Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi--110004. Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his abode Adhinayaka Darbar at Adhinayaka Bhavan New Delhi.(Online mode) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Tuesday, 31 March 2026
మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది విష్ణు దశావతారాలు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి అవి మన ప్రాచీన సంస్కృతిలో భాగమని చాలామంది నమ్ముతున్నారు ఇంకా ఒక నమ్మకం బౌద్ధం తర్వాత వచ్చిన సంప్రదాయం అంటే ముందు నుంచే విష్ణు అవతారాలు ఉన్నాయని భావిస్తున్నారు కానీ ఒకసారి మనం ఆగి ఆలోచించాలి ఈ నమ్మకాలకు ఆధారాలు ఏమిటి ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఏ ఆధారంతో చెప్పారు మనము ఎప్పుడైనా ఈ ప్రశ్నలు వేసుకున్నామా మన సమాజంలో ఒక పెద్ద సమస్య ఉంది చాలామంది తమ సొంత గ్రంథాలను
మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది విష్ణు దశావతారాలు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి అవి మన ప్రాచీన సంస్కృతిలో భాగమని చాలామంది నమ్ముతున్నారు ఇంకా ఒక నమ్మకం బౌద్ధం తర్వాత వచ్చిన సంప్రదాయం అంటే ముందు నుంచే విష్ణు అవతారాలు ఉన్నాయని భావిస్తున్నారు కానీ ఒకసారి మనం ఆగి ఆలోచించాలి ఈ నమ్మకాలకు ఆధారాలు ఏమిటి ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఏ ఆధారంతో చెప్పారు మనము ఎప్పుడైనా ఈ ప్రశ్నలు వేసుకున్నామా మన సమాజంలో ఒక పెద్ద సమస్య ఉంది చాలామంది తమ సొంత గ్రంథాలను చదవరు చరిత్రను పరిశీలించారు పెద్దలు చెప్పినదే నిజమని నమ్ముతారు మా తండ్రికి వాళ్ళ తండ్రి చెప్పారు ఇప్పుడు నాకు మా తండ్రి చెబుతున్నారు ఇదే సంప్రదాయం అని అనుసరిస్తారు కానీ ప్రశ్నించకుండా నమ్మడం అది సంప్రదాయం కాదు అది అజ్ఞానం చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక నియమం ఉంది పేరు కాదు ఆధారం ముఖ్యం ఒక పేరు కనిపించిందంటే అది ఒక పెద్ద మతం ఉన్నట్టు కాదు ఒక కథ వినిపించిందంటే అది చరిత్ర కాదు మనము ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవాలంటే ఆ సాహిత్యం ఎప్పుడు పుట్టింది ఎప్పుడు రాయబడింది ఎప్పుడు గ్రంథ రూపం దాల్చింది ఎప్పుడు శిల్పంగా మారింది ఎప్పుడు పూజా విధానంగా మారింది ఈ మొత్తం ప్రక్రియను చూడాలి ఈ వీడియోలో మనం అదే చేయబోతున్నాం కథల నుండి ప్రారంభించి శిల్పాల వరకు పురాణాల వరకు విష్ణు అవతారాల వరకు ఒక్కొక్క దశను ఆధారాలతో పరిశీలిస్తాం ఈ ప్రయాణం చివరికి ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది విష్ణు అవతారాలు నిజంగా ప్రాచీనమా లేక తర్వాతి కాలంలో నిర్మించబడినవా ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ప్రాచీన భారత సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇంద్ర బ్రహ్మ వరుణ కుబేర నారాయణ వాసుదేవ ఇలాంటి పేర్లు చాలా చోట్ల కనిపిస్తాయి చాలామంది ఇక్కడే ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ పేర్లు ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ విష్ణు అవతారాలకు సంబంధించినవి అని కానీ ఇది చరిత్రపరంగా సరైన విధానం కాదు ఈ పేర్లు బౌద్ధ సాహిత్యంలో కూడా కనిపిస్తాయి జాతక కథలు లలిత విస్తార ప్రజ్ఞాపారమిత దివ్యావదాన మహావస్తు ఈ గ్రంథాలలో ఇంద్ర బ్రహ్మ నారాయణ వాసుదేవ ఇలాంటి పేర్లు కనిపిస్తాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ పేర్లు బౌద్ధ గ్రంథాలలో కూడా ఉన్నాయంటే అవి విష్ణు అవతారాలు అవుతాయా లేక ఇవి సాధారణంగా సమాజంలో ఉపయోగంలో ఉన్న పేర్లా చరిత్ర మనకు చెప్పేది చాలా స్పష్టంగా ఉంది పేరు కనిపించటం మాత్రమే ఒక అవతారాన్ని నిరూపించదు ఒక వ్యక్తిని విష్ణు అవతారం అని చెప్పాలంటే మూడు ముఖ్యమైన ఆధారాలు అవసరం గ్రంథంలో స్పష్టంగా చెప్పాలి అతని విష్ణు అవతారం అని ఒక స్థిరమైన జాబితాలు ఉండాలి శిల్పాలు శాసనాలు కూడా అదే విషయాన్ని చెప్పాలి ఈ మూడు లేకపోతే అది కేవలం పేరు మాత్రమే అవతారం కాదు ఇప్పుడు ఇంకో విషయం గమనించాలి ప్రాచీన కాలంలో ఒకే కథ ఒకే పేరు వేరు వేరు సాహిత్యాల్లో కనిపించవచ్చు అది సహజం ఎందుకంటే అవి ఒకే సమాజంలో తిరిగే కథలు కానీ తర్వాత కాలం లో ఆ పేర్లను ఒక మతానికి మాత్రమే సంబంధించినవి అని చెప్పటం చరిత్రపరంగా సరైనది కాదు అందుకే మనము ఒక విషయం గుర్తుంచుకోవాలి పేరు ఉంది కాబట్టి అవతారం కాదు ఆధారం ఉన్నప్పుడే అది చరిత్ర బౌద్ధ సాహిత్యం ఒక ముఖ్యమైన లక్ష్యంతో అభివృద్ధి చెందింది సమాజాన్ని చైతన్యవంతం చేయడం నీతి బోధించడం మానవ జీవన విధానాన్ని సరిచేయడం ఈ లక్ష్యంతో బుద్ధుడు మరియు బౌద్ధ గురువులు జాతక కథల రూపంలో బోధించారు ఈ జాతక కథలు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా జంతువులు రాజులు కుటుంబ కథల రూపంలో చెప్పబడ్డాయి ఇవి మతపరమైన అవతారాలు కాదు ఇవి నీతి బోధించే విద్యా పద్ధతి ఇప్పుడు ఒక ముఖ్యమైన ఉదాహరణ చూద్దాం దశరథ జాతక కథ 461 ఈ కథలో రామ పండితుడు అనే పాత్ర ఉంటుంది ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఆయన చెల్లెలు సీత వారి తండ్రి దశరధుడు ఈ కథలో రామ పండితుడు తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి హిమాలయ ప్రాంతాలకు వెళ్లి 12 సంవత్సరాలు జీవిస్తాడు తండ్రి మరణించిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన మాటను మార్చకుండా ఆ 12 సంవత్సరాల వనవాసాన్ని పూర్తిగా ముగించుకుంటాడు తర్వాత తిరిగి వచ్చి తమ్ముడు లక్ష్మణుడు మరియు చెల్లెల సీతతో కలిసి రాజ్యాన్ని స్వీకరిస్తాడు ఇక్కడ ప్రధానంగా చెప్పబడిన విషయం తండ్రి మాటకు కట్టుబడి ఉండడం ధర్మం అంటే ఏమిటో చూపించడం నిజాయితీ జీవనం ఇదొక నీతి కథ ఇప్పుడు మనం ఆలోచించాలి తర్వాత కాలంలో వచ్చిన రామాయణంలో కూడా ఇలాంటి కథ నిర్మాణం కనిపిస్తుంది రాముడు లక్ష్మణుడు సీత దశరథుడు వనవాసం తండ్రి మాటకు కట్టుబడి ఉండడం ఇవి అన్నీ అక్కడ కూడా కనిపిస్తాయి కాబట్టి ప్రశ్న ఏమిటి ఈ కథా మూలాలు ముందుగా సమాజంలో ఉన్నాయా లేక తర్వాత కాలంలో ఒక గ్రంథంగా అభివృద్ధి చెందాయా చరిత్ర పరిశీలన మనకు ఏమి చెబుతుంది అంటే మొదట కథలు నీతి కోసం చెప్పబడ్డాయి తర్వాత అవి విస్తరించి పెద్ద కథలుగా మారాయి అంటే జాతక కథలలో కనిపించే నీతి అంశాలు తర్వాతి కాలంలో విస్తరించి పురాణ సాహిత్యంగా అభివృద్ధి చెందిన అవకాశం ఉంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం పోలిక ఉండటం అంటే కాపీ అని నిర్ధారణ కాదు కానీ సంబంధం లేకుండా కూడా కాదు అంటే ఈ కథలు ఒకే సామాజిక నేపథ్యం నుండి వచ్చినవి తర్వాత వేరు వేరు విధాలుగా రూపదిద్దుకున్నాయి ప్రాచీన భారతదేశంలో జ్ఞానం కేవలం పుస్తకాలలో మాత్రమే ఉండేది కాదు ఆ కాలంలో చాలామంది చదవలేకపోయేవారు అందుకే జ్ఞానాన్ని అందరికీ చేరే విధంగా బోధించాల్సిన అవసరం వచ్చింది అక్కడే బౌద్ధ సాంప్రదాయం ఒక గొప్ప పద్ధతిని ఉపయోగించింది మొదట జాతక కథల రూపంలో నీటి బోధించారు ఈ కథలు సులభంగా అర్థమయ్యేలా జంతువులు రాజులు సాధారణ మనుషుల కథలుగా చెప్పబడ్డాయి ప్రజలు వినేవారు అర్థం చేసుకునేవారు జీవితంలో అమలు చేసేవారు కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన దశ ప్రారంభం అవుతుంది ఈ కథలు తర్వాత కేవలం వినిపించే కథలుగా మాత్రమే ఉండలేదు వాటిని శిల్పాలుగా చెక్కడం ప్రారంభమైంది స్తూపాలు గుహలు విహారాల గోడలపై ఈ జాతక కథలు చిత్రాలుగా మరియు శిల్పాలుగా కనిపిస్తాయి ఇది ఒక విప్లవాత్మక మార్పు ఎందుకంటే చదవలేని వ్యక్తి కూడా ఆ శిల్పాన్ని చూసి కథను అర్థం చేసుకోవచ్చు ఒక చేప రూపంలో ఉన్న బోధిసత్వుడు ఒక పందిర రూపంలో ఉన్న పాత్ర ఒక తాబేలు కథ ఇవి చూసి ప్రజలు అందులోని నీతి అర్థం చేసుకునేవారు అంటే కథను వినడం మాత్రమే కాదు చూడడం ద్వారా కూడా నేర్చుకునే విధానం ఏర్పడింది ఇది ఒక విజువల్ ఎడ్యుకేషన్ సిస్టం మొదట కథ తర్వాత శిల్పం తర్వాత సామూహిక అవగాహన ఇలా ఒక జ్ఞాన పరంపర ఏర్పడింది ఇప్పుడు ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి ఈ శిల్పాలలో కనిపించే రూపాలు చేప తాబేలు పంది సింహం మనిషి కలయిక రూపాలు ఇవి మొదట నీతి కథల పాత్రలు కానీ తర్వాత కాలంలో ఈ రూపాలకు కొత్త అర్థాలు ఇవ్వబడ్డాయి వాటిని దేవతలుగా అవతారాలుగా మహిమలుగా వివరించడం ప్రారంభమైంది అంటే మొదట నీటి చెప్పడానికి ఉపయోగించిన రూపాలు తరువాత పూజా పాత్రలుగా మారాయి ఇది ఒక పెద్ద మార్పు జ్ఞానము నుండి భక్తి వైపు మార్పు వివరణ నుండి విశ్వాసం వైపు మార్పు ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ప్రాచీన కాలంలో ఈ కథలు మనిషిని మంచి జీవితం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగించబడ్డాయి కానీ తర్వాత కాలంలో అదే కథలు అదే రూపాలు మహిమలు మాయలు అద్భుతాలు అనే భావనలతో మళ్ళీ వివరించబడ్డాయి దీంతో నీటి మీద దృష్టి తగ్గి భక్తి మీద దృష్టి పెరిగింది జ్ఞానం తగ్గి అంధ విశ్వాసం పెరిగింది ఇది చరిత్రలో జరిగిన ఒక ముఖ్యమైన మార్పు అందుకే మనము ఏ శిల్పాన్ని చూసినా ఏ కథను విన్నా ముందుగా ఈ ప్రశ్న అడగాలి ఇది మొదట ఏ ఉద్దేశంతో చెప్పబడింది నీతి కోసమా లేక పూజ కోసమా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడు మాత్రమే మనకు నిజమైన చరిత్ర అర్థమవుతుంది కాలం మారుతుంటే కథల అర్థం కూడా మారుతుంది ప్రాచీన కాలంలో చెప్పబడిన జాతక కథలు ముఖ్యంగా నీతి బోధించడానికి ఉపయోగించబడ్డాయి ప్రజలు వాటిని జీవన మార్గదర్శకంగా తీసుకున్నారు కానీ తరువాతి కాలంలో సమాజ నిర్మాణం మారింది పాలన వ్యవస్థలు మారాయి మతపరమైన ప్రభావం పెరిగింది ఇక్కడే ఒక ముఖ్యమైన మార్పు జరిగింది అదే కథలను కొత్త అర్థాలతో మళ్ళీ వివరించడం ప్రారంభమైంది ముందు ఒక కథలో కనిపించిన పాత్ర తరువాత ఒక దేవుడిగా మారింది ముందు ఒక నీతి కోసం చెప్పిన సంఘటన తరువాత ఒక దైవ మహిమగా చెప్పబడింది ఇది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు దశలవారీగా జరిగిన ప్రక్రియ మొదట కథ ఉంది తరువాత ఆ కథకు గౌరవం పెరిగింది తరువాత ఆ కథలోని పాత్రలకు ప్రత్యేక స్థానం ఇచ్చారు చివరికి వాటిని దేవతలుగా భావించడం ప్రారంభమైంది ఇది ఒక సామాజిక మరియు సాంస్కృతిక మార్పు ఇప్పుడు మనం కొన్ని విషయాలు గమనించాలి ఒక కథలో ఉన్న సాధారణ మనిషి తరువాత కాలంలో అసాధారణ శక్తులు కలిగిన వ్యక్తిగా మారాడు ఒక జంతువు కథలో ఉన్న పాత్ర తరువాత కాలంలో ఒక దైవ అవతారంగా మారింది ముందు నీతి ప్రధానంగా ఉండేది తర్వాత మహిమ ప్రధానంగా మారింది ఈ మార్పు ఎందుకు జరిగింది సమాజాన్ని నియంత్రించడానికి విశ్వాసాలను బలపరచడానికి పూజా విధానాలను స్థిరపరచడానికి ఈ కథలను మతపరమైన వ్యవస్థలో భాగంగా మార్చడం జరిగింది ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి ఒక కథ పుట్టినప్పుడు దాని ఉద్దేశం ఒకటే కానీ అది వందల సంవత్సరాల తరువాత మరో రూపంలో కనిపించినప్పుడు దాని అర్థం పూర్తిగా మారిపోతుంది అందుకే మనము ఏ పురాణ కథను చూసినా ఈ ప్రశ్న అడగాలి ఈ కథ మొదట ఎక్కడ కనిపించింది ఏ ఉద్దేశంతో చెప్పబడింది తరువాత అది ఎలా మారింది ఈ మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నప్పుడే మనకు నిజమైన చరిత్ర అర్థం అవుతుంది ఇక్కడే విష్ణు అవతారాల అంశం కూడా వస్తుంది చేప తాబేలు పంది వంటి రూపాలు మొదట నీతి కథలలో కనిపించాయి తరువాత అవే రూపాలు విష్ణు అవతారాలుగా వివరించబడ్డాయి అంటే ముందు ఉన్న కథలను తరువాత ఒక మతపరమైన వ్యవస్థలోకి తీసుకువచ్చి కొత్త అర్థం ఇచ్చారు ఇది సహజమైన పరిణామం కాదు ఇది ఒక నిర్మాణ ప్రక్రియ అందుకే మనం చరిత్రను అర్థం చేసుకోవాలంటే కేవలం వినడం కాదు పరిశీలించాలి ఆధారాలు చూడాలి లేకపోతే కథలు నిజాలుగా మారతాయి నిజాలు మరుగున పడతాయి ఇప్పటివరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం మొదట కథలు వచ్చాయి తర్వాత అవి శిల్పాలుగా మారాయి తర్వాత వాటికి కొత్త అర్థాలు ఇచ్చారు ఇప్పుడు ఈ మార్పు ఎలా జరిగింది అనేది కొన్ని స్పష్టమైన ఉదాహరణలతో చూద్దాం మొదట మత్య కథ బౌద్ధ జాతక కథల్లో బోధిసత్వుడు ఒక చేప రూపంలో కనిపిస్తాడు ఆ కథలో ప్రధాన విషయం ప్రాణాలను రక్షించడం ప్రమాదం నుండి బయటపడటం జీవ రక్షణ అనే నీతి ఇది ఒక నైతిక బోధ తర్వాత కాలంలో ఇదే కథను తీసుకొని మత్స్య అవతారం అనే రూపంలో వివరించారు అక్కడ చేప ఒక దేవుడి అవతారంగా మారింది నీతి కథ దైవ కథగా మారింది ఇప్పుడు కూర్మ కథ జాతక కథల్లో తాబేలు పాత్రతో కొన్ని నీతి కథలు ఉన్నాయి ఈ కథలలో ప్రధానంగా చెప్పేది ఆలోచించి మాట్లాడడం అహంకారం వల్ల నష్టాలు ఇవి సాధారణ జీవన పాఠాలు తర్వాత కాలంలో ఇదే తాబేలు రూపం కూర్మ అవతారంగా మారింది ఒక నీతి పాత్ర దైవ అవతారంగా మారింది ఇప్పుడు వరాహ కథ సుకుర జాతక కథలో ఒక అడవి పంది ఒక ప్రాంతాన్ని రక్షిస్తుంది ఇది ధైర్యం రక్షణ సమాజానికి సేవ అనే భావనను తెలియజేస్తుంది తర్వాత కాలంలో ఇదే కథా మూలం వరాహ అవతారంగా మారింది ఇక్కడ పంది ఒక దేవుడి రూపంగా వివరించబడింది ఇప్పుడు నృసింహ రూపం గురించి ఆలోచించండి మనిషి మరియు సింహం కలిసిన రూపం ఇలాంటి మిశ్రమ రూపాలు ప్రాచీన కథల్లో మరియు శిల్పాల్లో సాంబోలిక్ రూపంగా కనిపిస్తాయి తర్వాత కాలంలో ఇది నరసింహ అవతారంగా స్థిరపడింది ఇప్పుడు కృష్ణుని కథను పరిశీలిద్దాం జాతక కథల్లో వాసుదేవుడు అనే పాత్ర కనిపిస్తుంది గత పండిత జాతక కథలో వాసుదేవుడు తన మామను చంపి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు చివరికి వేటగాడి చేతిలో మరణిస్తాడు ఈ కథని నిర్మాణాన్ని గమనిస్తే తర్వాత కాలంలో భాగవతంలో కనిపించే కృష్ణుని కథతో పోలికలు కనిపిస్తాయి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇది ఒకే కథ కాదు కానీ కథా మూలాలు దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన నిర్ధారణ ఈ అన్ని ఉదాహరణలు మనకు ఏమి చెబుతున్నాయి ప్రాచీన కాలంలో ఉన్న కథలు సామాజిక నీతి కోసం ఉపయోగించబడ్డాయి తర్వాత కాలంలో అదే కథలను తీసుకొని ఒక మతపరమైన వ్యవస్థలోకి చేర్చారు అక్కడ పాత్రలో దేవతలయ్యాయి కథలు అవతారాలు అయ్యాయి నీతి మహిమగా మారింది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పోలిక ఉందని చెప్పడం అంటే ఒకటి మరో దాని కాపీ అని చెప్పడం కాదు కానీ సంబంధం ఉందని కూడా నిరాకరించలేం అంటే ఈ కథలు ఒకే సామాజిక సాంస్కృతిక వాతావరణంలో పుట్టి తరువాత వేరు వేరు రూపాల్లో అభివృద్ధి చెందాయి ఇప్పటివరకు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకున్నాం కథలు ముందుగా వచ్చాయి తర్వాత అవి శిల్పాలుగా మారాయి తర్వాత వాటికి కొత్త అర్థాలు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న విష్ణు అవతారాలు అనే పూర్తి వ్యవస్థ ఎప్పుడు ఎలా ఏర్పడింది ఇది ఒక్క రోజులో జరిగినది కాదు ఇది ఒక దీర్ఘకాలిక నిర్మాణ ప్రక్రియ మొదటి దశ సాధారణ శకపూర్వం నుండి ప్రారంభ శతాబ్దాల వరకు వాసుదేవ నారాయణ వంటి పేర్లు మాత్రమే కనిపిస్తాయి ఈ దశలో అవతారాలు లేవు దశావతారాల జాబితా లేదు విష్ణు అవతార సిద్ధాంతం లేదు కేవలం వ్యక్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి రెండవ దశ నాలుగవ నుండి ఆరవ శతాబ్దం వరకు కొన్ని ప్రత్యేక రూపాలు కనిపించడం ప్రారంభమైంది వరాహ రూపం నసింహ రూపం ఇవి శిల్పాలలో కనిపిస్తాయి కానీ ఇవి ఇంకా ఒక పూర్తి వ్యవస్థ కాదు ఇవి విడివిడి రూపాలు మాత్రమే మూడవ దశ ఏడవ నుండి 10వ శతాబ్దం వరకు పురాణ సాహిత్యం రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది విష్ణు పురాణం భాగవత పురాణం వంటి గ్రంథాలలో విష్ణు అవతారాల భావనను ఒక సిద్ధాంతంగా వివరించడం ప్రారంభమైంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ గ్రంథాల ప్రస్తుత రూపాలు తర్వాత శతాబ్దాల మాన్యుస్క్రిప్టుల ద్వారా మనకు అందాయి అంటే ఈ భావన ఈ కాలంలో నిర్మించబడుతున్న దశలో ఉంది నాలుగవ దశ 10వ శతాబ్దం తర్వాత మొదటిసారి ఒక స్థిరమైన జాబితా కనిపిస్తుంది దశావతారాలు మస్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి ఇక్కడ మనం ఒక పెద్ద మార్పు గమనించాలి ముందు విడివిడిగా ఉన్న కథలు ఇప్పుడు ఒకే జాబితాగా మారాయి ఇది ఒక వ్యవస్థీకరణ ఐదవ దశ 12 నుండి 15వ శతాబ్దం మధ్య దేవాలయ వ్యవస్థ బలపడింది శిల్పాలు గోపురాలు మందిర నిర్మాణాలు ఇవి విస్తృతంగా అభివృద్ధి చెందాయి ఇక్కడ దశావతారాలు కేవలం కథలుగా కాకుండా పూజా విధానంలో భాగమయ్యాయి అంటే కథ సిద్ధాంతం తర్వాత పూజా వ్యవస్థ ఈ మూడు దశలు పూర్తయ్యాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ మొత్తం ప్రక్రియ ఏమి చెబుతోంది విష్ణు అవతారాలు ప్రాచీనకాలం నుంచే ఒక స్థిరమైన వ్యవస్థగా లేవు ఇది దశల వారీగా అభివృద్ధి చెందిన నిర్మాణం మొదట పేర్లు తర్వాత కథలు తర్వాత శిల్పాలు తర్వాత గ్రంథాలు చివరికి ఒక మతపరమైన వ్యవస్థ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఒక వ్యవస్థ ఎంత పాతది అనేది అది చెప్పబడిన కథల వయసుతో కాదు దానికి ఉన్న ఆధారాలతో నిర్ణయించాలి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుంది విష్ణు అవతారాలు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని చెబుతుంటే ప్రాచీన శిల్పాలలో అవి ఎందుకు కనిపించవు మనము సాంచి భారహుట్ అమరావతి అజంతా వంటి ప్రాచీన స్తూపాలు గుహలు శిల్పాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది ఆ శిల్పాలలో జాతక కథలు కనిపిస్తాయి జంతు రూపాలు కనిపిస్తాయి బోధిసత్వ రూపాలు కనిపిస్తాయి కమలం పద్మం వంటి చిహ్నాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ శిల్పాలు దేవతల అవతారాలను చూపించడం కాదు మానవ జీవనానికి సంబంధించిన నీతి బోధలను చూపిస్తున్నాయి ఇప్పుడు మరింత ముఖ్యమైన విషయం గమనించాలి మత్స్య కూర్మ వరాహ వంటి రూపాలు కొన్ని చోట్ల కనిపించినా వాటిని విష్ణు అవతారాలుగా స్పష్టంగా గుర్తించే ఆధారాలు కనిపించవు ఎక్కడా ఈ రూపం విష్ణు అవతారం అని చెప్పే శాసనం లేదు స్థిరమైన దశావతార జాబితా లేదు అవతార సిద్ధాంతం కనిపించదు ఇప్పుడు విష్ణు విగ్రహాల గురించి మాట్లాడితే వైష్ణవ సాంప్రదాయంలో చెప్పే విధంగా సింకు చక్ర గద పద్మాలతో ఉన్న సంపూర్ణ విష్ణు రూపం ప్రాచీన కాల శిల్పాలలో కనిపించదు ఆ రూపం మనకు తరువాతి శతాబ్దాలలో మాత్రమే స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది అంటే విష్ణు ఐకానోగ్రఫీ కూడా ఒక దశల వారి అభివృద్ధి ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ప్రాచీన శాసనాలను పరిశీలిస్తే బౌద్ధ నిర్మాణాలు దానాలు బోధిసత్వ భావనలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ దశావతారాల పూర్తి వ్యవస్థను వివరించే శాసనాలు కనిపించవు ఇది ఏమి సూచిస్తుంది అంటే ఆ కాలంలో విష్ణు అవతారాల వ్యవస్థ ఒక స్థిరమైన మతపరమైన నిర్మాణంగా ఇంకా ఏర్పడలేదు ఇప్పటివరకు మనం కథలు ఎలా పుట్టాయి శిల్పాలుగా ఎలా మారాయి అవతారాలుగా ఎలా రూపాంతరం చెందాయి అన్నది చూసాం ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి ఏ సాహిత్యం అయినా నిజంగా ఎప్పటిదా దానో ఎలా తెలుసుకోవాలి దానికి మూడు ప్రధాన ఆధారాలు అవసరం సాహిత్యం ఎప్పుడు రచించబడింది ఏ లిపిలో రాయబడింది ఆ గ్రంథానికి సంబంధించిన ప్రాచీన మ్యానుస్క్రిప్టులు ఉన్నాయా ఈ మూడు లేకుండా ఏ సాహిత్యాన్నైనా చాలా ప్రాచీనం అని చెప్పడం కష్టం ఇప్పుడు పురాణ సాహిత్యాన్ని పరిశీలిద్దాం విష్ణు పురాణం భాగవత పురాణం వంటి గ్రంథాలు మనకు లభిస్తున్న రూపంలో ప్రధానంగా సంస్కృతంలో ఉన్నాయి మరియు ఎక్కువగా దేవనాగరి లిపిలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది దేవనాగరి లిపి 10వ శతాబ్దం తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ లిపిలో మనకు లభిస్తున్న గ్రంథాలు ఈ కాలానికి తర్వాత ప్రతులు అంటే ఒక ప్రశ్న వస్తుంది ఈ గ్రంథాలు అంతకుముందు లేవా ఉండే అవకాశం ఉంది కానీ మనకు లభిస్తున్న ఆధారాలు తర్వాత శతాబ్దాలవే చరిత్రలో ఆధారం అంటే మనకు దొరికినదే కల్పన కాదు ఇప్పుడు మరొక విషయం గమనించాలి ప్రాచీన కాలంలో బ్రాహ్మి లిపి తర్వాత గుప్తా లిపి ఉపయోగంలో ఉన్నాయి ఈ లిపుల్లో బౌద్ధ శాసనాలు దానం శాసనాలు స్తూపాలకు సంబంధించిన శాసనాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి కానీ దశావతారాల పూర్తి వ్యవస్థను చెప్పే శాసనాలు ఈ ప్రారంభ దశలో కనిపించవు ఇప్పుడు గ్రంథాల అభివృద్ధి ఎలా జరిగింది మొదట మాటల ద్వారా కథలు ప్రచారం అయ్యాయి తర్వాత వాటిని లిఖిత రూపంలో రాయడం ప్రారంభమయింది తరువాత వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రూపాల్లో మార్పులు జరిగాయి చివరికి ఒక స్థిరమైన గ్రంధ రూపం ఏర్పడింది అంటే మనకు కనిపిస్తున్న ఒక గ్రంధం అది రాసిన కాలం మాత్రమే కాదు అది అభివృద్ధి చెందిన మొత్తం ప్రక్రియను సూచిస్తుంది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి ఒక గ్రంథం ఎంత పాతది అనేది దాని కథ ఎంత పాతదో ఆధారంగా కాదు దానికి ఉన్న లిఖిత ఆధారాల ఆధారంగా నిర్ణయించాలి ఇప్పుడు విష్ణు అవతారాల విషయానికి వస్తే దశావతారాల పూర్తి వివరణ ఉన్న గ్రంథాలు మనకు లభిస్తున్న రూపంలో తరువాతి శతాబ్దాలకు చెందినవే అంటే ఈ అవతార వ్యవస్థ కూడా లిఖిత రూపంలో తరువాత కాలంలోనే స్థిరపడింది ఇప్పుడు ఒక ముఖ్యమైన నిర్ధారణ సాహిత్యం మొదట కథగా పుట్టింది తరువాత లిపిలో రాయబడింది తర్వాత గ్రంథంగా స్థిరపడింది ఈ మూడు దశలు పూర్తయ్యాకే అది ఒక స్థిరమైన సాంప్రదాయంగా మారుతుంది ఇప్పటివరకు మనం కథలు ఎలా పుట్టాయి అవి శిల్పాలుగా ఎలా మారాయి పురాణాలుగా ఎలా రూపాంతరం చెందాయి అన్నది చూసాం ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని చూడాలి ప్రాచీన భారతదేశం ఎలా ఉండేది చాలామంది ఒక విషయాన్ని మర్చిపోయారు ఈ దేశం ఒకప్పుడు జ్ఞానానికి కేంద్రం ఇక్కడ పెద్ద పెద్ద విద్యా కేంద్రాలు ఉన్నాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వివిధ దేశాల నుండి విద్యార్థులు వచ్చి చదివారు చైనా వంటి దేశాల నుండి వచ్చిన ప్రయాణికులు ఇక్కడి విద్యా వ్యవస్థ గురించి వివరంగా వర్ణించారు వారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ తత్వశాస్త్రం వైద్యం భాషలు లోగిక సమాజ శాస్త్రం అన్నీ బోధించబడేవి ఇది ఒక జ్ఞాన సమాజం ఈ విద్యా కేంద్రాల్లో జ్ఞానం మాత్రమే కాదు నీతి జ్ఞానం కూడా బోధించబడేది జాతక కథలు ధర్మ బోధనలు సమాజ జీవన విధానం ఇవి అన్నీ అక్కడి విద్యలో భాగం అంటే మతం కంటే జ్ఞానం ముఖ్యమైనది ఇప్పుడు ప్రశ్న ఆ విద్యా వ్యవస్థ ఏమైంది ఆ విశ్వవిద్యాలయాలు ఎందుకు కనిపించడం లేదు చరిత్ర చెబుతోంది కాలక్రమేణ ఈ జ్ఞాన కేంద్రాలు క్రమంగా క్షీణించాయి కొన్ని ధ్వంసమయ్యాయి కొన్ని వాడుకలో లేకుండా పోయాయి కొన్ని మార్పు చెందాయి ఇక్కడే ఒక ముఖ్యమైన మార్పు జరిగింది ముందు విద్యా కేంద్రాలు విచారణ స్థలాలు జ్ఞాన ఆరామాలు ఉన్నచోట తర్వాత కాలంలో మతపరమైన కట్టడాలు ఏర్పడ్డాయి ముందు కథలు బోధించబడిన ప్రదేశాలు తర్వాత పూజలు జరిగే ప్రదేశాలుగా మారాయి ముందు శిల్పాలు విద్య కోసం చెక్కబడ్డాయి తరువాత అవి దేవతల రూపాలుగా భావించబడ్డాయి ముందు మనిషి ఎలా జీవించాలి అని బోధించబడింది తర్వాత దేవుడిని ఎలా పూజించాలి అనే దిశగా మారింది ఇది ఒక పెద్ద సామాజిక మార్పు జ్ఞానం కేంద్రం నుండి భక్తి కేంద్రంగా మార్పు విచారణ నుండి విశ్వాసం వైపు మార్పు ఇప్పుడు మనం ఆలోచించాలి ప్రపంచ దేశాల నుండి విద్యార్థులు వచ్చి చదివిన ఈ దేశం ఎలా మూఢనమ్మకాలలో మునిగిపోయింది ఎలా ప్రశ్నించడం మానేసింది దానికొక కారణం జ్ఞానాన్ని ప్రశ్నించే సంప్రదాయం తగ్గిపోవడం కథలను పరిశీలించడం వాగిపోవడం వాటిని నేరుగా నమ్మడం ప్రారంభించడం ఇక్కడే జాతక కథలు నీతి బోధనలు క్రమంగా పురాణాలుగా మారాయి అవతారాలుగా మారాయి పూజా విధానంగా మారాయి ఇది అర్థం చేసుకోకుండా మనము కేవలం సంప్రదాయమని అనుసరిస్తే మనము జ్ఞానాన్ని కోల్పోతాం ఇప్పటివరకు మనం ఒక దీర్ఘమైన ప్రయాణం చేశం కథల నుండి ప్రారంభించి శిల్పాల వరకు శిల్పాల నుండి పురాణాల వరకు పురాణాల నుండి అవతారాల వరకు ఈ మొత్తం ప్రక్రియను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది విష్ణు అవతారాలు ఒకేసారి పుట్టినవి కాదు కశలవారీగా నిర్మించబడిన భావన మొదట సమాజంలో నీతి కోసం కథలు పుట్టాయి తరువాత ఆ కథలు జాతక కథలుగా విస్తరించాయి తరువాత ఆ కథలు శిల్పాలుగా మారాయి తరువాత ఆ శిల్పాలకు కొత్త అర్థాలు ఇచ్చారు తరువాత పురాణ సాహిత్యం రూపుదిద్దుకుంది చివరికి అవి అవతారాలుగా స్థిరపడ్డాయి అంటే మొదట మనిషి ఉన్నాడు తరువాత కథ వచ్చింది తరువాత దేవుడు సృష్టించబడ్డాడు ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి మనము నమ్ముతున్నది చరిత్ర లేక కథా చాలామంది తమ సొంత గ్రంథాలు చదవరు పెద్దలు చెప్పినదే నిజమని నమ్ముతారు మా తండ్రికి వాళ్ళ తండ్రి చెప్పారు ఇప్పుడు నాకు చెబుతున్నారు అదే సాంప్రదాయం అని అనుసరిస్తారు కానీ ప్రశ్నించకుండా అనుసరించడం సాంప్రదాయం కాదు అది అజ్ఞానం ఏ సాహిత్యమైనా అర్థం చేసుకోవాలంటే అది ఎప్పుడు రాయబడింది ఏ సందర్భంలో రాయబడింది ఎలాంటి సమాజంలో పుట్టింది అన్నది తెలుసుకోవాలి లేకపోతే నీతి కథలు మహిమలుగా మారతాయి జ్ఞానం అజ్ఞానంగా మారుతుంది ప్రాచీన కాలంలో మనిషి ఎలా బ్రతకాలి నీతిగా ఎలా జీవించాలి అనే విషయాలు చెప్పడానికి కథలు చెప్పబడ్డాయి కానీ తర్వాత అదే కథలు అవతారాలుగా మారాయి మహిమలుగా మారాయి ప్రజలు జ్ఞానం కంటే భక్తిని ఎక్కువగా అనుసరించడం ప్రారంభించారు ఇక్కడే ఒక పెద్ద మార్పు జరిగింది ప్రశ్నించే సమాజం నమ్మే సమాజంగా మారింది ఇప్పుడు మనం ఏ దారిలో వెళ్ళాలి మళ్ళీ జ్ఞానాన్ని అనుసరించాలా లేక అజ్ఞానాన్ని కొనసాగించాలా చరిత్ర మనకు ఒక అవకాశం ఇస్తుంది నిజాన్ని తెలుసుకునే అవకాశం మన బాధ్యత ఏమిటి ఆధారాలతో ఆలోచించడం ప్రశ్నించడం సత్యాన్ని తెలుసుకోవడం మిత్రులారా మన చరిత్రను తిరిగి చదవాలి పరిశీలించాలి అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం నిజమైన జ్ఞాన సమాజంగా మారగలం చివరి సందేశం పేరు ఉంది కాబట్టి అవతారం కాదు కధ ఉంది కాబట్టి చరిత్ర కాదు ఆధారం ఉన్నప్పుడే అది నిజం ఇది నా చిన్న ప్రయత్నం మన దేశ నిజమైన చరిత్రను తెలుసుకోవడానికి తెలియజేయడానికి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment