అన్నమాచార్యుల కాలం నాటి కాలం అమ్మా ఇది. మా పూర్వీకులు చెప్పగా ఒక రోజు ఏకాంత సేవకి సమయం అవుతుంది.
అన్నమాచారి కాలం నాటి కాలం అమ్మా ఇది. మా పూర్వీకులు చెప్పగా మేము అందరం అదే కథని అందరికీ చెప్తున్నాం.
వారు అన్నమయ్య నిలయంలో వారు శయనిస్తూ ఉన్నారు. ఇంకా శయనోత్సవానికి స్వామి దగ్గరికి వెళ్లాలి, ఇంకా వెళ్ళలేదు. ఆ రోజు నిద్రపోయినాడు అన్నమాచార్యులు. అరే స్వామివారు పర్దా తీసి చూస్తున్నారంట. "ఆ ఇంకా అన్నమయ్య రాలేదా? నాకు సంకీర్తన పాడాలి. నేను నిద్రించాలి. ఆయన కీర్తన ఉంటేనే నాకు నిద్ర వస్తుంది" అన్న భావన చేసుకుంటూ ఉండి ఈ పక్క పర్దా తీసి అరే అన్నమయ్య రాలేదా? ఈ పక్క పర్దా తీసి అన్నమయ్య రాలేదా? అని చూస్తూ ఉన్నారంట. ఇంకా రాలేదు ఎవరిని పంపిద్దాము అన్నమయని పిలుచుకొని వచ్చేదానికి అనేసి ఎవరు పోకపోతే ఎవరి కైంకర్యాల్లో, ఎవరి సేవల్లో వాళ్ళందరూ నిమగ్నమై ఉన్నారు. స్వామివారే వెళ్లారు.
స్వయానా.
స్వయానా.
ఇది స్వామివారే నేరుగా అన్నమయ్య దగ్గరికి వెళ్లి "అన్నమయ్య, అన్నమయ్య ఇంకా నిద్రపోతున్నావా? నువ్వు వచ్చి నాకు సంకీర్తన పాడితేనే నాకు ఏకాంత సేవ జరుగుతుంది" అంటే అన్నమాచార్యులు టక్కున లేచి "స్వామి, నా ఇంటికి వచ్చేసారా? నా గృహానికి వచ్చేసారా? అయ్యో కూర్చోండి స్వామి. ఆసనం వేస్తున్నాను, క్షీరం ఇస్తాను." "అన్నమయ్య నాకు అదేది వద్దు. నువ్వు వచ్చి సంకీర్తన పాడితే చాలు. రా!" "స్వామి! ఇప్పుడే వచ్చేస్తున్నా! ఇప్పుడే వచ్చేస్తున్నా!" అంటే స్వామివారు పరిగెత్తు ఉన్నాడంట.
ఆ స్వామి పరిగెత్తుతూ ఉంటే అయ్యో ఎంత పాపిని నేను! నా స్వామి నా ఇంటికి వస్తే కనీసం ఆసనం వేయలేదు, క్షీరమైనా ఇవ్వలేదు, కనీసం తీర్థమైనా నేను అడగకపోయినానే. ఎంత పాపిని! స్వామి! వస్తున్నా వస్తున్నా అనేసి అన్నమాచార్యులు పరిగెత్తుతున్నాడు అన్నమాట. స్వామి వెనకాల. స్వామి పరిగెత్తుతున్నాడు అన్నమాచార్యులు పరిగెత్తుతున్నాడు. లోపలికి వెళ్ళేటప్పటికి పెద్దాయన కింద కూర్చున్నాడు.
వెంకటేశ్వర స్వామి అన్నమయ్యను చూసి అడేంటి స్వామి అలా కింద...
No comments:
Post a Comment