంది వనమాలీ. ఈ నామములు చూస్తూ ఉంటే మేదినిపతి గురించి మహావరాహో గోవిందః సుషేనః కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తః చక్రగదాధరః. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఈయన సామాన్యుడు కాదయ్యా. ఈయన బ్రహ్మకు కూడా మూలమైనవాడు. మేము బ్రహ్మనే వేద అంటాం. ఆయనకు కూడా వేధ ఈయన. సృష్టికర్తకే సృష్టికర్త కనుక వేదాః. బ్రహ్మకు వేద అనే పేరు ఎందుకు వచ్చిందండి? నిర్మించి నిర్వర్తించే వాడిని వేదా అనాలి అన్నాడు ఇక్కడ. కనుక వి అనేది విశేషము. దాహ అంటే దుధాన్ ధారణ పోషణయోహో అని అర్థం ప్రకారంగా ధరించువాడు పోషించువాడు ఎవడో వాడు దాహ. విశేషముగా ధరించి పోషించేవాడు బ్రహ్మదేవుడు. ఆయనకు కూడా ఈయన సృష్టికర్త కనుక వేదాః. స్వాంగః. స్వాంగః అంటే అర్థం ఏంటంటే స్వం స్వయమేవ అంగం కార్యకరణే సహకారి యస్య. తనకు తానే సహకారి అయినవాడు స్వాంగుట్టం. అంటే ఎవడో సహకరిస్తే నేను. ఇదుగో భూమిని తెస్తున్నాను. మీరు చెయ్యి వేయండి అని వాడు అడగలేదు. తనకు తానే తీసుకొచ్చాడు. కనుక తనకు తానే సహకారి అయినవాడు స్వయం ప్రకాశ స్వరూపుడైన వాడు ఎవడో వాడు స్వాంగః. అజితః. స్వాంగ శబ్దానికి అర్థం చక్కని అంగములు గలవాడు. మంచి అవయవాలు యజ్ఞ వరాహ స్వామి. అవునండి మంచి బలిసినవి. మంచి అవయవాలు అంటే అర్థం ఏంటంటే యజ్ఞ యజ్ఞ వరాహ స్వామి ప్రతి అవయవం యజ్ఞ స్వరూపం. ఆయన నాలుక అగ్ని. ఆయన ముట్టెలు సుక్స్రువాదులు. ఆయన పాదములు చాతుర్హోత్రములు. ఆయన రోమములు దర్బలు. యజ్ఞ వరాహ స్వామి వర్ణన యజ్ఞమే ఒక రూపం ధరిస్తే యజ్ఞ వరాహం. అయితే వరాహం భూమిని ఉద్ధరించింది అంటాం కానీ యజ్ఞ వరాహం ఎందుకు అన్నారంటే యజ్ఞమే భూమిని ఉద్ధరిస్తుంది అని చెప్పడానికే ఆయన యజ్ఞ వరాహ స్వామి ధరించారు. ఇది వేద మహర్షి ప్రపంచానికి ఇచ్చిన సూచన. ఇప్పటికీ అధునాతన ప్రపంచం తెలుసుకోలేకపోతుంది. తర్వాత ఎప్పుడో తెలుసుకుంటుంది. విశ్వాన్ని రక్షించేది, పోషించేది యజ్ఞమే. ఈ జ్ఞానాన్ని ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కారం. యజ్ఞవరాహ స్వామి. ఆయన అజితాః. ఆయన ఎప్పుడు జయించలేడు. జయింపబడనివాడు స్వభావమే అది. ఇది ఎలా చెప్పగలరు అంటే ఆయన వచ్చేటప్పుడు హిరణ్యాక్షుడు పెట్టిన సైన్యాలన్నీ ఆయన మీదకి వచ్చాయి. విదిలించాడు అంటే మొత్తం పోయారు. హిరణ్యాక్షుడు పోయాడు. అప్పుడు అర్థమైంది అందరికీ. మిగిలిన వాళ్ళకి. ఈయన అజితః. ఈయనను జయించలేము అని. ఈయనే కృష్ణుడు. కనుక గోవింద శబ్దం కృష్ణ శబ్దం ఎవరివి? వరాహ స్వామి. ఏం మా కృష్ణువు కాదు. ఆయన ఆ పని చేశారు గనుక ఆయనే కృష్ణుడు. సరిపోయింది. అంతే కాదు ఏకశృంగో వరాహత్వం అని ఎవరన్నారో తెలుసా? ఒక్క శృంగంతో వచ్చిన వరాహ స్వామి నువ్వయ్యా అని బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తిని స్తుతించాడు అని అర్థం ఇక్కడ. అంటే భూమిని ఉద్ధరించిన స్వభావం కనుక రాముడిని ఇప్పుడు ఉద్ధరించవు. వాళ్ళ కృష్ణుడిని ఉద్ధరించాడు. సరిపోయింది. తర్వాత నామం అజితః కృష్ణః. కృష్ణః అంటే కర్షించువాడు అన్న అర్థం ఇక్కడ. భూమిని పట్టి లాగుతాడు అంటే భూమిని పట్టి కర్షించి నిలబెట్టాడు. ఎప్పుడు? ఆ రోజుల్లో అప్పుడు అదే చేస్తున్నాడు ఆయన. అందుకే కృష్ణః. దీనికి పెద్ద ప్రమాణం ఉదృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహునా వేదమంత్రమే చెప్తుంది ఇక్కడ. అందుకు ఆ మహానుభావుడు కృష్ణః. దృఢః. ఇలా పట్టాడు తెలుసా? ఇదిగో పడిపోతే జాగ్రత్తగా పట్టుకోండి అని కాదు. దృఢః గట్టిగా పట్టాడు. పట్టు ఎలా ఉందంటే ఇది ఒక సైట్ నుంచి కాదుట. సమ్మీక కర్షణం. అన్ని వైపుల నుంచి పట్టాడు. సంకర్షణః. అచ్యుతః. పట్టాడు. తాను జారను పట్టిన భూమిని జారనివ్వడు. కనుక అచ్యుతః సంకర్షణ అచ్యుతః. ఇప్పుడు చదవండి ఈ నామములన్నీ వరాహస సక్రాత్సారం పక్ర. తర్వాత నామములు వరుణో వారుణో వృక్షః. పుష్కరాక్షో మహామనాః. వరుణః.
No comments:
Post a Comment